తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద

www.mannamweb.com


హాలహర్వి: ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు తగ్గడంతో జలాశయానికి మంగళవారం 92,636 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 1629.16 అడుగులకు గాను 91 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. వివిధ కాల్వలకు, నదికి 11,657 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.