ఒకేసారి రెండు ఓటీటీల్లోకి కల్కి 2898 ఏడీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

www.mannamweb.com


రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’ దుమ్మురేపుతోంది. ఈ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల బిజినెస్ చేసింది. ఈ తో ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఆ అంచనాలను అందుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటూ ఇప్పటికి కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. జూన్ 27న విడుదలైన కల్కి ప్రభాస్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. ఈ ను థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ రిపీట్ గా చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఓటీటీలోకి ఇప్పట్లో రానట్టే అని తెలుస్తోంది.

‘కల్కి 2898 ఏడీ’ భారీ బడ్జెట్ . ఈ కోసం వైజయంతీ మూవీస్ 600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. ఇంత భారీ మొత్తంతో తీసినప్పుడు భారీగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే థియేటర్‌లో ఎక్కువ రోజులు నడవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ ఓటీటీ రిలీజ్ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కల్కి ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఒకవేళ ఈ ఓటీటీ రిలీజ్ అయితే ఈ రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

కొన్ని లు థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతాయి. థియేటర్‌లో బిజినెస్ లేనప్పుడు ఓటీటీలో ఇలా రిలీజ్ చేస్తారు. అయితే, ‘కల్కి 2898 ఏడీ’ విషయంలో అలా కాదు. రెండు నెలల తర్వాత నిర్మాతలు ‘కల్కి 2898ఏడీ’ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ లో మహాభారతం కూడా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ ను పార్టులుగా తీసుకురానున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటికే కల్కి పార్ట్ 2 షూటింగ్ చాలా వరకు అయ్యిందని తెలుస్తోంది.