Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..

Viral News: చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది.


పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది. అమ్మాయి మాటలను నిజం అని అంగీకరించడం వెనుక ఒక వాదన ఏమిటంటే, అమ్మాయి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె పుట్టినప్పటి నుండి గుజరాతీ మాట్లాడే వారితో నివసించింది. కానీ కొన్నిసార్లు ఆమె హిందీలో అనర్గళంగా మాట్లాడటం ప్రారంభించింది. ఆమె గత జీవిత కథను హిందీలో చెప్పడం ప్రారంభించింది.

అసలు విషయమేమింటే గుజరాత్‌లోని బనస్కాంత ప్రాంతంలో నివసించే ఐదేళ్ల చిన్నారి దక్ష.. ఇది తన పునర్జన్మ అని చెప్పింది. దక్ష హిందీ మాట్లాడినప్పుడు ఆమె కుటుంబంతో సహా గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయారు. 23 ఏళ్ల క్రితం తాను కచ్ జిల్లాలోని అంజర్ ప్రాంతంలో నివసించినట్లు ఆ బాలిక తెలిపింది. గత జన్మలో తనతో పాటు తన కుటుంబం 2001 భూకంపంలో మరణించారని వెల్లడించింది. దక్ష వాదనలతో కూడిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం దక్ష తన తల్లిదండ్రులతో ఖాసా గ్రామంలో నివసిస్తుంది. దక్ష తండ్రి జేతాజీ ఠాకూర్ వ్యవసాయం పనిచేస్తున్నాడు. జేతాజీ ఠాకూర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తన కుమార్తె చుట్టూ ఎవ్వరూ ఎప్పుడూ హిందీ మాట్లాడరని ఆ బాలిక తండ్రి జేతాజీ ఠాకూర పేర్కొన్నారు. కానీ ఆమె హిందీని అనర్గళంగా మాట్లాడటం ఎక్కడ నుండి నేర్చుకుందో తనకు తెలియదన్నారు. జేతాజీ ఠాకూర్, అతని భార్య గీతాబెన్ మొదటిసారిగా దక్ష హిందీ మాట్లాడటం విన్నప్పుడు.. వారు ఆమెతో మాట్లాడి హిందీ మాట్లాడటం ఎలా నేర్చుకున్నారని అడిగారు. అప్పుడు దక్ష దేవుడు తనను ఇక్కడికి పంపాడని చెప్పింది. ఆమె మునుపటి జీవితంలో అంజార్‌లో నివసించిందని, ఆమె పేరు ప్రింగిల్ అని తెలిపింది. దక్ష తాను అంజార్‌లో నివసించినట్లు, ఆమె మరణించిన రోజున పాఠశాల నుంచి తిరిగి వస్తున్నట్లు చెబుతోంది. భవనం పైకప్పు కూలిపోవడంతో మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో తన తల్లిదండ్రులు కూడా చనిపోయారని చెప్పింది. మళ్లీ అంజర్‌ వద్దకు వెళ్లాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు, దక్ష వెళ్లనని, ఇక్కడే ఉంటానని తెలిపింది.

దక్ష తల్లిదండ్రులు ఏమంటున్నారంటే?
దక్ష తండ్రి జేతాజీ ఠాకోర్ ప్రకారం, ఆమె మొదట్లో హిందీ మాట్లాడటం ప్రారంభించినప్పుడు మేము పట్టించుకోలేదు. కానీ హిందీలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఒకరోజు మేము ఆమెను తిట్టినప్పుడు, ఆమె తన గత జీవిత కథను చెప్పింది. తాను అంజర్‌లో నివసించానని, భూకంపంలో చనిపోయానని చెప్పింది.