Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం

Video: విజయ గర్వంతో భారత్ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం


టీమిండియా స్వదేశానికి చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు.

ప్రపంచ కప్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.

భారత క్రికెటర్లు షెడ్యూల్‌ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ తుపాను వల్ల బార్బడోస్‌ విమానాశ్రయాన్ని మూసి వేయడంతో అక్కడే హోటల్‌లో ఉన్నారు. ఇప్పుడు తుపాను కాస్త తగ్గడంతో భారత ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, తీసుకొచ్చింది.

ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టీమిండియా దిగింది. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం భారత క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని, తమ సొంత నగరాలకు వెళ్తారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.