తెలుగురాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన వ్యక్తుల జాబితా చూసుకుంటే అందులో దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మురలి దివి మొదటి స్థానంలో ఉన్నారు.
ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ. 76,000 కోట్లు. ఈయన జాతీయ స్థాయిలో 26వ స్థానంలో ఉన్నారు. అలాగే దివిస్ లాబొరేటరీస్ మెడిసిన్ తయారీలో ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన సంస్థగా ఉంది.
ఇక అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో రెండో స్థానంలో ఉన్నది మేఘ ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఛైర్మన్ పి. పిచ్చి రెడ్డి. ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ. 54,800 కోట్లు. ఇయనను మాస్టర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు.
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో మూడో ప్లేస్లో ఉన్నది మేఘ ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సహ వ్యవస్థాపకుడు పి.వి. కృష్ణ రెడ్డి. ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ.52,700 కోట్లు. అతి చిన్న వయస్సులోనే ఈ తెలుగురాష్ట్రాల్లో అత్యంత ధనవంతుల జాబితో చేరిన వ్యక్తి ఈయన
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో నాలుగో స్థానంలో ఉన్నది హెటెరో ల్యాబ్స్ వ్యవస్థాపకుడు బి. పార్థసారధి రెడ్డి. ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ. 29,900 కోట్లు. ఫార్మా రంగంలో ఈయన ప్రసిద్ధి చెందిన వ్యక్తుల్లో ఒకరు.
ఇక తెలుగురాష్ట్రాలలో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఐదో స్థానంలో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పివి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఈయన నెట్వర్త్ వచ్చేసి రూ.. 19,000 కోట్లు. ప్రపంచానికి నాణ్యమైన ఔషధాన్ని అందించడంలో అరబిందో అగ్రగామిగా ఉంది.
































