ఒక్కసారైనా విమానం ప్రయాణం చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్. కేవలం రూ. 1300 లకే విమానంలో ప్రయాణించవచ్చు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లాష్ సేల్ తీసుకొచ్చింది. ఇప్పటికే టికెట్ల బుకింగ్ మొదలైంది. ఇప్పుడు టికెట్లు బుకింగ్ చేసుకుంటే బస్ టికెట్ ధరకే సెప్టెబర్ 15, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మరి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లాష్ సేల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ వేసవిలో మీరు ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఒక్కసారైన విమానం ఎక్కాలని అనుకుంటున్నారా? మీలాంటి వారికి ఇది మంచి అవకాశం. మీరు కేవలం బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్లో వెకేషన్ ప్లాన్ చేస్తున్న వారిని ఆకర్షించేందుకు దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పరిమిత కాల ఆఫర్ కింద ఫ్లాష్ సేల్ (Flash Sale) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1300లకే విమాన టికెట్లు అందిస్తోంది. అంతే కాదు జీరో కన్వీనియెన్స్ ఫీ సైతం ఇస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తీసుకొచ్చిన ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఫ్లాష్ సేల్ టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మే 18, 2025 అర్ధరాత్రి వరకు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. జూన్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025 మధ్య ఎప్పుడైనా మీరు ప్రయాణం చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్ప్రెస్ లైట్, ఇంకోటి ఎక్స్ప్రెస్ వాల్యూ. మరి దేనిలో ఏ ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ లైట్ ఫేర్..
ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా రూ.1300 లకే విమాన టికెట్లు అందిస్తోంది. డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జీరో చెక్ ఇన్ బ్యాగేజీ అందిస్తోంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీ తీసుకెళ్లొచ్చు. ఇక చెక్ ఇన్ బ్యాగేజీలపై దేశీయ విమానాల్లో 15 కిలోల రూ.1000 నుంచి మొదలవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.13000గా ఛార్జ్ చేస్తున్నారు.
ఎయిరిండయా ఎక్స్ప్రెస్ వాల్యూ ఫేర్
ఎక్స్ప్రెస్ వాల్యూ సేల్ ద్వారా రూ.1524కే విమాన టికెట్లు అందిస్తోంది. అన్ని ప్రధాన బుకింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తమ సమ్మర్ ట్రిప్ను ముందస్తుగా, స్మార్ట్గా ప్లాన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. బిజినెస్, ఫ్యామిలీ ట్రావెల్ ఏదైనా తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. తమ లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. ఎక్స్ప్రెస్ బిజినెస్ ఫేర్స్, అప్గ్రేడ్స్ పై 25 శాతం తగ్గింపు కల్పిస్తోంది. ఎక్స్ప్రెస్ బిజ్ ద్వారా బిజినెస్ క్లాస్ సమానమైన ఫీచర్లు గల 58 ఇంచుల సీట్లతో సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది.
































