Lifestyle: చియా సీడ్స్, నిమ్మరసం కలిపి తీసుకోండి.. వారంలోనే మార్పు గమనిస్తారు..

మారుతోన్న జీవన విధానం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది రకరకాల మందులను వాడుతున్నారు.


ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం వేధించడం వంటి సమస్యలతో ఇబ్బందిపతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారి కోసం చియా గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి.

ముఖ్యంగా చియా గింజలు, నిమ్మకాయ రసం కలిపి తయారు చేసిన డ్రింక్‌ను క్రమం తప్పకుండా ప్రతీ రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నాన బెట్టిన చియా గింజల్లో ఉదయాన్ని కాస్త నిమ్మరసం పిండుకొని తాగాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఈ డ్రింక్‌ను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయటని చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరగడుపున ఈ డ్రింక్‌ను తీసుకుంటే డీ హైడ్రేహన్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నీటిని తక్కువగా తీసుకున్నా ఈ డ్రింక్‌ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటుందని చెబుతున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది పూర్తిగా జీరో క్యాలరీ డ్రింక్‌. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజంతా ఎక్కువగా బయట తిరిగే వారు ఈ డ్రింక్‌ను తీసుకుంటే డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉంటారు.

ఇక చియా గింజల్లో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల వంటి సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే హైబీపీతో బాధడేవారికి కూడా ఈ డ్రింక్‌ సహాయపడుతుంది. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ వల్ల మలబద్ధకం దూరమవుతుంది. రోజూ పరగడుపు ఈ డ్రింక్‌ తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది.