దర్శక ధీరుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో SSMB29 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ను రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
అయితే దీనికి రాజమౌళి ఓ క్యాప్షన్ కూడా జోడించారు. పృథ్వీతో ఫస్ట్ షాట్ పూర్తి అయిన వెంటనే అతని దగ్గరకు వెళ్లి.. తనకు తెలిసిన మంచి నటుల్లో మీరు ఒకరని చెప్పానని అన్నారు. ఈ సినిమాలో పృథ్వీ పేరు కుంభ అని పెట్టినట్లు తెలిపారు. శక్తివంతమైన, క్రూరమైన విరోధికు ప్రాణం పోయడం సంతృప్తికరమని రాజమౌళి ఈ క్యాప్షన్ ఇచ్చారు.
































