Soaked Peanuts: 30 రోజుల పాటు నానబెట్టిన వేరుశనగలు తింటే.. 100 రోగులకు చెక్ ?

వేరుశనగ సామాన్యుడి జీడిపప్పు అని పిలుస్తూ ఉంటారు. వేరుశనగలో కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి అవి గుండెకు ఎంతో మేలుని చేస్తాయి.


చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో వేరుశనగ సహాయం చేస్తుంది. ఈ గింజలను నీటిలో నానబెట్టడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

నానబెట్టిన వేరుశనగలను ఖాళీ కడుపుతో తిన్నట్లయితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నానబెట్టిన వేరుశనగలను ప్రతిరోజు ఉదయం పూట తిన్నట్లయితే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వేరుశనగలో పుష్కలంగా ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు కంటి చూపులు కాపాడుతాయి.

జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం, కాలుష్యం అధికంగా ఉండే వేరు శనగలను ఖాళీ కడుపుతో తిన్నట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి. అంటు వ్యాధులను సైతం నివారించడంలో వేరుశనగ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు గుప్పెడు నానబెట్టిన వేరుశనగలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.