‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటారు పెద్దలు. అందుకే దైవదర్శనానికి వచ్చే భక్తుల ఆకలిదప్పికలు తీర్చేలా వారిని అక్కున చేర్చుకుంటోందీ కోనసీమ జిల్లాలోని పైండా సత్రం. ద్రాక్షారామ పంచారామ క్షేత్రంలోని భీమేశ్వరుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి. స్వామివారి దర్శనానికి తెలుగురాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. దూరపాంత్రాల నుంచి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు పైండా కుటుంబీకులు. ఎంతమంది వచ్చినా.. ఏ సమయంలో వచ్చినా లేదనకుండా అన్నార్తుల కడుపునింపుతున్నారు. పైసా విరాళం తీసుకోకుండా 200 ఏళ్లుగా నిరుపమాన సేవలందిస్తోన్న పైండా సత్రం విశేషాలు తెలుసుకుందాం రండి.
- Bhakthi
- Special Articles ( Usefull Info )
- Interesting
- Must Read
- success stories / Inspiration
- News
- Tourism News
- Viral News



































