Friday, September 20, 2024

సిగ్నల్‌ లేకున్నా ఫోన్‌ మాట్లాడొచ్చు.. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఆ స్మార్ట్ ఫోన్ ఇదే

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ Huawei గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందించే విషయంలో ఈ కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. అయితే, Huawei త్వరలో తన కస్టమర్లకు గొప్ప శుభవార్తను చెప్పనుంది. నివేదికల ప్రకారం, ప్రీమియం ఫీచర్లతో కూడిన మొబైల్ ఫోన్ చాలా తక్కువ ధరకే మార్కెట్లోకి రానుంది. ఎంతో శక్తివంతమైన కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే లీక్ అయ్యాయి. Huawei అందించే ఈ మొబైల్ ఫోన్ ఏంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..
ఈ Huawei P70 స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో Sony IMX989 1-అంగుళాల సెన్సార్‌తో కూడిన అద్భుతమైన మ్యాజిక్‌ కెమెరాలో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ఫోనులో ప్రత్యేకతలు రెండు ఉన్నాయి ఒకటి కెమెరాలో అనేక రకాల ఆప్షన్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇంకోటి ఫోన్ సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడవచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోను శాటిలైట్ కమ్యూనికేషన్ సొల్యూషన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ భూమిపై ఎక్కడి నుంచైనా కమ్యూనికేట్ చేయవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన శాటిలైట్ టెక్నాలజీని మన ముందుకు అతి త్వరలోనే తీసుకురాబోతున్నారు.
ఈ న్యూస్ విన్న నెటిజెన్స్ లో కొందరు హమ్మయ్య సిగ్నల్ బాధలు కూడా పోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి కొందరు ఇప్పటికే చాలా మంది ఫోన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు.. మళ్లీ మీరు సిగ్నల్ లేకుండా ఫోన్స్ అంటున్నారు.. వినడానికి బావుంది కానీ దీని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో .. నష్టాలు అన్ని ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భయపెడుతున్న తాజా నివేదిక.. కరోనా కంటే డేంజర్ వైరస్

2020 లో వచ్చిన కరోనా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. నేటికి ఈ వైరస్ పూర్తిగా అంతం కాకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట పంజా విసురుతూనే ఉంది. వాతావరణానికి తగ్గట్టు రూపాంతరం చెందిన ఈ వైరస్ లక్షల మంది ప్రజల ప్రాణాలు తీసింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఘోరమైన కరోనా వైరస్ కంటే 100 రేట్ల ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని తాజా నివేదికలు తెలుపుతున్నాయి. కాగా కొత్తగా వస్తున్న బర్డ్ ఫ్లూ వేరియంట్ H5N1 వైరస్ టెక్సాస్(US)లో ఓ కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఈ వైరస్ బారిన పడ్డ అతని కళ్లు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా పక్షలకు వచ్చిన ఈ వైరస్ తాజాగా మనుషులకు వ్యాపిస్తుంది. ఇదే గనుక పెరిగిపోతే.. మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

గ్రామ నామాలు… గ‌త చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లు

గ్రామనామ విజ్ఞానానికి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉంది. ‘టొపోనమి’ అని దీనిని ఆంగ్లంలో పిలుస్తారు. నామవిజ్ఞానశాస్త్రం (ఓనమాస్టిక్సు)లో ప్రధాన భాగమైన గ్రామనామ విజ్ఞానంపై నామవిజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు రాసిన గ్రామనామాలు (ఆంధ్రప్రదేశ్) అన్న పుస్తకం ఎన్నో ఆసక్తిక‌ర‌మైన చారిత్ర‌క‌, సాంస్కృతిక, సామాజిక జీవ‌న అంశాల‌ను వెల్ల‌డించింది. ఒక రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఊరి పేర్ల నేపథ్యం గురించి లోతైన విశ్లేష‌ణ‌ను ఇందులో అందించారు.
శ్రీ‌కాకుళం జిల్లా నందిగామ మండ‌లంలో కామ‌ధేనువు అనే గ్రామం ఉంది. కామ‌ధేనువు అంటే కోరిక‌ల‌ను తీర్చే ప‌విత్ర‌మైన ఆవు అని అర్థం. ఆవుల పెంప‌కానికే అగ్ర ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన గ్రామం క‌నుక అక్క‌డి పురోహితుల సూచ‌న మేర‌కు గ్రామానికి కామ‌ధేనువు అని పేరు పెట్టగా ఇప్పుడ‌ది గోమాత‌ల‌కు నిల‌య‌మైన గ్రామంగా ప్ర‌సిద్ధి పొందింద‌ని ర‌చ‌యిత చ‌క్క‌ని వివ‌ర‌ణ ఇచ్చారు.అనంత‌పురం జిల్లాలోని కాకి గ్రామానికి తొలుత కాంచ‌న కిరీటం అని పెట్టారు. రత్న‌గిరి రాజులు త‌మ రాజ్యంలో ప‌నిచేసే సైన్యానికి ప్ర‌తిభా పోటీల‌ను నిర్వ‌హించి గెలుపొందిన వారికి కాంచ‌న కిరీటాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చేవారు. అలా ఆ గ్రామం పేరు జ‌న వ్య‌వ‌హారంలో సంక్షిప్తీక‌రించ‌బ‌డి కాకిగా స్థిర‌ప‌డిపోయిందని తెలిపారు. నంద్యాల జిల్లాలోని మ‌రొక గ్రామం భోజ‌నం. ఆ ప్రాంతంలోని సంస్థానాధీశులు ఆక‌లితో ఉన్న వారికి భోజ‌నం పెట్టే సంప్ర‌దాయాన్ని పాటించ‌డం వ‌ల్ల ఆ గ్రామానికి భోజ‌నం అనే పేరు వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లా క‌ప్ప‌ట్రాళ్ల గ్రామం తొలిపేరు సిరిమ‌ల్లె. ఆంగ్లేయుల హ‌యాంలో ఇక్క‌డ రైతుల నుండి క‌ప్పం (శిస్తు) వసూలు చేసేవారు. వ‌సూలైన మానాలు రాళ్ళ కుప్ప‌ల మాదిరిగా పోసి బ‌హిరంగంగా ఉంచ‌డం వ‌ల్ల ఈ గ్రామానికి క‌ప్ప‌ట్రాళ్ల అనే పేరు స్థిర‌ప‌డిపోయింద‌ని చెప్పారు.
ఊర్ల చరిత్ర ప్రాంత చరిత్రలో భాగం
క‌డ‌ప జిల్లా పొద్దుటూరు మండ‌లం దొరసాని వారిప‌ల్లె పేరు 1880 – 89 కాలంలో ఒక బ్రిటీషు మ‌హిళాధికారిణి అందించిన ప్ర‌జాసేవ‌కు గుర్తింపుగా వ‌చ్చింది. అన్న‌మ‌య్య జిల్లా పి.టి స‌ముద్రం మండ‌లంలోని మ‌ల్లెల ప‌ల్లె పేరు, ఆ గ్రామంలో ప్ర‌తి ఇంటి పెర‌టిలో ప్ర‌జ‌లు మ‌ల్లెలు పండించ‌డం వ‌ల్ల వ‌చ్చింది.చిత్తూరు జిల్లాలోని మండ‌ల కేంద్రం పాల స‌ముద్రం. ఆ గ్రామంలో పాడి ప‌రిశ్ర‌మ తులతూగ‌డం వ‌ల్ల ఆ పేరు వ‌చ్చింది. బాప‌ట్ల జిల్లాలోని స్టువ‌ర్టుపురంలో చోరీల‌ను క‌ట్ట‌డి చేసి సంస్క‌ర‌ణ‌ల‌ను తెచ్చేందుకు కృషి చేసిన ఆంగ్లేయ దొర స్టువ‌ర్ట్ పేరుని ఆ గ్రామానికి పెట్టారు. అనంత‌పురం జిల్లా గల‌గ‌ల గ్రామంలో గాజుల త‌యారీ దారులు ఎక్కువ‌గా ఉండేవారు. గాజుల గ‌ల‌గ‌ల శ‌బ్ద‌మే ఆ గ్రామం పేరుగా నిల‌బ‌డింది. తిరుప‌తి జిల్లాలో కుక్క‌ల‌ప‌ల్లి అనే గ్రామం ఉంది. ఆ బ్రిటీషు పాల‌న‌లో తెల్ల‌దొర‌లు ఈ గ్రామానికి రావ‌డంతో సామూహికంగా కుక్క‌లు వారిని వెంబ‌డించాయ‌ని ఆ త‌రువాత జ‌న వ్య‌వ‌హారంలో అది కుక్క‌ల‌ప‌ల్లిగా మారిపోయింద‌ని వివ‌రించారు. కృష్ణా జిల్లా వాన‌పాముల గ్రామం పేరు వాన‌మాను అని ఇంటి పేరు గ‌ల నాయీబ్రాహ్మ‌ణుడు కుటుంబంతో వ‌చ్చి గ్రామాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీ‌కారం చుట్టినందున అత‌నికి గుర్తింపుగా ఉండేలా గ్రామానికి వాన‌పాముల అని నామ‌క‌ర‌ణం చేశారు.
యజ్ఞంలా నామ విజ్ఞాన శోధన
ఒకే ప‌దంతో ఉన్న గ్రామాలు, రెండు, మూడు, నాలుగు, ఆరు ప‌దాలతో ఉన్న గ్రామాల చ‌రిత్ర‌ను లోతుగా విశ‌దీక‌రించారు. వ్య‌క్తులు, వృక్షాలు, జంతువులు, మృగాలు, వృత్తులు, సామాజిక వ‌ర్గాలు, గ్రామ దేవ‌త‌లు, పండుగ‌లు, ప‌బ్బాలు, కొండ‌లు, కోట‌లు, కొల‌నులు, పంట‌లు, కాలువ‌లు, ఇంటి పేర్లు క‌లిసొచ్చే విధంగా ఉన్న గ్రామాల‌ను కూడా సోదాహ‌ర‌ణంగా తెలిపారు. వివిధ గ్రామాల పేర్ల‌తో ఉత్త‌ర‌ప‌దంగా ఊరు, వాడ, వ‌రాలు, పాడు, ఖండ్రీగ‌లు, పుట్టుగ‌, ప‌ల్లి, వీడు, న‌గ‌రం, పాలెం, ప‌ర్రు, ప‌ర్తి, ప‌ట్నం మొద‌లైన‌వ‌న్నీ చేరుతాయ‌ని చెప్పారు. వ్య‌క్తి పుట్టిన‌ప్ప‌టి నుండి అంతిమ శ్వాస వ‌దిలే వ‌ర‌కు ఊరితో విడదీయ‌రాని గొప్ప అనుబంధం ఉంటుంది. నామ విజ్ఞానాన్ని య‌జ్ఞంగా భావించి ఎంతో శ్ర‌మ‌తో స‌మాచారాన్ని జాగ్ర‌త్త‌గా సేక‌రించి, ప్రామాణికంగా స‌రిదిద్ది, స‌రైన అనుక్ర‌మణికతో కూడిన ఈ ప‌రిశోధ‌నాత్మ‌క గ్రంథాన్ని ర‌చ‌యిత అంద‌రూ చ‌దివి అర్థం చేసుకొనే విధంగా స‌ర‌ళ‌మైన, స్ప‌ష్ట‌త‌తో కూడిన భాష‌తో రచయిత రూపొందించారు.

