నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్​మెంట్.. త్వరలో అఫీషియల్ అనౌన్స్​మెంట్

www.mannamweb.com


టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. టాప్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన ఆయన కొన్నాళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. అక్టోబర్ 6, 2017న వీళ్లిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. క్యూట్ పెయిర్​గా పేరు తెచ్చుకున్న వీళ్లు.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత ఎవరి కెరీర్​లో వాళ్లు బిజీ అయిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్​లు, టెలివిజన్ షోస్​ చేసుకుంటున్నారు అయితే చైతూ మాత్రం స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో లవ్​లో ఉన్నాడని పుకార్లు రావడం మొదలైంది. వాళ్లిద్దరూ డేటింగ్​ చేస్తున్నారంటూ నెట్టింట కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఈ గాసిప్స్​పై వాళ్లు ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అలాగని కొట్టిపారేయనూ లేదు. అలాంటి తరుణంలో తాజాగా చై-శోభిత రిలేషన్​కు సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నాగ చైతన్య వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నేడు అనగా ఆగస్ట్‌ 8, గురువారం నాడు వీళ్ల ఎంగేజ్​మెంట్ జరగనుంది. కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితులు, స్నేహితులతో పాటు కొద్దిమంది ఇండస్ట్రీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. చైతూ-శోభిత ఎంగేజ్​మెంట్​పై కింగ్ అక్కినేని నాగార్జున గురువారం అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేస్తారని తెలిసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. చైతూ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అంటున్నారు. అయితే ఈ ఎంగేజ్​మెంట్​పై అక్కినేని ఫ్యామిలీ లేదా శోభిత నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూద్దాం.

ఇక సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక శోభిత విషయానికి వస్తే టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. ఇక తాజాగా కల్కి చిత్రంలో దీపికకు శోభితానే డబ్బింగ్‌ చెప్పింది. ఇక నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌ వార్తలపై సమంత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. అధికారిక ప్రకటన వచ్చాక స్పందిస్తుందేమో చూడాలి అంటున్నారు.