త్రిపుర (Tripura) లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife) ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు రాత్రంతా ఇంట్లోనే గడిపాడు. తెల్లవారుజామున పోలీస్స్టేషన్కు వెళ్లి, జరిగిన విషయం చెప్పి లొంగిపోయాడు. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. అమ్తాలీ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే శ్యామ్లాల్ దాస్ మంగళవారం రాత్రి తన భార్య స్వప్నతో గొడవపడ్డాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో క్షణికావేశానికి లోనైన శ్యామ్లాల్ బరువైన వస్తువుతో ఆమెను గట్టిగా కొట్టాడు. దాంతో ఆమె విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం రాత్రంతా అతను ఇంట్లో భార్య మృతదేహంతో ఇంట్లోనే ఉన్నాడు. తెల్లవారుజామున పోలీస్స్టేషన్కు వెళ్లి హత్య విషయం చెప్పాడు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం ఘటనా ప్రాంతానికి వెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.