ప్ర‌తుల‌కు

గ్రామ నామాలు (ఆంధ్ర‌ప్ర‌దేశ్)

వాండ్రంగి కొండ‌ల‌రావు

పుట‌లు: 216 – వెల: రూ. 200

ప్ర‌తుల‌కు : 9490528730

సమీక్షకులు

డా. తిరునగరి శ్రీనివాస్,

94414 64764

స్పాట్ విధులకు విముఖత ఎందుకు?

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుండి జిల్లాల్లో పదవ తరగతి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారులు ముందుగానే తమ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులను మినహాయిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు డెబ్బై శాతానికి పైగా విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని అన్ని మూల్యాంకన కేంద్రాలలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది ప్రతి ఏటా ఇదే తంతు పునరావృతమవుతూ వస్తున్నది. విశ్లేషిస్తే దీనికి కారణాలు బోలెడు కనబడుతున్నాయి.
మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులు పూర్తిరోజు జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. అలాగే ఈ విధులకు హాజరయ్యే నేపథ్యంలో అదివారాలతో సహా ఎటువంటి సెలవులు ఉండవు. జవాబు పత్రాలు పూర్తయ్యేవరకు నిర్విరామంగా విధులకు హాజరవ్వాలి. వేసవిలో తీవ్రమైన ఎండలు, స్పాట్ కేంద్రాలలో కల్పించే అరకొర సౌకర్యాల దృష్ట్యా మూల్యాంకన ప్రక్రియకు హాజరు కావడానికి ఉపాధ్యాయులు జంకుతున్నారు. ఇక పారితోషికం విషయానికొస్తే గత ఐదేళ్లుగా అదే మొత్తాన్ని చెల్లించడం కూడా గైర్హాజరుకు ఒక కారణం. ఒక జవాబు పత్రాన్ని దిద్దితే కేవలం పది రూపాయలు ఇవ్వడం అది కూడా వెంటనే చెల్లించకుండా నెలల తరబడి సమయం తీసుకోవడం కూడా ఈ పరిస్థితులకు దారితీస్తున్నాయి. గత సంవత్సరం స్పాట్ విధులకు హాజరైన ఉపాధ్యాయులకు నేటికీ టీఏ, డీఏలు జమ కాకపోవడం కొసమెరుపు.
ఈ సౌలభ్యాలు ఉండటం వల్ల..
ఇంటర్ బోర్డు మూల్యాంకనం విధులకు హాజరైన లెక్చరర్‌లకు ఒక జవాబు పత్రాన్ని దిద్దినందుకు గానూ ఇరవై నాలుగు రూపాయలు చెల్లించడం, యాభై కిలోమీటర్ల పైబడి దూరం నుండి మూల్యాంకన కేంద్రానికి హాజరైతే అవుట్ స్టేషన్ అలవెన్స్ తదితర సౌలభ్యాలు కల్పించడం ద్వారా వారు ఈ గైర్హాజర్ పరిస్థితిని అధికమించగలుగుతున్నారు. ఇక స్పెషల్ అసిస్టెంట్‌లుగా నియమింపబడే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అవేదన అంతా ఇంతా కాదు. రోజంతా పనిచేస్తే కేవలం రెండు వందల యాభై చెల్లించడం వారిని కించపరచడమే. పట్టణ ప్రాంతాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టిఏ,డిఏలు కూడా చెల్లించకుండా కన్సేయన్స్ అలవెన్స్‌తో సరిపెట్టడం విచారకరం. గత సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ మూల్యాంకన విధులకు హాజరైన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు, నగదు జరిమానాలు విధించడంతో టీచర్లను స్పాట్ విధులకు హాజరు కావడానికి విముఖత చూపిస్తున్నారు.
మూల్యాంకన రేట్లు సవరించాలి..
స్పాట్ ఆర్డర్స్ పొందిన ఉపాధ్యాయులు క్యాన్సలేషన్ కోసం స్పాట్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది టీచర్లు ఈ విధులకు దూరంగా ఉండటానికి ఉపాధ్యాయ సంఘ నేతలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధ్యాయులందరూ విధులకు గైర్హాజరు అయితే మూల్యాంకనం ఎలా కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖధికారులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో సహేతుక కారణాలు ఉన్నప్పటికీ విద్యాశాఖాధికారులు మినహాయింపు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నోటీసులు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. మరికొన్ని జిల్లాల్లో గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు కూడా జారీచేయడం గమనార్హం.
ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం ముందుగా మూల్యాంకన రేట్లను సవరిస్తూ ఉత్తర్వులను జారీచేయాలి. ఇంటర్ బోర్డుతో సమానంగా పారితోషకం చెల్లించాలి. సుదూర ప్రాంతాల నుంచి స్పాట్ విధులకు హాజరయ్యే స్పెషల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా టిఏ,డిఏ లు చెల్లించాలి. ప్రభుత్వ సెలవు దినాల్లో స్పాట్ కేంద్రాలకు కూడా సెలవులు ప్రకటించాలి. సాధ్యం కాని పక్షంలో స్పాట్ విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రత్యేక పరిహార సెలవులను మంజూరు చేయాలి. ఆ దిశగా చర్యలు చేపడితే వచ్చే ఏడాది మూల్యాంకన సమయానికైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది.

Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? డయాబెటిస్ నియంత్రణకు మంచిదా?

Dry Coconut Benefits: దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు. పూజ నుండి వంట వరకు అన్నింటిలో కొబ్బరిని ఉపయోగిస్తారు. ఎండు కొబ్బరిని అనేక వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎండు కొబ్బరి పొడిని ఉపయోగించడం వల్ల ఆహారం రుచి పెరగడమే కాకుండా దాని వినియోగం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఎండు కొబ్బరిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అందుకే ఎండు కొబ్బరి లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

రుచి, సువాసన కోసం ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఏదైనా డెజర్ట్ లేదా వంటలో ఎండు కొబ్బరిని జోడించడం వల్ల దాని రుచి మరింత పెరుగుతుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అనేక ఇతర వ్యాధులు కూడా నయమవుతాయి. దీని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందించడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా తగ్గిస్తాయి. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఆహారంలో కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తినడం వల్ల మన మెదడు పదును పెట్టడమే కాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మన హృదయాన్ని బలపరుస్తుంది.

కొబ్బరిని పొడి లేదా తడి రూపంలో తినడం మన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది క్రమంగా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అలాగే మీ జుట్టు నల్లగా మెరుస్తుంది. అంతేకాదు ఎముకలకు కూడా మేలు చేస్తుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండి పగుళ్లు రాకుండా చేస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల తలనొప్పి బాధితులకు చాలా మేలు జరుగుతుంది. ఎండు కొబ్బరి తినడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఎండు కొబ్బరిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎండు కొబ్బరిని తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది రక్తహీనతను తొలగిస్తుంది.
ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. మీరు దీనిని తింటే అది మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్‌ను చాలా వరకు నివారించడంలో మీకు సహాయపడుతుంది. అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఈ ఎండు కొబ్బరిలో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని బాగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

దీనిని తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఎండు నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. మీరు దీన్ని ఎక్కువగా తీసుకుంటే, వాంతులు, కడుపు నొప్పి వస్తుంది. పొడి కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం మధుమేహ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే కొబ్బరిలో చాలా చక్కెర ఉంటుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మీ చేతుల్లోనే ఆరోగ్యం.. తేనె ఎప్పుడు తినాలో తెలుసా..? ఆ సమయంలో సేవిస్తే తిరుగుండదంట..

ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తెగ కష్టపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఉదయం వేళ జాగింగ్ చేయడం.. జిమ్‌కు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా.. వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు. తేనె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ తేనెను ఎప్పుడు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది..? అని చాలా సార్లు ప్రజలు గందరగోళానికి గురవుతారు. మీరు కూడా గందరగోళంలో ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే.. తేనెను ఉదయం తింటే మంచిదా..? లేదా రాత్రి తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

రాత్రిపూట తేనె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మీరు రాత్రిపూట తేనెను తీసుకుంటే, మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రిపూట తేనె తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. తేనెలో మెలటోనిన్ ఉంటుంది. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా, మీరు రాత్రిపూట తేనె తింటే, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. బరువు తగ్గడంలో తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఉదయం తేనె తీసుకోవడం..
ఉదయాన్నే తేనె తీసుకోవడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తేనె తింటే, అది మీకు శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా, తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ ఉదయం తేనెను తింటే, అది మీ మెదడును శక్తివంతంగా ఉంచుతుంది. మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మొటిమల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

రాత్రి వేళ తింటే..
మీకు నిద్ర సమస్యలు ఉన్నా.. బరువు తగ్గాలనుకున్నా నిద్రవేళలో (రాత్రి) తేనె తినడం మంచిది. మీకు ఏవైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో తేనెను తినండి. తేనెను తినే ముందు, మీకు దానితో అలెర్జీ ఉందా..? లేదా మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా..? అని తనిఖీ చేయించుకోండి.. దీనికోసం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మీ ఫోన్ ఇంటర్నెట్ నెట్ స్లో అవుతుందా? ఈ సెట్టింగ్ మార్చితే చాలు ఫుల్ స్పీడ్!

ఒకప్పుడు ఫోన్ కాల్స్ చేయాలంటే ఎస్టీడీ బూత్ కు వెళ్లి గంటల సేపు నిరీక్షించి చేయాల్సి వచ్చేది. ఎస్టీడీ, ఐఎస్‌డీ కాల్స్ చేయాలంటే చేబులకు చిల్లులు పడేవి. అలాంటిది కమ్యూనికేషన్ వ్యవస్థలో అతి వేగంగా ఎన్నో మార్పులు సంభవించాయి. సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయ్యింది. సెల్ ఫోన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయి.. నష్టాలు కూడా ఉన్నాయి. కాకపోతే దాన్ని వినియోగించే మనుషులపై ఆధారపడి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే లెక్క. ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు ఇలా ఎన్నో రకాలుగా వాడుతున్నారు. మనం వాడే ఇంటర్ నెట్ కొన్నిసార్లు తెగ ఇబ్బందులు పెడుతుంది. ఊర్లలో ఉండే వారు కాల్స్ ఇంకా ఇంటర్నెట్ రెండింటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. నెట్ వర్క్ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుంది. అయితే ఈ టిప్స్ తో ఇంటర్ నెట్ ని జడ్ స్పీడ్ లా మార్చేయవచ్చు.

ప్రస్తుతం భారత దేశంలో 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. ఏ టెలికాం కంపెనీ అయినా సరే తమ నెట్ వర్క్ జట్ స్పీడ్ లా పనిచేస్తుందని వినియోగదారులకు గట్టి నమ్మకాన్ని ఇస్తుంటారు. వాస్తవానికి కాల్ డ్రాప్ ల వల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక గ్రామస్థాయిలో అయితే ఇంటర్నెట్ సమస్యలు రెండింతలు ఎదుర్కొంటారు. నెట్ వర్క్ సిగ్నల్ ఫుల్ గా చూపిస్తున్నా.. ఇంటర్ నెట్ మాత్రం డెడ్ స్లోగా ఉంటుంది. ఈ టిప్స్ వాడితో మీ సెల్ ఫోన్ లో ఇంటర్ నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో 5జీ నెట్ వర్క్ స్పీడ్ ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.

సరైన ఎపీఎన్ చాలా ముఖ్య:
నెట్ వర్క్ సెట్టింగ్ లో యాక్సెస్ పాయింట్ నెట్ వర్క్ సెట్టింగ్ సరిగా ఉందో లేదో చెక్క చేసుకోండి. ఎందుకంటే ఇంటర్ నెట్ స్పీడ్ కి సరైన ఏపీఎన్ ఉండటం చాలా
ముఖ్యం. ఏపీఎన్ సెట్టింగ్ మెనుకి వెళ్లి, సెట్టింగ్ డీఫాల్ట్ గా సెట్ చేసుకోండి.

నెట్ వర్క్ సెట్టింగ్స్ మార్చండి :
మీరు వాడుతున్న ఇంటర్ నెట్ డెడ్ స్లోగా ఉంటే.. ముందుగా ఫోన్ సెట్టింగ్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫోన్ సెట్టింగ్ లోని నెట్ట వర్క్ సెట్టింగ్ లకు వెళ్లి.. ప్రైమరీ నెట్ వర్క్ 5జీ లేదా ఆటోగా సెలక్ట్ చేసుకోవాలి.

సోషల్ మీడియా యాప్స్ :
ఈ మధ్యసైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందుకే ఫోన్ లో ఉన్న సోషల్ మీడియా పై గట్టి నిఘా పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రా వంటి యాప్ లు స్పీడ్ ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎందుకంటే ఇవి డేటా ఎక్కవగా తీసుకుంటాయి.. అందుకే వీటి సెట్టింగ్ లకు వెళ్లి ఆటో ప్లే వీడియో ను ఆఫ్ చేయండి. ఫోన్ బ్రౌజర్ ని డేటా సేవ్ మోడ్ లోకి సెట్ చేయాలి.

లాస్ట్ ఆఫ్షన్ రీసెట్ :
నెట్ వర్క్ స్పీడ్ పెంచడానికి మీరు పై ఆప్షన్లు అన్నీ ట్రై చేసినా ఫలితం లేకుండా చివరిగా మీ ఫోన్ నెట్ వర్క్ సెట్టింగ్ లను రీసెట్ చేయండి. డిఫాల్ట్ నెట్ వర్క్ సెట్టింగ్ లో మంచి స్పీడ్ పొందడానికి అవకాశం ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్షలు లేకుండానే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు

దేశంలో ఉన్నత విద్యనభ్యసించి సరైన ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురు చూస్తున్నారు. సమాజంలో గౌరవంగా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగం అవసరం అని అహర్శిశలు కష్టపడి చదువుతుంటారు. గ్రూప్స్ లో మంచి ర్యాంక్ కొట్టేందుకు తపస్సు చేస్తుంటారు. సాధారంగా ఎవరైనా ఐటీ శాఖలో ఉద్యోగం సంపాదిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే ఐటీ శాఖలో ఉద్యోగాలు సాధించడం అంటే సామాన్య విషయం కాదు. ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఆ శాఖ తీపి కబురు అందించింది. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసనర్ , సూపరింటెండెంట్, ఇన్స్ పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అంతేకాదు ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ పోస్టులకు అభ్యర్థులు 45 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపింది. ఇన్ కం ట్యాక్స డిపార్ట్ మెంట్ పడిన ఈ పోస్టులకు దరఖాస్తుఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటీ తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు :
ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ (CBDT) , సూపరింటెండెంట్ (CIBC) లో 1 పోస్టు. ఇన్స్ పెక్టర్ (CBDT/CBIC) లో – 3 పోస్టులు మొత్తం నాలుగు పోస్టులు.

అర్హత :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సదరు అధికారిక నోటిఫికేషన్ లో సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తారు.

ఎలా అప్లయ్ చేసుకోవాలి :
ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇచ్చిన ఫార్మాట్ లో ఫారమ్ పూరించి.. అవసరమైన డాక్యుమెంట్స్ ని జత చేసి వాటి కాంపిటెంట్ అథారిటీ అండ్ అడ్మినిస్ట్రేటర్, శాస్త్రి భవన్, కొత్త భవన్ (4 వ అంతస్తు) నెం. 26, హెడ్జెస్ రోడ్, సంగంబాక్కం, చెన్నై – 600006 చిరునామకు పంపించాలని కోరింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఐటీ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేయాలనే ఆశ ఉన్నవారు..అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Amazon Grand Festive Sale : అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ప్రారంభం.. స్మార్ట్‌టీవీలపై అదిరే డీల్స్, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

Amazon Grand Festive Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ విస్తృత శ్రేణి బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వినియోగదారుల కోసం పలు బ్రాండ్ల స్మార్ట్‌టీవీల్లో శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, రెడ్‌మి, హైసెన్స్, టీసీఎల్, ఏసర్, వియూ మరిన్ని బ్రాండ్‌ల నుంచి స్మార్ట్ టీవీలను పొందవచ్చు.
ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ప్రకారం.. వినియోగదారులు స్మార్ట్‌టీవీల కొనుగోళ్లపై 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో వినియోగదారులు రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఎప్పుడంటే? :
అమెజాన్ గ్రాండ్ ఫెస్టివ్ సేల్ ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 9 వరకు కొనసాగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో వివిధ రకాల బ్రాండ్‌ల నుంచి వివిధ డిస్‌ప్లే సైజ్‌లలో స్మార్ట్ టీవీలు లభిస్తాయి. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునేవారు లేదా ఇప్పటికే ఉన్న తమ డివైజ్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నవారు అమెజాన్ అందించే డీల్‌లు, డిస్కౌంట్‌ల బెనిఫిట్స్ పొందవచ్చు.

