సెప్టెంబర్‌ నెల కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు ఎప్పుడంటే..

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్‌ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


ఇ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం జూన్‌ 20వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇ-సేవా టికెట్లు పొందిన భక్తులు జూన్‌ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లిస్తే లక్కీడిప్‌ టికెట్‌ మంజూరు అవుతుంది.

  • జూన్‌ 21 ఉదయం 10 గంటలకు.. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు
  • జూన్‌ 21 మధ్యాహ్నం 3 గంటలకు.. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు
  • జూన్‌ 23 ఉదయం 10 గంటలకు.. అంగప్రదక్షిణ టోకెన్లు
  • జూన్‌ 23 ఉదయం 11 గంటలకు.. శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్‌ కోటా టికెట్లు
  • జూన్‌ 23 మధ్యాహ్నం 3 గంటలకు.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు
  • జూన్‌ 24 ఉదయం 10 గంటలకు.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు
  • జూన్‌ 24 మధ్యాహ్నం 3 గంటలకు.. తిరుపతి, తిరుమలలో గదుల బుకింగ్‌
  • జూన్‌ 25 మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవీనత సేవ, గ్రూప్‌ సూపర్‌వైజర్ల సేవల కోటా

శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాలకు సంబంధించి టికెట్లను కేవలం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.