ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్ప పండితుడు, తత్వవేత్త, అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఇక చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా సమాజానికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
అవి నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
చాణక్యడు బంధాలు, బంధుత్వాలు, మనీ విజయాలు, ఓటమి ఇలా చాలా విషయాల గురించి వివరించడం జరిగింది. అదే విధంగా ఆయన ఒక వ్యక్తి జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సీక్రెట్స్ బంధువులకు చెప్పకూడని తెలిపారు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఒక వ్యక్తి తమ స్నేహితులు లేదా బంధువులకు తమ దగ్గర ఉన్న ధనం గురించి ఎట్టిపరిస్థితుల్లో తెలియజేకూడదంట. దీని వలన ఇది తర్వాత తర్వాత చాలా సమస్యలను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ధనం మీరు ఇతరులకు చెప్పడం వలన ఆ ధనం మీ దగ్గర నిలవదు అని చెప్తున్నాడు ఆ చార్య చాణక్యుడు. అందుకే మీ ఇంటిలోని డబ్బు గురించి ఇతరులకు చెప్పకూడదంట.
అదే విధంగా కొంత మంది తమకు ఉన్న అప్పుల గురించి, సమస్యల గురించి పదే పదే చెబుతుంటారు. అయితే ఆ చార్య చాణక్యుడు మీ సమస్యలు, అప్పుల గురించి ఇతరులకు చెప్పకూడదు. ఇది అస్సలే మంచిది కాదు, దీని వలన ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయని తెలిపాడు. అలాగే తాహతకు మించి అప్పు చేయడం , డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేసే వారి వద్ద ధనం నిలవదంట.
కుటుంబ సమస్యలను కూడా ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదంట. దీని వలన మీ కుటుంబ గౌరవాన్ని మీరే పొగొట్టినట్లు అందుకే ఎంత కష్టం వచ్చినా సరే , మీ ఇంటి సమస్యలు, మీరు తినేది, తిననిది ఇలా ఏదైనా సరే మూడో వ్యక్తికి తెలియకూడని చెబుతున్నాడు ఆ చార్య చాణక్యుడు.
