అమెజాన్ సేల్ ఏమి ఉండవచ్చు? :
అమెజాన్ ప్రకారం.. ఈ సేల్‌లో అనేక బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్ టీవీలు ఉంటాయి. ఈ సేల్‌లో 32-అంగుళాల, 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాలు, 65-అంగుళాల సైజులలో టెలివిజన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. అన్ని డివైజ్‌లకు ప్లాట్‌ఫారమ్ అందించే కొంత తగ్గింపు 65 శాతం వరకు అందిస్తుంది. ఈ కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించే థర్డ్ పార్టీ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

ఈ కార్డులపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ :
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోళ్లపై రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లతో ఎంపిక చేసిన డివైజ్‌లపై కొనుగోలు చేస్తే అమెజాన్ 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐని అందిస్తోంది. ఇప్పటికే ఉన్న స్మార్ట్‌టీవీలను మార్చుకోవడంపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ప్రకారం.. వినియోగదారులు గరిష్టంగా రూ. 6వేల సేల్ సమయంలో 4 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తుంది. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూను అమెజాన్ ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తుందని గమనించాలి.

అమెజాన్ సేల్‌లో ఎల్ఈడీ టీవీలపై ధర తగ్గింపులతో పాటు క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను కూడా అందిస్తుంది. ఎంపిక చేసిన డివైజ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ నెలకు రూ.750 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అమెజాన్ వెబ్‌సైట్‌లో 300 కన్నా ఎక్కువ స్మార్ట్‌టీవీలతో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను అందిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డెలివరీ సమయంలో ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తుంది.

పెట్రోల్ బంక్ నుండి ప్రతినెల లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?

భారతదేశంలోని చాలా మంది ప్రజలు వ్యాపారంలో వారి చేతి అదృష్టాన్ని ప్రయత్నించాలని కోరుకుంటారు. ముఖ్యంగా చూస్తే సొంతంగా పెట్రోల్ పంప్ ఉండాలని కోరుకుంటారు.
ఇది కూడా మంచి ఛాయిస్. భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫిబ్రవరిలో పెట్రోలు వినియోగం 19.72 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది ఒక బలమైన ఆదాయ సోర్సెస్ కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఏ విధమైన డీలర్‌షిప్ ఉంటుంది ? పెట్రోల్ బంక్ తెరవడానికి ఏమి చేయాలో తెలుసా… మరి ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉంటుంది అని ఆలోచిస్తున్నారా…

ఎంత పెట్టుబడి పెట్టాలి?

గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ పంపు తెరవాలంటే రూ.12 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే పట్టణ ప్రాంతాలలో రూ.20 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఈ వ్యాపారంలో ఎంత లాభం

పెట్రోలు వ్యాపారంలో ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం అన్నది జరుగుతుంది. వాస్తవానికి పెట్రోల్ అమ్మకంపై లీటరుకు రూ.2 నుంచి 5 వరకు కమీషన్ లభిస్తుంది. నెలకు దాదాపు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా.

ఎంత భూమి అవసరం అవుతుంది

పెట్రోల్ పంపును తెరవాలంటే దాదాపు 800 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. మీకు భూమి లేకపోతే, మీరు భూమిని లీజుకు కూడా తీసుకోవచ్చు.

డీలర్‌షిప్ ఎలా పొందాలో తెలుసుకోండి

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం కోసం మీరు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు www.petrolpumpdealerchayan.in వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అందులో అవసరమైన సమాచారం నింపాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి.

ఈ డాకుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి

దీని కోసం ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, భూమి డాకుమెంట్స్ లేదా లీజు పేపర్స్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర ఆమోద పత్రాలు వంటి అవసరమైన డాకుమెంట్స్ అవసరం. అంతే కాకుండా, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను డాకుమెంట్స్ ఇంకా పర్యావరణ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం.

Time to worship God: దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది ?

Time to worship God: హిందువులు దేవుళ్లను భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రతి రోజు ఇంట్లో దేవుడికి ఉదయం, సాయంత్రం వేళ పూజలు చేస్తూ తమ కోర్కెలు తీర్చాలని ప్రార్థిస్తుంటారు.
అయితే కొంద మంది ప్రతి రోజు రెండు పూటలు పూజలు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రం పూజలు చేస్తుంటారు. అయితే దేవుడికి ఒకే పూట పూజ చేసినా కూడా కరునిస్తాడట. కానీ అది ఏ వేళలో పూజించాలి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. మరి ఏ సమయంలో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడిని ఉదయం వేళ పూజించడం కంటే సాయంత్రం వేళ పూజించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. దేవుడి అనుగ్రహం దక్కాలనుకునే వారు సాయంత్రం వేళ పూజలు చేస్తే దేవుడి అనుగ్రహం దక్కుతుందని పండితులు అంటున్నారు. అయితే దేవుడిని పూజా సమయంలో చేసే దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది. కానీ దీపారాధాన చేసే సమయంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. దేవుడి వద్ద పెట్టే దీపాన్ని సాధారణంగా అగ్గిపుల్లతో వెలిగిస్తుంటాం. అయితే అలా వెలిగించటం అపచారమట. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో క్యాండిల్ ను వెలిగించి ఆ తరువాత కొవ్వొత్తితోనే దీపాలను వెలిగిస్తే మంచిదట. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం పొందినవారు అవుతారని పండితులు చెబుతున్నారు.
దేవుడికి నైవేద్యం తప్పక పెట్టాలి. నీరు, నైవేద్యం పెట్టాకే పూజ చేయాలని పండితులు అంటున్నారు. అంతేకాదు పూజను ఏ సమయంలో చేసినా కొన్ని నియమాలు పాటించాలి.పూజ చేసే సమయంలో ఇంటి తలుపు తెరిచే ఉంచాలి. అలాగే ఇంటి గుమ్మం ముందు, బయట చెత్తను ఉంచకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకుని వాకిలి ఊడ్చి, కల్లాపు చల్లి, అందమైన ముగ్గులు వేయాలి. ఎవరి ఇంటి ముందు అలంకరణ చక్కగా ఉంటే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రతీ రోజు ఎంత బిజీ లైఫ్ ఉన్నా పూజ చేయడం మాత్రం మానకూడదు.

Errabelli : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు – ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. జనగామలో జరిగిన రైతు సదస్సులో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ పేరు మార్పు అంశంపై స్పందించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు.

కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతల్లో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. అయితే వాస్తు అనేది నమ్మకమని.. కానీ పార్టీ పేరును మార్చడం అనేది చాలా ముఖ్యమని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా పేరు మార్చాలని గులాబీ శ్రేణుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ ప్రజలతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయినట్లుగా క్యాడర్ భావిస్తోంది. దీంతో ఓటర్లు బీఆర్ఎస్ ను తిరస్కరించారని కొందరు తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు. అ పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించడం వల్ల ఆ పార్టీ అస్థిత్వానికి ప్రమాదంగా మారిందని బీఆర్ఎస్ నేతల్లో గట్టి నమ్మకం ఏర్పడింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 వ సంవత్సరంలో ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని 22 సంవత్సరాల తర్వాత 2022 భారత రాష్ట్ర సమితిగా మార్చింది. జాతీయపార్టీగా దేశంలో అగ్గిపెడతానని కేసీఆర్ నమ్మకంతో ప్రకటించేవారు. పార్టీ విస్తరించేందుకు మహారాష్ట్రంలో బిఆర్ ఎస్ తరఫున అనే సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ పేరు మార్చిన తర్వాత చాలా ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో వచ్చినా పోటీ చేయలేదు. చివరికి కర్నాటక ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెలంగాణలో ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే చాలా మంది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే .. పేరు మార్పు వల్లే ఓడిపోయామని. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కడియం శ్రీహరి వంటి వారు మూడు నెలల కిందటే డిమాండ్ చేశారు. చివరికి ఆయన కూడా పార్టీ మారిపోయారు. టిఆర్ఎస్ అనేది తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ. దీనిని బిఆర్ ఎస్ గా మార్చగానే పార్టీ సెంటిెమెంటుకు దూరమయింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. అందువల్ల మళ్లీ తెలంగాణ ప్రజలకు దగ్గిరయ్యేందుకు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా పునరుద్ధరించాలనేది చాలా మంది హైకమాండ్‌కు చెబుతున్న మాట. ఆ తర్వాత చాలా మంది నేతలది అదే అభిప్రాయం. ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ ను బట్టి.. పార్టీ పేరు మళ్లీ టీఆర్ెస్ గా మారనుంది. దీనికి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను ఆ పార్టీ ప్రారంభించినట్లగా తెలుస్తోంది.

జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి శుభవార్త! ఇక భయపడాల్సిన పని లేదు!

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన డిజిటల్‌ పేమెంట్స్‌ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. చిన్నటీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసిన ఆన్ లైన్ పేమంట్ ప్రొసెస్ ను అనుసరిస్తున్నారు. అలా క్షణాల్లో డబ్బలును ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం రావడంతో…ఇప్పుడునన్న అన్ని రంగాల్లో డిజిటల్ పేమంట్స్ అనేది అవసరంగా మారిపోయింది. ఇక ప్రజలు కూడా ఈ అన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ కి అలవాటు పడటంతో ఎక్కడికి వెళ్లిన మొదటిగా డిజిటల్ పేమంట్స్ కే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. ఇక ప్రతిచోట ఈ డిజిటల్ పేమంట్స్ అనేవి జరుగుతున్నాయి కానీ, ఒక్క రైల్వే స్టేషన్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ సేవలు అనేవి అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ అందిందచింది. ఇక నుంచి ప్రయాణికులు టికెట్ కౌంటర్ వద్ద ఆ సేవలను పొందవచ్చు.

