RK Roja: రూ. 100 కోట్లతో ఆడుకున్నారు!.. మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు

ఫిర్యాదు పత్రం ప్రతిని చూపుతున్న ఆర్డీ ప్రసాద్, చిత్రంలో రుత్తుల అప్పలస్వామి, ఆర్‌.బాలునాయక్‌
ఫిర్యాదు పత్రం ప్రతిని చూపుతున్న ఆర్డీ ప్రసాద్, చిత్రంలో రుత్తుల అప్పలస్వామి, ఆర్‌.బాలునాయక్‌

www.mannamweb.com


‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు.

‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జరిగిన రూ.100 కోట్ల అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతూ ఈ నెల 11న అదనపు డీజీపీ (సీఐడీ)కి ఫిర్యాదు చేశానన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, శాప్‌ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని కోరానన్నారు. క్రీడా కోటా ద్వారా మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైనా విచారణ చేపట్టాలన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్‌ చేయాలని ఆయన కోరారు. ఐదేళ్ల కాలంలో శాప్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడరన్‌ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తుల అప్పలస్వామి, టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్‌.బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేవీ నాంచారయ్య పాల్గొన్నారు.