Roja: YSRCP వాళ్లే TDPకి ఓటెయ్యమంటున్నారు

Roja: వైఎస్సార్ కాంగ్రెస్ నగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి రోజా షాకింగ్ కామెంట్స్ చేసారు. తనకు నగిరిలో తెలుగు దేశం పార్టీ వాళ్లతో ఎలాంటి సమస్యలు లేవని..
కానీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్ట్‌లు తీసుకున్నవాళ్లు నగిరిలోని అన్ని బూత్‌లు తిరిగి మరీ తెలుగు దేశం పార్టీ వారికి ఓటెయ్యాలని చెప్తున్నారని అన్నారు. కేజే కుమార్ వంటి వాళ్లు ఎయిర్‌పోర్ట్‌లో జగన్ మోహన్ రెడ్డిని పలకరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్నారని.. మరోపక్క తెలుగు దేశం పార్టీ వాళ్లకు ఓటెయ్యాలంటూ సైకిల్ ఎక్కి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపణలు చేసారు.