సాధారణంగా రైల్వే స్టేషన్ కు వెళ్లిన ప్రయాణికులు టీకెట్ కౌంటర్ల దగ్గర పడిన ఇబ్బందులు గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనరల్ బుకింగ్ కౌంటర్లలో టికెట్ చేసేందుకు వచ్చిన ప్రయాణికుల రద్దీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ సమయంలో టికెట్ చేసేందుకు సరిపడా చిల్లర డబ్బులు అందరి దగ్గర లేకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. దీని వలన టికెట్ చేయించే సమయంలో చిల్లర కోసం కొంత సమయం వృథా అవుతుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రైల్వే తాజాగా ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఈ సేవల ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కూడా తగ్గుతుంది. అలాగే ప్రయాణికులకు చిల్లర సమస్య కూడా ఉండదు.

ఇక డిజిటెల్ సేవల ద్వారా.. జనరల్ బుకింగ్ కౌంటర్లలో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఇలా డిజిటిల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో.. ఇక మీదట ప్రయాణికులకు సమయానికి టికెట్ అవ్వకపోతే ట్రైన్ మిస్ అయిపోతుందనే భయం కూడా ఉండదు. చక్కగా డిజిటల్ సేవలన ఉపాయోగించి.. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను పొందవచ్చు. ఇక ఈ డిజిటల్ సేవలనేవి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో విజయవంతమైతే.. దాదాపు అన్ని నగరాల్లో ఇక నుంచి రైల్వే స్టేషన్ లో డిజిటల్ సేవలను పొందే ఆవకాశం ఉంటుంది.

అయితే ఫస్ట్ ఫేజ్‌లో సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 14 స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో.. ఈ డిజిటల్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు. అనగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.కాగా, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే యూ.టి.ఎస్. (జనరల్ బుకింగ్) కౌంటర్లలో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ సదుపాయంతో అన్‌రిజర్వ్ టిక్కెట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

సుధామూర్తి గారి సలహా.. పిల్లల్ని ఇలా పెంచితే డాక్టర్లు, ఐఏఎస్ లు కావడం ఖాయమట!

ఇంజనీర్, సామాజిక కార్యకర్త, రచయిత సుధా మూర్తి పిల్లల కోసం కథలు వ్రాస్తారు. ఆమె మానవతావాద సమస్యల గురించి, సామాజిక సమస్యలపై మాట్లాడటంలోనూ ఎప్పుడూ ముందుంటారు.
భారతదేశంలో విద్య, గ్రామాల అభివృద్ధి, మహిళల అభ్యున్నతిలో ఆమె చాలా దోహదపడింది. ఆమె జీవితమంతా ఒక ప్రేరణ కంటే తక్కువ కాదు. ఆమె జీవితంలో వివిధ సందర్భాలలో పేర్కొన్న ఎన్నో స్పూర్తిదాయక విషయాలు పిల్లలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తాయి. మీ పిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోకూడదని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే, సుధా మూర్తి చెప్పిన స్పూర్తిదాయకమైన విషయాలను తప్పక పిల్లలకు చెప్పాలి.

ఇవి చెబితే ఏ పిల్లవాడు అయినా ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకుంటాడు. జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తాడు. ఐఏఎస్, డాక్టర్ లాంటివి కూడా వారికి చిన్న లక్ష్యాలుగా అనిపిస్తాయి. కలలను ఎప్పటికీ వదులుకోవద్దు..

జీవితంలో కలలను ఎప్పటికీ వదులుకోకూడదని సుధా మూర్తి అన్నారు. మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా పూర్తి చేయాలి. కష్టపడి పనిచేయడం వల్ల కలలు నెరవేరుతాయి. పిల్లలు దీన్ని అర్థం చేసుకుంటే వారు చిన్న వైఫల్యాలకు భయపడటం మానేస్తారు.
ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి.. జీవితంలో నేర్చుకోవడం ఏ సందర్భంలోనూ ఆపకూడదని సుధా మూర్తి అన్నారు. ప్రపంచంలోకి ఎప్పుడూ కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సాంకేతికతతో ఎంత చురుగ్గా, ఎంత అవగాహనతో ఉంటే, జీవితంలో ముందుకు వెళ్లడం అంత సులభం అవుతుంది.

నేర్చుకోవడం మెదడు అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. అపజయానికి భయపడవద్దు.. సుధా మూర్తి చెప్పిన మాటల ప్రకారం అపజయానికి భయపడకూడదు. వైఫల్యాల నుండి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి.

విజయానికి మార్గంలో వైఫల్యం తప్పనిసరి. పిల్లలు వారి వైఫల్యం నుండి నేర్చుకుంటే వారు జీవితంలో ముందుకు సాగకుండా ఎవరూ ఆపలేరు. ఇతరులకు ప్రాముఖ్యత ఇవ్వాలి.. ఎవరి జీవితం గురించి వారు ఆలోచించడం సరికాదు.
సమాజంలో జీవిస్తున్నాము కాబట్టి ఇతరుల భావాలను, వారి అవసరాలను గౌరవించడం ముఖ్యం. తనకే పరిమితమైన మనిషి ఎప్పటికీ ముందుకు వెళ్లలేడు. పిల్లలు చిన్నతనం నుండే ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలు ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నా, పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పినా.. ఆ పిల్లలు జీవితంలో తప్పకుండా గొప్ప స్థాయికి ఎదుగుతారు.

బర్త్ సర్టిఫికెట్ కొత్త నిబంధనలు.. కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు?

బర్త్ సర్టిఫికెట్…దీనికి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రకాల స్కీమ్స్ కావాల్సిన ప్రధానమైన పత్రల్లో బర్త్ సర్టిఫికెట్ ఒకటి.
కేవలం పథకాలకే కాకుండా ఉద్యోగాలకు, ఇతర దేశాలకు వెళ్లే సమయంలో వీసాకు సంబంధించిన విషయాల్లో జనన ధృవీకరణ పత్రం అవసరం. ఇప్పటి వరకు కొన్ని రూల్స్ తో బర్త్ సర్టిఫికెట్ ను స్థానిక అధికారులు జారీ చేస్తుంటారు. తాజాగా జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి ఒక్కరికీ బర్త్ సర్టిఫికెట్ అనేది ముఖ్యమైనది. తాజాగా ఈ సర్టిఫికెట్ విషయంలో కేంద్రం కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న ‘కుటుంబ మతం’ డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత జనన నివేదికలో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ పేర్కొంది. ఇక ఈ కథనం ప్రకారం.. బర్త్ సర్టిఫికెట్ సంబంధించిన కొత్త ఫారమ్ కేంద్ర హోం మత్రిత్వశాఖ మోడల్ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే దీన్ని అమల్లోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేయాల్సి ఉంటుందని ది హిందూ నివేదించింది. అలానే కేంద్రం తీసుకురానున్న ఈ రూల్ కి ఆయా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది. అదే విధంగా పిల్లలను దత్తత తీసుకునే పేరెంట్స్ కూడా ఇదే వర్తించనున్నట్లు తెలుస్తోంది.

అలానే పిల్లలను దత్తత తీసుకునే వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. జనన, మరణాల రికార్టుల భద్రత కోసం నేషనల్ లెవెల్ లో డేటాబేస్ ను ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్ల, ఆస్తి రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల కార్డులు, రేషన్ కార్డులు, ఎలక్టోరల్, డ్రైవింగ్ లైసెన్స్ లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వంటి అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం.. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించి ఇలా వేర్వేరు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. వివిధ వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ బర్త్‌ సర్టిఫికెట్‌ను సింగిల్‌ డాక్యుమెంట్‌గా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్‌ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తించనున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సంచలన హామీలు-అధికారంలోకి వస్తే ఎన్డీయేకి చుక్కలే..!

ఎన్డీయే చట్టాల సమీక్ష:
పార్లమెంటులో చర్చ లేకుండా ఎన్డీయే సర్కార్ ఆమోదించిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ సమీక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఇందులో కార్మిక, రైతు, క్రిమినల్ లా, పర్యావరణం, అడవుల, డిజిటల్ డేటా భద్రత వంటి చట్టాలున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ కీలక హామీ ఇచ్చింది. అలాగే పీఎం కేర్స్ స్కాం, కీలక రక్షణ ఒప్పందాల్లో అవినీతిపై విచారణకు హామీ ఇచ్చింది. అలాగే మీడియాలో గుత్తాధిపత్యం నివారణకు చట్టం చేస్తామని కూడా హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు విభజన:

సుప్రీంకోర్టును రాజ్యాంగ న్యాయస్ధానం, అప్పీలు కోర్టులుగా విభజిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాజ్యాంగం యొక్క వివరణకు సంబంధించిన కేసులను ఏడుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ న్యాయస్థానం విచారించి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే చట్టపరమైన ప్రాముఖ్యత లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర కేసుల్న అప్పీల్ కోర్టు పరిష్కరిస్తుంది.

