హైదరాబాద్ చరిత్రలో తొలిసారి.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు.. మొత్తం మత్తెక్కించేశారుగా

తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా రికార్డు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే ఇదివరకు ఎన్నడూ లేనంతగా మద్యం తాగేశారు మందుబాబులు. భాగ్యనగర చరిత్రలో తొలిసారిగా 2025 డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.


5,100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా డిసెంబర్ 30న దాదాపు రూ.375 కోట్లు, డిసెంబర్ 31న ఒక్క రాత్రిలో రూ. 350 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా డిసెంబర్ డివరి రెండు రోజుల్లో దాదాపు రూ. 750 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయని సమాచారం.

గత రికార్డు బ్రేక్..

కాగా, 2025 డిసెంబర్‌లో చివరి ఐదు రోజుల వ్యవధిలోనే రూ. 1,344 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలా ఒకే నెలలో రూ. 5 వేల కోట్లకు మించి లిక్కర్ సేల్స్ జరగడం ఇదే తొలిసారి అని.. దీన్ని ఆల్‌టైం రికార్డ్‌గా పేర్కొంటున్నారు. 2023 డిసెంబర్‌లో నమోదైన మద్యం అమ్మకాల రికార్డు రూ. 4,300 కోట్లను ఈ డిసెంబర్ బ్రేక్ చేసింది. మద్యానికి డిమాండ్ పెరగడంతో.. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు వేసింది.లిక్కర్ సేల్స్ పెరగడానికి కారణాలివే..

2025 డిసెంబర్‌లో లిక్కర్ సేల్స్ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నిక వేళ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దానికి తోడు న్యూఇయర్ వేడుకలు కూడా తోడయ్యాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. కొత్తగా ఏర్పాటైనా మద్యం షాపుల్లో అనేక రకాల మద్యం బ్రాండ్లు, ఫ్లేవర్లు అందుబాటులో ఉంచారట. దీని వల్ల కూడా న్యూఇయర్ వేడుకల వేళ అమ్మకాలు జోరుగా సాగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, ఒంటి గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్‌ శాఖ అనుమతించింది. అమ్మకాలు మరింత పెరగడానికి ఇవి దోహదం చేశాయి. లిక్కర్ సేల్స్ పెరగడంతో కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణాల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీని వల్ల ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.

2025 డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డు క్రియేట్ చేయడం ఇది రెండో సారి. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో.. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగాయని చెప్పారు. చలి పులి పంజా విసిరినా.. బీర్ల అమ్మకాలు జోరుగా సాగడం గమనార్హం. అందుకే నాలుగు రోజుల్లోనే 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని అధికారులు చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.