Ram Charan: బాబాయ్ తో అబ్బాయ్.. ఎన్నిరోజులు అయ్యింది ఈ ఫ్రేమ్ చూసి..

Ram Charan: పిఠాపురం హోరెత్తిపోతుంది. ఇప్పటికే పిఠాపురం పవన్ నివాసం మాత్రమే కాకుండా సెలబ్రిటీ హట్ గా మారిపోయింది. ఇక ఈరోజు పిఠాపురం ఒక చిన్నపాటి సంద్రంగా మారింది.


అందుకు కారణం నేడు పిఠాపురానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రావడమే. రామ్ చరణ్, అతని తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ ఉదయాన్నే పిఠాపురం చేరుకున్నారు. అక్కడ కుక్కుటేశ్వర ఆలయంలో సురేఖ పూజలు చేయనున్నారు.

ఇక దీనికన్నా ముందు చరణ్ పిఠాపురంలో అడుగుపెట్టగానే పవన్ నివాసానికి వెళ్ళాడు. అక్కడ బాబాయ్ పవన్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చాలాకాలం తరువాత బాబాయ్- అబ్బాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ భుజాన చెయ్యి వేసి పవన్ అభిమానులకు అభివాదం చేసిన తీరు అక్కట్టుకుంటుంది. పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది అని అందరికి తెలుసు.

చరణ్ సైతం తన బాబాయ్ కు ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే వస్తున్నాడు. ఇక కొద్దిసేపటిలో చరణ్ జనసేన ప్రచారంలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక చరణ్ ను చూడడానికి పిఠాపురం పోటెత్తింది. పవన్ ఇంటివద్ద జన సందోహం సంద్రంలా మారింది. పవన్ ను గెలిపించడానికి చరణ్ ప్రచారం చేస్తున్నాడు అని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇక చరణ్ సినిమా కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.