చంద్రబాబు మంత్రివర్గంలో కందుల దుర్గేశ్‌కు చోటు: ఎవరీ కందుల దుర్గేశ్..ఆయన బ్యాక్ గ్రౌండ్ ఓసారి చూద్దాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ గన్నవరం మండలం కేసరవల్లి ఐటీ పార్క్ మేధా టవర్స్ దగ్గర ఏర్పాటు చేసిన సభా స్థలంలో చంద్రబాబు నాయుడు ఉదయం 11.47 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ఎవరెవరికి బెర్త్ దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కింది. జనసేన పార్టీలో హేమాహేమీలను పక్కనపెట్టి మరీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బోలపేతం చేయడంలో పార్టీ అధ్యక్షుడిగా సక్సెస్ అవ్వడంతో అటు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఇటు కూటమి ఏర్పాటు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీతో సమన్వయం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆయనకు కేబినెట్‌లో మంత్రి పదవి వరించింది. కందుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్ ప్రొఫైల్ ఓసారి చూద్దాం.

రాజకీయ జీవితం
కందుల లక్ష్మీదుర్గేశ్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో పలు విభాగాల్లో పనిచేశారు. 2007లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రాష్ట్రవిభజన అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016 డిసెంబర్ 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో ఇమడలేకపోయిన కందుల దుర్గేశ్ 30 ఆగష్టు 2018న జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 42,685 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు

మంత్రివర్గం కూర్పు-సామాజిక సమీకరణాలు
ఇకపోతే మంత్రివర్గం కూర్పులో జనసేనకు 3, బీజేపీకి ఒకరికి చోటు కల్పించారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారే ఉండటం గమనార్హం. ఈసారి కేబినెట్‌లో 17 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. వీరలో 10 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఉండటం విశేషం.చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కాపు-4, కమ్మ-4, రెడ్డి-3, బీసీ-8 మంది, ఎస్సీ-ఇద్దరు, ఎస్టీ-1, ముస్లిం మైనారిటీ-1,, వైశ్య-1చోటు కల్పించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ముగ్గురు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. ఇకపోతే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన మాటను చంద్రబాబు నెలబెట్టుకున్నారు. ఇద్దరి నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి

కొత్త మంత్రుల జాబితా ఇదే

1. కొణిదెల పవన్ కల్యాణ్
2. నారా లోకేశ్
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్
6. పొంగూరు నారాయణ
7. అనిత వంగలపూడి
8. సత్యకుమార్ యాదవ్
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్ఎండీ ఫరూక్
11. ఆనం రామనారాయణరెడ్డి
12. పయ్యావుల కేశవ్
13. అనగాని సత్యప్రసాద్
14. కొలుసు పార్థసారథి
15. డోలా బాల వీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవికుమార్
17. కందుల దుర్గేశ్
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్ధన రెడ్డి
20. టీజీ భరత్
21. ఎస్. సవిత
22. వాసంశెట్టి సుభాష్
23. కొండపల్లి శ్రీనివాస్
24. ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి