ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఫైర్

www.mannamweb.com


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. నిన్న ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ..
దేశంలోని పలు పార్టీల పనితీరును వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ పాలన చెప్పుకొదగ్గట్లు జరగలేదని, అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదని దీంతో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈ కారణంగానే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. పీకే మా దగ్గర కూడా ఐదేళ్లు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సలహాలు తీసుకుంటే మేము మనిగేవాళ్లం.. అందుకే రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పీకే మా నేతల దగ్గర దబ్బులు వసూలు చేసేవాడు. అతను మేనేజ్మెంట్ తప్ప చేసిందేమీ లేదు. బీహార్ లో పార్టీ పెట్టిన ఆయన్ను ప్రజలు తరిమేశారు. అందుకే ఆయన ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దీనిపై వైసీపీ తరుపున మేము ఎలాంటి చర్చకైన సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే నిన్నిటి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.