తిన్న తర్వాత నడవని సోమరిపోతులు. ఇది తెలిస్తే, వారు ఈరోజే నడవడం ప్రారంభిస్తారేమో.

సాధారణంగా చాలామంది కూడా అన్నం తిన్న వెంటనే పడుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అది నిజానికి అంతా మంచిది కాదు. అసలు వ్యాయామం ఎండార్పిండ్లను విడుదల చేస్తుంది.


వ్యాయామం మానసిక స్థితిని మెరుగుపరచి ఒత్తిడిని తగ్గించుటకు ప్రధాన కారణమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. తిన్న తర్వాత నడవటం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందట. కండరాలు, కీళ్లను బలపరచడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. ప్రతిరోజు భోజనం తరువాత 10 నిమిషాలైనా వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. చాలామంది కూడా చేసే పొరపాటు భోజనం చేసిన తరువాత నిద్రించడం. ఇది మంచి అలవాటు కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు భోజనం చేసిన తరువాత పది నిమిషాలు నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఉన్నవారు భోజనం తర్వాత నడక ప్రారంభిస్తే బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందంటున్నారు వైద్యులు. తిన్న వెంటనే నడవడం వల్ల క్యాలరీలు తగ్గిపోతాయి. ఇలా చేస్తే బరువు పెరగకుండా ఉంటారు.

చాలామంది భోజనం తరువాత నిద్రించడం అలవాటుగా మారిపోయింది. భోజనం చేయగానే నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శరీరం బద్దకించటం వలన వాకింగ్ చేయడం మానేస్తారు. కానీ భోజనం తరువాత 10 నిమిషాల పాటు నడవడం వలన గుండెను బలపరచడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.రక్త పోటు, కొలెస్ట్రాల్ స్థాయిలో కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పోషకాలు కూడా సరిగ్గా అందుతాయి. తిన్న తర్వాత నడవడం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సుగర్ స్థాయిలు కూడా హఠాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది.

తిన్న తర్వాత 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఆహారం కూడా తేలిగ్గా జీర్ణం అవుతుంది. రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలాంటి సాధారణ వ్యాయామం ఎండార్పిండ్లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితులను మెరుగు పరచి ఒత్తిడిలను తగ్గిస్తుంది. తిన్న వెంటనే నడవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. కండరాలు, కీళ్ళను బలపరచటంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.