హార్దిక్ పాండ్యాకు షాక్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే..

www.mannamweb.com


భారత్-శ్రీలంక మధ్య జూలై 27 నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించారు.

అదే సమయంలో రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఈ పర్యటనలో రెండు సిరీస్‌లకు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), సంజు శాంసన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.