మహిళలకు పెద్దపీట :

అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఎక్కువ మంది మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ న్యాయమూర్తుల్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఉన్నత న్యాయమూర్తుల దుష్ప్రవర్తనపై ఫిర్యాదులు స్వీకరించి విచారించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం ప్రారంభించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయనుంది. సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు కోస్ట్ గార్డ్) పూర్తి బలాన్ని సాధించడానికి సాధారణ రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించిస్తుంది.

పట్టణాల ఆధునికీకరణ:

అలాగే పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దేశ పునర్నిర్మాణంలో పట్టణ పేదలకు పని హామీ, పట్టణ మౌలిక సదుపాయాల పునరుద్ధరణే దీని లక్ష్యం. దీని ద్వారా తక్కువ విద్య, తక్కువ నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. నీటి వనరుల పునరుద్ధరణ, వేస్ట్‌ల్యాండ్ పునరుత్పత్తి కార్యక్రమం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

జీఎస్టీ, ఐటీ మార్పులు :

జీఎస్టీ చట్టాల స్ధానంలో ప్రత్యామ్నాయ చట్టాలను తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను పరిశీలించి తక్కువ స్లాబ్ రేటుతో వీటిని అమలు చేస్తామని తెలిపింది. పేదలపై భారం లేకుండా,

వ్యవసాయ ఇన్‌పుట్‌లపై పన్ను లేకుండా ఇది ఉంటుందని తెలిపింది. అలాగే చిన్న జీఎస్టీ చెల్లింపుదారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తామని తెలిపింది. జీఎస్టీ రాబడిలో కొంత భాగం పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఇస్తామని తెలిపింది.

ఆదాయపన్నును కూడా సంస్కరించి దీర్ఘకాలంలో పన్నుచెల్లింపుదారులు తమ ఆర్ధిక ప్రణాళికలు రూపొందించుకునేలా మారుస్తామని హామీ ఇచ్చింది.

పేద కుటుంబాలకు ఏడాదికి లక్ష:

మహాలక్ష్మి పథకం ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో ప్రతి పేద భారతీయ కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా సంవత్సరానికి 1 లక్ష అందిస్తామని తెలిపింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేస్తామని హామీ ఇచ్చింది. న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు, న్యాయ అధికారుల వంటి ఉన్నత పదవులు, లిస్టెడ్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్లుగా మహిళలను ఎక్కువగా నియమిస్తామని తెలిపింది. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లలను సమూలంగా మారుస్తామని హామీ ఇచ్చింది.

ఉపాధి హామీ వేతనం రూ.400:

ఉపాధి హమీ పథకం కింద ఇస్తున్న వేతనాలను రూ.400కి పెంచుతామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంగన్‌వాడీ వర్కర్ల సంఖ్య రెట్టింపు చేసి

అదనంగా 14 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చింది. రైతులకు కల్పిస్తున్న గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది.

భావప్రకటనా స్వేచ్ఛకు హామీ :

మీడియా సహా అన్ని చోట్లా వాక్ స్వాతంత్రాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఇంటర్నెట్ సదుపాయం రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటామని తెలిపింది. అలాగే ప్రజల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు అనుమతిస్తున్న చట్టాల్ని సమీక్షిస్తామని తెలిపింది. ఇందులో ఆహారం, దుస్తులు, ప్రేమించడ, వివాహం చేసుకోవడం, ప్రయాణం చేయడం, భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడం వంటి అంశాలున్నాయి.

జమిలి ఎన్నికలకు నో:

జమిలి ఎన్నికల ప్రతిపాదనల్ని తిరస్కరించి లోక్‌సభకు, రాష్ట్రానికి విడిగానే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల చట్టాలను సవరించి, ఓటర్ల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ స్లిప్ లను పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలు, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. రాజ్యాంగంలో పదో షెడ్యూల్ సవరించి ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు పడేలా చూస్తామని కూడా తెలిపింది. చట్టాల ఆయుధీకరణ, ఏకపక్ష విచారణలు, నిర్బంధాలు,ఏకపక్ష, విచక్షణారహిత అరెస్టులు, థర్డ్-డిగ్రీ పద్ధతులు, సుదీర్ఘ కస్టడీ, కస్టడీ మరణాలు, బుల్డోజర్ న్యాయం వంటి వాటికి ముగింపు పలుకుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. .

Gas Burner Wash Tips: గ్యాస్ బర్నర్‌ని చిటికెలో కొత్తదిగా మార్చే చిట్కా.. ఈ రెండు కలిపి గంటపాటు నానబెట్టారంటే!

రోజూ వంట చేయడం వల్ల గ్యాస్ బర్నర్ జిడ్డుగా మారుతుంది. దీనిని శుభ్రపరచడం చాలా కష్టం. ఎంత శుభ్రం చేసిన జిడ్డు వదలదు. అయితే ఈ ఒక్క ట్రిక్‌ ద్వారా గ్యాస్ బర్నర్‌ను సులువుగా శుభ్రంచేయవచ్చు.
గ్యాస్ బర్నర్ జిడ్డును సులభంగా తొలగించాలంటే.. ముందుగా గ్యాస్ ఓవెన్ నుండి గ్యాస్ బర్నర్‌ను తీసివేసి, చల్లబరచండి. వేడిగా ఉన్నప్పుడు క్లీన్‌ చేయకూడదు.

ఇప్పుడు శుభ్రం చేయడానికి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దాని కోసం ఒక పెద్ద గిన్నెలో వేడి నీటిని తీసుకొని, అందులో బేకింగ్ సోడా, వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గ్యాస్ బర్నర్ మునిగిపోయేలా వేయాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్‌ను సుమారు 30-60 నిమిషాల పాటు నానబెట్టాలి.

మురికి ఎక్కువగా ఉంటే, కొంచెం ఎక్కువ సేపు నానబెట్టవచ్చు. తర్వాత, మృదువైన స్పాంజ్ లేదా బ్రష్‌ని ఉపయోగించి గ్యాస్ బర్నర్‌ను స్క్రబ్ చేస్తే మురికి పూర్తిగా వదిలిపోతుంది.

దీనితో పేరుకుపోయిన మురికిని సులభంగా తొలగించవచ్చు. చివరగా గ్యాస్ బర్నర్‌ను శుభ్రమైన నీటితో కదిగి పొడి గుడ్డతో తుడి చేస్తే సరి.

అప్పటికీ గ్యాస్ బర్నర్ తళతళ మెరిసిపోకపోతే నిమ్మకాయ ముక్కతో దానిని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ బర్నర్ కొత్తదిలా కనిపిస్తుంది. ఇలా చేస్తే ఎంతటి కఠినమైన మురికైనా క్షణాల్లో వదలిపోతుంది.

Diabetes: నో మెడిసిన్, అయినా డయాబెటీస్ రివర్స్.. భారత సంతతి CFO ప్రయోగం.

డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటుంటారు. షుగర్ ను అదుపులో ఉంచుకోవడమే తప్ప రివర్స్ చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ హాంకాంగ్ లో ఉంటున్న ఓ భారత సంతతి సీఎఫ్‌వో మాత్రం డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లతోపాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు.
డయాబెటీస్.. ఈ పేరు వినగానే అందరూ భయపడుతుంటారు. జీవనశైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి ఒకసారి ఎటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటుంటారు. షుగర్ ను అదుపులో ఉంచుకోవడమే తప్ప రివర్స్ చేయడం సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ హాంకాంగ్ లో ఉంటున్న ఓ భారత సంతతి సీఎఫ్‌వో మాత్రం డయాబెటీస్ ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లతోపాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు.. అమోలీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న భారత సంతత వ్యక్తి రవిచంద్ర తాను డయాబెటీస్ ను ఎలాంటి మందులు వాడకుండానే రివర్స్ చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రవిచంద్ర 2015లో 51 ఏళ్ల వయసులో టైప్‌‌2 డయాబెటీస్ బారిన పడ్డారు. దీంతో డాక్టర్ ను సంప్రదించగా వెంటనే మందులు వాడాలని సూచించారు. కానీ అందుకు రవిచంద్ర మనసు అంగీకరించలేదు. మందులు వాడకుండానే దానిని తగ్గించుకోవాలనుకున్నారు.

మందుల బదులు సహజంగానే బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉంచుకోవాలని భావించిన రవిచంద్ర అందుకు రన్నింగే ఉత్తమమైనదని భావించి ఆలస్యం చేయకుండా వెంటనే పరుగు ప్రారంభించారు. ఇలా 3 నెలలపాటు నిత్యం రన్నింగ్ చేసిన అనంతరం బ్లడ్ గ్లూకోజ్ స్థాయులను పరీక్షించుకోగా తిరిగి సాధారణ స్థాయికి వచ్చేసినట్లు రవిచంద్ర తెలిపారు. షుగర్ బారిన పడ్డట్లు తెలియగానే రవిచంద్ర వివిధ మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 29 రేసుల్లో పాల్గొన్నారు. అందులో హాంకాంగ్, చైనా, తైవాన్, ఇండియాలో జరిగిన 12 మారథాన్ లు, 5 హాఫ్ మారథాన్ లు, 10 కిలోమీటర్ల పరుగు పందేలు 7.. 5 అల్ట్రా రన్స్ తోపాటు హాంకాంగ్ లో జరిగిన 100 కిలోమీటర్ల ఆక్స్ఫాం ట్రెయిల్ వాకర్ కూడా ఉంది.

