జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సన్నాహాలు.

MPTC, ZPTC Elections : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది.


సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

సెప్టెంబరు 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితా.. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని, 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.