వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 17.651 శాతం డీఏను ఖరారు చేసింది. 2025 , జూలై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు కానుంది.


డీఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ డీఏ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై నెలకు 9.39 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.