విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం : నారా లోకేష్

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం : నారా లోకేష్


అమరావతి : గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని ఏపీ మానవ వనరులు అభివృద్ధి,ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.పలు శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేడు (శుక్రవారం) నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు…

‘‘నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను.ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాను.యువగళం పాదయాత్రలో కేజీ నుంచి పీజీ వరకూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్న నాకు గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే అవకాశాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నాను.

రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తాను ’’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.