టీచర్లను గదిలో పెట్టి తాళం వేసి ఆందోళన చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు

*టీచర్లను గదిలో పెట్టి తాళం*


» రెగ్యులర్ టీచర్లను నియమించాలని తల్లిదండ్రుల డిమాండ్

నూతిపాడు (విస్సన్నపేట), జనవరి 30: పాఠశాలకు రెగ్యులర్ టీచర్లను నియ మించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యుటేషన్పై వచ్చిన ఇద్దరు టీచర్లను తరగతి గదిలో బంధించి.. పాఠశాల ఎదుట రోడ్డుపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాఠశాలకు వెంటనే రెగ్యులర్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి శివారు నూతిపాడు ఎంపీయూపీ పాఠశాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కాగా, టీచర్లను తరగతి గదిలో బంధించిన విషయం తెలుసుకున్న తిరువూరు పోలీసులు వచ్చి విద్యార్థుల తల్లి దండ్రులతో చర్చించారు. సమస్యను ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్క రిస్తామని ఎంఈవో-2 హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.