ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పర్వతీపురం-మన్యం, ఎస్.కోట వంటి అంతర్గత ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.
ఇదే సమయంలో, విశాఖపట్నం మరో దఫా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) సూచనల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తూర్పు తీరంలో ఈ వర్షాలు కొనసాగుతాయి. విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి. నగరవాసులు ఇంటిలోనే ఉండాలని ..అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో గత 24 గంటల్లో 80-100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఎస్.కోట, గజపతినగరం, పర్వతీపురం-మన్యం వంటి ప్రాంతాలకు విస్తరించింది. విశాఖపట్నం నగరంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. తీరం వెంబడి ఆవరించిన మేఘాల వల్ల నగరంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో భారీ వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు (40-50 కి.మీ./గం.) ఉండే అవకాశం ఉంది. గత 24 గంటల్లో నగరంలో 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది .
అల్పపీడనం కారణంగా ఉత్తర ఆంధ్ర లో సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, ఇతర ప్రాంతాలకు యెల్లో హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, విజయనగరం నివాసులు ఇంటిలోనే ఉండాలని అత్యవసరంఅయితే తప్ప బయటకు రావొద్దని సలహాలిస్తున్నారు. అత్యవసర సేవల కోసం 100 (పోలీస్), 108 (అంబులెన్స్), 1070 (విపత్తు నిర్వహణ) నంబర్లను సంప్రదించవచ్చు. వర్షాలు అక్టోబర్ 2 వరకు కొనసాగే అవకాశం ఉన్నందున, స్థానిక యంత్రాంగం నిరంతరం వాతావరణ సమాచారాన్ని అందజేస్తుంది.
































