రూ.15 వేల పెన్షన్.. వారికి మాత్రమే: మంత్రి నిమ్మల

అమరావతి: విడతల వారీగా కాకుండా ఒకేసారి పెంచిన పెన్షన్ మొత్తం అందిస్తున్న ఘనత టీడీపీ ఛీఫ్ నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


గత ప్రభుత్వం విడతల్లో పెన్షన్లు పెంచడంతో దివ్యాంగులు, పేదలు నష్టపోయారని ఆరోపించారు. మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్న వారికి త్వరలోనే రూ.15వేల పెన్షన్ అందించే ఆలోచన ఉందని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు అందించడం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.