NPS New Rules: పెన్షన్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ఇప్పుడే తెలుసుకోండి.

NPS New Rules: పెన్షన్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ఇప్పుడే తెలుసుకోండి..
మీరు ఈ ఎన్పీఎస్ ఖాతా కలిగి ఉంటే.. మీకో అలర్ట్. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్లో కొన్ని నిబంధనల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా పాక్షిక ఉపసంహరణలు(పార్షియల్ విత్ డ్రాయల్స్)పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని అమలు చేయనుండటంతో అందరూ వీటిపై అవగాహన కలిగి ఉండటం మేలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్).. ఇటీవల కాలంలో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. పన్ను ప్రయోజనాలు అందించడంతో పాటు పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇస్తుండటంతో దీనిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ ఎన్పీఎస్ ఖాతా కలిగి ఉంటే.. మీకో అలర్ట్. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్లో కొన్ని నిబంధనల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా పాక్షిక ఉపసంహరణలు(పార్షియల్ విత్ డ్రాయల్స్)పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని అమలు చేయనుండటంతో అందరూ వీటిపై అవగాహన కలిగి ఉండటం మేలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎఫ్ఆర్డీఏ కొత్త మార్గదర్శకాలు ఇవి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి పాక్షిక ఉపసంహరణల కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జనవరి 12న విడుదల చేసిన పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ ప్రకారం..
ఎన్పీఎస్ ఖాతాదారులు ఇప్పుడు ఉన్నత విద్య, వివాహం, నివాస గృహాల కొనుగోళ్లు, వైద్య ఖర్చుల వంటి ప్రయోజనాల కోసం పాక్షిక ఉపసంహరణలు చేయవచ్చు.
పాక్షిక ఉపసంహరణ ఎంత ఉండాలంటే.. ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 25 శాతానికి మించకుండా విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ఖాతాదారుడు చెల్లించే మొత్తం నుంచే ఉంటుందని.. దానిపై వచ్చే రిటర్న్‌లు పాక్షిక ఉపసంహరణకు అర్హత కలిగి ఉండవని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
సబ్‌స్క్రైబర్ తన పదవీ కాలంలో గరిష్టంగా మూడు ఉపసంహరణలు చేయడానికి అనుమతి ఉంటుంది. 25 శాతం వరకు పాక్షిక ఉపసంహరణకు అర్హత పొందేందుకు సబ్‌స్క్రైబర్ ఎన్ఫీఎస్ ఖాతా తప్పనిసరిగా మూడు సంవత్సరాలు కాల వ్యవధి నిండి ఉండాలి.
ఈ ప్రత్యేక సమయాల్లో కూడా..
ఎన్పీఎస్ పెట్టుబడిదారులు నివాస గృహం లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కోసం పాక్షిక ఉపసంహరణలు చేయడానికి కూడా అనుమతి ఉంటుంది. అయితే, చందాదారు వారి పూర్వీకుల ఆస్తి కాకుండా ఇతర నివాస గృహం లేదా ఫ్లాట్ కలిగి ఉంటే, ఉపసంహరణకు అనుమతి ఉండదు.
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కోవిడ్-19 మరియు ప్రాణాంతక ప్రమాదాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆసుపత్రిలో చేరడం, చికిత్స చేయడం వంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో, అటువంటి ఖర్చులను కవర్ చేయడానికి పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
సబ్‌స్క్రైబర్ తమ ఎన్‌పీఎస్ ఖాతా నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ లేదా ఏదైనా ఇతర స్వీయ-అభివృద్ధి కార్యకలాపాల కోసం కూడా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని లేదా స్టార్టప్‌ను స్థాపించాలనుకుంటే, మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
అర్హత.. ఉపసంహరణ అభ్యర్థన..
పాక్షిక ఉపసంహరణ ప్రయోజనాలకు అర్హత పొందడానికి పెట్టుబడిదారు కనీసం మూడు సంవత్సరాలు ఎన్పీఎస్ లో సభ్యునిగా ఉండాలి. ఇది చందాదారుల మొత్తం సహకారంలో 25 శాతానికి మించకూడదు. ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు మూడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. తదుపరి పాక్షిక ఉపసంహరణల కోసం, మునుపటి పాక్షిక ఉపసంహరణ తేదీ నుండి సబ్‌స్క్రైబర్ చేసిన కంట్రీబ్యూషన్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

సబ్‌స్క్రైబర్ తమ ఉపసంహరణ అభ్యర్థనతో పాటు ఉపసంహరణ ఉద్దేశాన్ని పేర్కొంటూ సెల్ఫ్-డిక్లరేషన్‌ను సమర్పించాలి. పత్రాలను వారి సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయానికి సమర్పించాలి.