మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌..కేస్‌లోనే టచ్‌ స్క్రీన్..

www.mannamweb.com


అర్బన్‌ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. సరికొత్త డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేశారు. కేస్‌లోనే టచ్ స్క్రీన్ డయలర్‌ను కలిగి ఉండడం ఈ ఇబయర్‌ బడ్స్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

యూజర్ల దీంతో ఇబయర్‌ బడ్స్‌ నుంచే నేరుగా కాల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. భారత్‌లో ఈ ఫీచర్‌తో వస్తున్న మొట్టమొదటి ఇయర్‌ బడ్స్‌ ఇదేనని చెబుతున్నారు.

ఆన్ కేస్‌ బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ సహాయంతో సింగిల్‌ ట్యాప్‌తో కాల్‌ చేసుకోవచ్చు. ఈ ఇయర్‌ బడ్స్‌లో 32డీబీ వరకు నాయిస్‌ క్యాన్సెలేషన్‌ టెక్నాలజీని అందించారు. ఫోన్‌ను జేబులో నుంచి తీయకుండానే డయలర్‌ ప్యాడ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

ఇక కేస్‌పై హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లేపై మీకు నచ్చిన వాల్‌ పేపర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ యాప్ సహాయంతో పని చేస్తుంది. యాప్ ద్వారా వినియోగదారులు ఇయర్‌బడ్స్ సెట్టింగ్‌లు, ప్లేబ్యాక్, EQ మోడ్‌లను సెట్ చేసుకోవచ్చు.

ఇక ఇందులో స్మార్ట్ ఇన్-ఇయర్ డిటెక్షన్ ఫీచర్‌ను ఇచ్చారు. దీంతో బడ్స్‌ను తీసిన వెంటనే మ్యూజిక్‌ దానంతటదే పాజ్ అవుతుంది. ఒక ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 48 గంటలు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. టైప్-సి ఛార్జింగ్‌ పోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ధర విషయానికొస్తే రూ. 5999కాగా ప్రస్తుతం ఆఫర్‌లో భాగంగా రూ. 2499కి లభిస్తోంది.