సేవా భావంతో మారిన పాఠశాల రూపురేఖలు.

 చిన్నపాటి వర్షం కురిసిన పాఠశాల ప్రాంగణం బురదమయం అవుతూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన మురళి పంతులు యువసేన సభ్యులు సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు.


బుధవారం పెద్ద శంకరంపేట కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మురళి పంతులు యువసేన సభ్యులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో పాఠశాల ప్రాంగణాన్ని చదును చేయించి నేల గట్టిగా ఉండేలా స్టోన్ చిప్స్ వేసి విద్యార్థులు జారకుండా క్రీడలు ఆడుకునేలా సదుపాయం కల్పించారు. అదనంగా పాఠశాల ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చారు. మురళీ పంతులు యువసేన సేవాభావంతో పాఠశాల కొత్త అందాలను సంతరించుకోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ యువసేన సభ్యులను అభినందనలు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.