కేవలం రూ. 6 లక్షల ఖర్చుతో 27 దేశాలను చుట్టేసిన ఇద్దరు స్నేహితులు.. ఎలాగో తెలుసా?

www.mannamweb.com


ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రదేశాల్లో పర్యటించడం, కొత్త విషయాలను అన్వేషించడం చాలా మందికి హాబీ. యూరప్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు ఫరీనమ్, లఫుంటే అనే ఒక యాత్రికులు గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని చుట్టేందుకు ప్రయాణాన్ని ప్రారంభించారు.

వీరిద్దరూ విమానంలో ప్రయనించ కూడా ఇప్పటి వరకు 27 దేశాలను సందర్శించడం వీరి ప్రయాణంలో అత్యంత ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి తోడ్పడటమే కాకుండా తమ డబ్బు కూడా ఆదా చేసుకున్నట్లు చెప్పారు.

ఇటలీకి చెందిన 25 ఏళ్ల టొమ్మసో ఫరీనమ్, స్పెయిన్‌కు చెందిన 27 ఏళ్ల అడ్రియన్ లఫుంటే తమ ప్రయాణాన్ని చిరస్మరణీయం చేసుకోవాలనుకున్నారు. అందుకే అతను పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని మొదలు పెట్టారు. విమానంలో ప్రయాణించడానికి బదులుగా ఇద్దరూ పడవల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. గత 15 నెలల్లో వీరిద్దరూ 27 దేశాలను సందర్శించారు. స్నేహితులిద్దరూ తమను తాము ‘స్థిరమైన’ అన్వేషకులుగా పిలుచుకుంటారు.

తన పర్యటన పర్యావరణాన్ని పరిరక్షించడమే కాదు డబ్బును కూడా ఆదా చేసిందన్నారు. స్నేహితులిద్దరూ కేవలం $7,700 (సుమారు రూ. 6,46,000)తో ఇప్పటివరకు 27 దేశాలను సందర్శించారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ వీరిద్దరూ మొదటిసారిగా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు పడవలో ప్రయాణించడం గురించి విన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. ముఖ్యంగా ఎలాంటి అనుభవం లేకుండానే పసిఫిక్ సముద్రాన్ని దాటబోతున్నామని చెప్పారు.