7th pay Commission : కేంద్ర ఉద్యోగులకు 2 నెలల ఏరియర్స్​ పడేది ఎప్పుడంటే..

7th pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్​. పెరిగిన జీతాలు.. మార్చి 30న అందే అవకాశం ఉందని మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో మార్చి 31 ఆదివారం అయినప్పటికీ బ్యాంకులు పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలిచ్చిన తరుణంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.


లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే తాజా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) లెక్కిస్తారు.

డీఏ ఏరియర్స్​..

కేంద్ర ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇది.. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా అలవెన్స్ 46శాతం నుంచి 50 శాతానికి పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల ఏరియర్స్​ ఉంటాయి.

హెచ్ ఆర్ ఏ సంగతేంటి?

Central government arrears news : డీఏతో పాటు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కూడా పెరుగుతుందని, నగర వర్గీకరణను బట్టి ఉద్యోగులకు 30 శాతం వరకు హెచ్ఆర్ఏ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ అలవెన్స్, చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, హాస్టల్ సబ్సిడీ, ట్రాన్స్​ఫర్​ ట్రావెల్ అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, గ్రాట్యుటీ సీలింగ్, మైలేజ్ అలవెన్స్ వంటి ఇతర ప్రత్యేక అలవెన్సులు కూడా పెరగవచ్చు. అయితే ఉద్యోగులు ఈ అలవెన్సులను తదనుగుణంగా క్లెయిమ్ చేసుకోవాలి.

చివరిసారిగా డీఏ పెంపు ఎప్పుడు జరిగింది?

2023 అక్టోబర్​లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) నాలుగు శాతం పెరిగింది. ఫలితంగా.. డీఏ 46 శాతానికి చేరింది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి పొందారు.

7th pay Commission arrears : అయితే.. ఏరియర్స్​ పడటంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.