సుమారు 100 మారథాన్ లు పరుగెత్తిన తన స్నేహితుడి స్ఫూర్తితో రవిచంద్ర 2011లో మారథాన్ లలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే ఓ సంఘటనతో పరుగును ఆపేశాడు. చివరకు డయాబెటీస్ బారిన పడ్డాక మళ్లీ పరుగు మొదలుపెట్టాడు. అయితే ఈసారి రన్నింగ్ కోసం తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. తాను ముందుగా ఒక కిలోమీటర్ వాకింగ్ తో మొదలుపెట్టినట్లు రవిచంద్ర చెప్పారు. ఆ తర్వాత కాసేపు పరుగెత్తడం, మళ్లీ కాసేపు నడవడం ఇలా 10 కిలోమీటర్లు చేసేవాడిననీ ఇలా వారానికి 3‌‌‌‌ నుంచి 4 సార్లు ఏకధాటిగా 10 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేసేవాడినినీ అన్నారు. ఇప్పుడు వారంలో 6 రోజులపాటు 8 నుంచి 9 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 వేల కిలోమీటర్లు రన్నింగ్ చేసినట్లు ఆయన అన్నారు. తాను ఎక్కువగా వెజిటేరియన్ ఆహారాన్నే తీసుకుంటానని అప్పుడప్పుడూ చేపలు లేదా చికెన్ తింటానన్నారు.

Sapota: బరువు తగ్గాలా.. ఈ పండు తినండి..

అధిక బరువు కారణంగా ఆరోగ్యానికి చాలా నష్టం. ఎన్నో సమస్యలొస్తాయి. దీనిని తగ్గించుకునేందుకు ఇంటి చిట్కాల దగ్గర్నుంచి జిమ్ వర్కౌట్స్ దాకా చాలా ప్రయత్నిస్తారు కొంతమంది. అలాంటివారు ఫుడ్‌లో కూడా కొన్ని మార్పులు చేయాలి. కొన్ని పుడ్స్‌ని తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు సపోటా తింటే బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం.

ఈ పండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తినాలనే కోరికలు తగ్గుతాయి. దీంతో ఎక్కువగా తినకుండా ఉంటారు. కేలరీలు ఎలాగూ తక్కువగా తీసుకుంటాం. కాబట్టి, బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

తక్కువ కేలరీలు..
ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువ కేలరీలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, మిగతా పండ్లతో పోలిస్తే ఇందులో కేలరీలు చాలా తక్కువ. దీంతో కేలరీల గురించి ఆలోచించకుండా వీటిని హ్యాపీగా తినొచ్చు. దీంతో బరువు తగ్గుతారు.

రక్తంలో చక్కెర స్థాయిలు..
సపోటల్లోని చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపించదు. అంతే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో పాటు, ఇందులోని విటమిన్స్, ఖనిజాలు ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి హెల్ప్ అవుతాయి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది.

జీర్ణవ్యవస్థ..
సపోటల్లో ఎక్కువగా ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థని హెల్దీగా ఉంచుతాయి. కడుపులో మంట రాకుండా చూస్తాయి. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. దీంతో కడుపు ఆరోగ్యం బాగుంటుంది.

పోషకాలు..
బరువు తగ్గాలనుకునేవారు డైట్ ఫాలో అయ్యేటప్పుడు విటమిన్స్, మినరల్స్ లోపం రాకుండా పోషకాహారం తీసుకోవాలి.
కాబట్టి, విటమిన్, ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఈ పండ్లు తింటే జీవక్రియ పెరిగి కొవ్వు కరిగి బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Software Engineer: టెకీలకు కొత్త కష్టాలు.. ఇక ఈ జన్మలో పెళ్లియోగం లేనట్లే! నెట్టింట రచ్చ

కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన..
కాలం మారుతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి అనుగుణంగా సంపాదన కూడా ఉండాలని నేటి తరం యువత భావిస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. లక్షల్లో సంపాదన ఉన్నా యువతులు తమను పెళ్లాడేందుకు ఆసక్తి చూపడం లేదంటూ కొందరు టెకీలు తలలు పట్టుకుంటున్నారు. భారీ ప్యాకేజీ ఉన్న వారివైపే మొగ్గు చూపుతున్నారట. తాజా పరిణామం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన సోసల్ మీడియా పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే..

ఓ యువకుడు బాగా చదువుకుని ఇంజనీరింగ్‌ కొలువు కొట్టాడు. ఉద్యోగం వచ్చింది కదా అని రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అలా ఓ అమ్మాయిని చూసేందుకు వారి ఇంటికి వెళ్లారు. మాటల మధ్యలో వరుడి వార్షిక వేతనం ఎంత అని వధువు తరపు బంధువులు ప్రశ్నించారు. రూ.8 లక్షలు అని వరుడు సమాధానం చెప్పాడు. దీంతో వెంటనే వధువు సదరు పెళ్లి సంబంధాన్ని తిరస్కరించింది. కారణం ఏంటని ప్రశ్నించగా తనకు ఉద్యోగం లేదని, వరుడికి కనీసం ఏడాదికి రూ.25 లక్షల జీతం ఉంటే తప్ప కుటుంబం గడవదని ఇంత తక్కువ జీతంతో కుటుంబాన్ని నడపడం కష్టమని వివరణ ఇచ్చింది. వధువు సమాధానం విని వరుడు తరపు బంధువులు నోరెల్ల బెట్టారు.
ఏడాదికి రూ.8 లక్షల ప్యాకేజీ ఉన్న తనను వివాహం చేసుకునేందుకు ఓ యువతి తిరస్కరించిందని తన గోడును స్నేహితునికి చెప్పుకుని గొల్లుమన్నాడు. దీంతో సదరు స్నేహితుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏడాదికి రూ.8 లక్షలు సంపాదించే తన ఇంజనీర్‌ ఫ్రెండ్‌ వివాహ కష్టాలు తెలిపాడు. దీంతో ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. నెట్టింట పోస్ట్​ చేసిన ఒక్క రోజులోనే 5.1లక్షల వీక్షణలు​, వేలల్లో లైక్స్​ వచ్చాయి. అయితే.. చాలా మంది ఆ వదువుకు మద్దతుగా కామెంట్స్​ చేస్తున్నారు.

‘పర్లేదు. అంచనాలు పెట్టుకోవడంలో తప్పేముంది? పెళ్లికి ముందే ఆమె తన అంచనాలను స్పష్టంగా వెల్లడించింది. ఇది అబ్బాయికి సదావకాశం. రాబోయే 2-4 సంవత్సరాలలో తన వార్షిక వేతనం రూ. 25 లక్షలకు పెంచుకునే పనిలో ఉంటాడు. లేదంటే ఏడాదికి రూ.5 లక్షలు ఆశించే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ఓ యూజర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దంపతులు మెట్రో నగరంలో నివసించాల్సి వస్తే ఏడాదికి రూ.8 లక్షలు చాలా తక్కువ. కనీసం రూ.15 లక్షలైనా ఉండాలని మరో యూజర్‌ వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని రాసుకొచ్చాడు. ఏదైమైనా ఇదే ట్రెండ్ మనుముందు కొనసాగితే టెకీలంతా పెళ్లికాని ప్రసాదులై పోతారేమో.. నని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

వాషింగ్‌మెషిన్‌ని 2 వారాలకి ఓసారి ఇలా క్లీన్ చేస్తే బట్టల మురికి చక్కగా పోతుంది..

బట్టల్ని ఉతకడానికి చాలా మంది వాషింగ్ మెషిన్ వాడతారు. దీంతో త్వరగా పని అయిపోతుంది. వాషింగ్ మెషీన్ శుభ్రంగా క్లీన్ చేయడం తప్పనిసరి. దీని వల్ల బట్టలు కూడా నీట్‌గా క్లీన్ అవుతాయి. అయితే, మరి వాషింగ్‌మెషిన్‌ని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.

వంటసోడా..
వెనిగర్, బేకింగ్ సోడాని కలపండి. దీనిని స్పాంజితో తీసి మెషిన్‌ లోపల బాగా రుద్దాలి. ఆ తర్వాత కాస్తా వేడినీరు పోసి క్లీన్ చేయొచ్చు. దీని వల్ల మురికి త్వరగా పోతుంది. తర్వాత మీరు శుభ్రమైన గుడ్డతో వాషింగ్ మెషిన్‌ని క్లీన్ చేయండి. దీంతో చక్కగా క్లీన్ అవుతుంది.

వైట్ వెనిగర్..
మీరు వెనిగర్‌తో వాషింగ్ మెషిన్‌ని క్లీన్ చేయండి. దీని కోసం ముందుగా వెనిగర్ తీసుకుని డిటర్జెంట్ డిస్పెన్సర్‌లో వేయండి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్‌ని ఆన్ చేసి స్పిన్ చేయండి. ఈ టైమ్‌లో వెనిగర్ వాషింగ్ మెషిన్ లోపలి భాగాన్ని నానబెడుతుంది. దీంతో మురికిమొత్తం బయటికి వస్తుంది. ఆ తర్వాత మామూలుగా బట్టలు ఉతికినట్లే నీరు పోసి తిప్పి మెషిన్‌లో సరిగ్గా ఉతకొచ్చు.

నిమ్మ, టూత్‌పేస్ట్..
ఇందుకోసం ముందుగా నిమ్మకాయని సగానికి కట్ చేయాలి. తర్వాత ఆముక్కకి పేస్టుని రాయండి. అది వాషింగ్‌ మెషిన్‌లో వేసి కొన్ని నీరు పోయండి. కావాలనుకుంటే మరింత పేస్టు కూడా వేయండి. తర్వాత దానిని ఆన్ చేయండి. నీరు పోసి క్లీన్ చేయండి. దీని వల్ల వాషింగ్ మెషిన్ క్లీన్‌గా మెరుస్తుంది.

