Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌

ఎన్టీఆర్‌ ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కారు సూపర్‌ స్టార్‌. అది చూసిన రామారావు, ఏఎన్నార్‌, దాసరి వంటి వారు కూడా షాక్‌ అయ్యారు. మరి `పెదరాయుడు` సమయంలో అసలేం జరిగిందంటే?
మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌
కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తున్నారు. చివరగా ఆయన `కన్నప్ప` మూవీలో మెరిశారు. ఇప్పుడు నానితో `పారడైజ్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విలన్‌గా కనిపించబోతున్నారు మోహన్‌ బాబు. ఈ క్రమంలో మోహన్‌ బాబుకి సంబంధించిన ఒక అరుదైన, ఆసక్తికర సంఘటన ఒకటి బయటకు వచ్చింది. అంతా నోరెళ్ల బెట్టే సంఘటన చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ కూడా ఆశ్చర్యపోయారు.
మోహన్‌ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `పెదరాయుడు`
మోహన్‌బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `పెదరాయుడు`. 1995లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. కలెక్షన్ల రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాకి రవిరాజా పనిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌ బాబుతోపాటు రజనీకాంత్‌ నటించారు. ఆయనది స్పెషల్‌ రోల్‌గా చెప్పొచ్చు. భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అటు మోహన్‌బాబు కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. మరోవైపు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది.
రీమేక్‌ చేయమని మోహన్‌ బాబుకి చెప్పిన రజనీకాంత్‌
అయితే ఈ మూవీ తమిళంలో వచ్చిన `నట్టమై` అనే చిత్రానికి రీమేక్‌. అందులో శరత్‌ కుమార్‌ నటించారు. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కడ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. ఈ సినిమాని చూసిన రజనీకాంత్‌ తెలుగులో రీమేక్‌ చేయాలని మోహన్‌ బాబుకి సలహా ఇచ్చారు. మోహన్‌ బాబు మూవీ చూసి రీమేక్‌ రైట్స్ తీసుకున్నారు. రజనీకాంత్‌ చెప్పడం వల్లే ఈ రీమేక్‌ రైట్స్ మోహన్‌ బాబుకి వరించాయి. అయితే ఇందులో పాపారాయుడు పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రకి ఎవరిని తీసుకోవాలనేది మోహన్‌ బాబుకి అర్థం కాలేదు. ఇదే చర్చ రజనీకాంత్‌తో వచ్చింది. `అరేయ్‌ ఆ పాత్రని నేనే చేస్తున్నా` అని చెప్పారాట రజనీకాంత్‌.


ఎన్టీఆర్‌ ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కిన రజనీకాంత్‌
రజనీకాంత్‌, మోహన్‌ బాబు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ స్నేహంతోనే కలెక్షన్‌ కింగ్‌కి ఈ మూవీ వచ్చేలా చేశారు. అంతేకాదు పాపారాయుడు పాత్రని తానే పోషించారు. అయితే ఇందులో మరో విశేషమేంటంటే, పాపారాయుడు పాత్రలో తాను నటించేందుకే మోహన్‌బాబుతో ఈ రీమేక్‌ రైట్స్ కొనిపించారట రజనీ. దానికి మోహన్‌ బాబు కూడా ఒప్పుకున్నారు. ఈ సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి, రామానాయుడు వంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ క్లాప్స్ అయిపోగానే మోహన్‌ బాబు పూలదండని రజనీకాంత్‌ మెడలో వేశారు. అది వెంటనే తీసి మోహన్‌ బాబుకి వేశారట రజనీకాంత్‌. అంతేకాదు అందరి ముందే మోహన్‌ బాబు కాళ్లు మొక్కారట రజనీకాంత్‌. ఇది చూసి అంతా షాక్‌.

మోహన్‌ బాబు మంచి మనసుకి నమస్కారం
మోహన్‌బాబు కాళ్లని రజనీకాంత్‌ మొక్కడమేంటి? అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రజనీకాంత్‌ అప్పటికే కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ గా రాణిస్తున్నారు. అంతటి పెద్ద స్టార్‌ మోహన్‌ బాబు కాళ్లని మొక్కడంతో ఒక్కసారిగా అంతా నోరెళ్లబెట్టారు. అయితే ఈ సందర్భంగా ఏంట్రా ఇది అని మోహన్‌ బాబు అడగ్గా, `అరేయ్‌ నీ మంచి మనసుకి మొక్కానురా` అన్నారట. ఈ విషయాన్ని మోహన్‌ బాబునే స్వయంగా వెల్లడించారు. ఆ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

 

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.