ఎన్నిరోజులకోసారి..
తప్పనిసరిగా వాషింగ్ మెషిన్‌ని ప్రతి రెండు వారాలకి ఓ సారి క్లీన్ చేస్తే అది బట్టలలోని సూక్ష్మక్రిములని దూరం చేస్తుంది. వాషింగ్ మెషిన్ శుభ్రంగా ఉంటేనే మన బట్టలు కూడా చక్కగా క్లీన్ అవుతాయి. లేదంటే బట్టలు ఉతికాక కూడా మురికి వదలదు. మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే బట్టల్లోని మురికి అలానే ఉండి పోతుంది.

వీటిని ఉతకొద్దు..
అన్ని బట్టల్ని వాషింగ్ మెషిన్‌లో వేయకపోవడమే మంచిది. ఇందులో ముఖ్యంగా లోదుస్తులు. వీటి ద్వారా ఇందులోని క్రిములు ఇతర బట్టలకి వ్యాపించే అవకాశం ఉంది. దీంతో ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. చిన్న పిల్లల బట్టలు సపెరేట్‌గా ఉతకండి.

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ భారత్‌పై చైనా కుట్రలు.. కేంద్రాన్ని అలర్ట్ చేసిన మైక్రోసాఫ్ట్

Lok Sabha Elections: ప్రస్తుతం దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేచింది. మరోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ఎన్డీఏ కూటమి ఆరాటపడుతుండగా.. నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక విషయాలు వెల్లడించింది. భారత్‌లో జరగనున్న ఎన్నికల్లో డ్రాగన్ తలదూర్చే యత్నాలు చేస్తోందని మైక్రోసాఫ్ట్.. ఆందోళన వ్యక్తం చేసింది.

భార‌త్‌లో మరికొన్ని రోజుల్లో జ‌ర‌గ‌నున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చైనా జోక్యం చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్-ఏఐని ఉపయోగించుకుని.. లోక్‌స‌భ ఎన్నిక‌లపై చైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపింది. ఏఐ ఆధారిత సమాచారంతో భారత్‌తో పాటు అమెరికా, ద‌క్షిణ కొరియా దేశాల్లో ఉన్న ఎన్నిక‌ల‌పైన కూడా ప్రభావం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.
ఎన్నిక‌ల వేళ ఏఐ ఆధారిత సమాచారాన్ని సోష‌ల్ మీడియా వేదికగా ద్వారా ప్రచారం చేయ‌నున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో కీల‌క‌ంగా ఉండే ఎన్నిక‌లు త‌మ‌కు అనుకూలంగా ఉండే రీతిలో చైనా ఆ ప్రచారం చేసే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్‌ మీడియాలో మీమ్స్‌, డీప్‌ ఫేక్‌ ఫొటోలు, వీడియోలు, ఆడియోల రూపంలో ఆ కామెంట్ ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే చైనాకు మద్దతుగా ఉండే రీతిలో ఆ సోషల్ మీడియా కంటెంట్‌ను రూపొందించ‌నున్నారని వెల్లడించింది. ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌తో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూప‌డం త‌క్కువే అన్న అభిప్రాయాన్ని కూడా మైక్రోసాఫ్ట్ వ్యక్తం చేసింది.
ఈ ఏడాది ప్రపంచంలోని దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా 49 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ టీమ్‌ హెచ్చరికల ప్రకారం.. చైనా కేంద్రంగా పనిచేసే కొన్ని సైబర్ గ్రూప్‌లు వివిధ దేశాల్లో జరిగే ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయని.. ఆ గ్రూప్‌లకు ఉత్తర కొరియాలోని మరికొన్ని గ్రూపులు సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు చైనా మీద ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని తైవాన్‌లో చైనా విస్తృతంగా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇదే విధంగా వివిధ దేశాల్లో కూడా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

Clay Pot Water Benefits: వేసవిలో కుండలోని నీళ్లు తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్‌ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు..
నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్‌ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ వాటర్ కంటే.. కుండలోని నీటిని తాగడం చాలా ఆరోగ్యం అని, శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మరి కుండ నీళ్లు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేచురల్‌గానే చల్లగా ఉంటాయి:
కుండలోని నీరు సహజంగానే చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిజ్ లోని వాటర్ కంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుండ నీరు తాగితే శరీరానికి చలువ చేస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఇప్పుడంటే వంట పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం అన్నీ మట్టి కుండల్లోనే చేసేశారు. నిల్వ ఉంచే పదార్థాలు సైతం వీటిల్లోనే ఉండేవి. మట్టి పాత్రల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరానికి చాలా మంచిది. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది.
గొంతు నొప్పి – జలుబు రావు:
కుండ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, వేడి చేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదే ఫ్రిజ్‌లోని వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటివి త్వరగా ఎటాక్ చేస్తాయి. మట్టి కుండలోని నీటిని తాగితే.. ఈ సమస్యలు దూరం అవుతాయి.

జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
కుండలను బంక మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇవి సహజంగానే ఆల్కలీన్.. కాబట్టి ఇందులో నిల్వ చేసిన నీరు పీహెచ్ లెవల్స్ కంటే బ్యాలెన్స్‌గా ఉంటాయి. కాబట్టి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. అలాగే మల బద్ధకం వంటి సమస్య కూడా తగ్గుతుంది

ఎలాంటి బ్యాక్టీరియా ఉండవు:
సాధారణ నీటి కంటే.. కుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. మట్టికుండ.. నీటిలోని సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాబట్టి ఈ నీటిలో వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉండవు. జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

Hanuman Jayanti: హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

పవన్‌పుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంధాల ప్రకారం సంకత్మోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు. అదే సమయంలో చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని కూడా జరుపుకుంటారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి.

హనుమంతుడికి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవత లేదా దేవుళ్లకు అంకితం చేయబడినట్లుగా మంగళవారం కూడా పవన పుత్ర హనుమాన్‌కి అంకితం చేయబడింది. హనుమంతుడి జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. ఈ రెండు వార్షికోత్సవాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

హనుమంతుడు శ్రీ రామునికి గొప్ప భక్తుడు. హిందూ మతంలో అతని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని బాధలను , కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం. అందుకే అతనిని సంకత్మోచనుడు అని కూడా పిలుస్తారు. శ్రీ రామ నవమిలాగే హనుమాన్ జయంతి రోజు కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే హనుమంతుడు జన్మించాడు. అయితే హనుమాన్ జయంతిని ఏడాదికి ఒకసారి కాదు రెండు సార్లు జరుపుకుంటారని మీకు తెలుసా. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి ఎప్పుడు? (హనుమాన్ జయంతి 2024 ఎప్పుడు)
వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి తేదీన స్వాతి నక్షత్రంలో జన్మించాడు. అందుకే ఈ తేదీని హనుమంతుని జన్మదినంగా జరుపుకుంటారు. అదే సమయంలో చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హనుమాన్ జయంతి వెనుక ఒక పురాణ కథ ఉంది. ఈ ఏడాది 2024లో హనుమాన్ జయంతి ఏప్రిల్ 23న జరుపుకోనున్నారు.

పవన్‌పుత్ర హనుమాన్ ఒక జన్మదినాన్ని ఆయన జయంతిగా జరుపుకుంటారు. మరొక జన్మదినాన్ని విజయ అభినందన మహోత్సవంగా జరుపుకుంటారు. హిందూ మత గ్రంధాల ప్రకారం సంకత్మోచన హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజు మంగళవారం మేషరాశిలో జన్మించాడు.

అందుకే హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు
అదే సమయంలో చైత్రమాసంలో మరోసారి హనుమంతుడి జయంతిని కూడా జరుపుకుంటారు. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఆ పురాణాల ప్రకారం హనుమంతుడికి పుట్టినప్పటి నుండి అద్భుతమైన శక్తులు ఉన్నాయి. బాల్యంలో ఒకసారి, హనుమంతుడికి ఆకలిగా అనిపించినప్పుడు అతను సూర్యుడిని ఒక పండుగా కనిపించాడు. దానిని తినడానికి సూర్యుడి వెనుక పరిగెత్తడం ప్రారంభించాడు. అతని దగ్గరికి వెళ్లి, అతను సూర్యుడిని మింగడానికి ప్రయత్నించాడు. దీని కారణంగా భూమి మొత్తం చీకటి వ్యాపించింది. ఇంద్ర దేవుడు ఈ విషయం తెలుసుకుని సూర్యుడిని తినకుండా ఆపడానికి హనుమంతుడిని పిడుగుతో కొట్టాడు. దీంతో హానుమాన్ కింద పడిపోయాడ.

ఈ విషయం హనుమాన్ తండ్రి పవన్‌ దేవుడికి తెలియడంతో… అతను చాలా కోపంతో విశ్వం మొత్తం గాలిని నిలిపివేశాడు. దాని కారణంగా భూమిపై గాలి లేకపోవడంతో హకారాలు ఏర్పడ్డాయి. దీని తరువాత బ్రహ్మ దేవుడు వాయు దేవుడి కోపాన్ని చల్లార్చాడు. హనుమంతుడికి ప్రాణం పోశాడు. చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడు కొత్త జీవితాన్ని పొందాడని నమ్ముతారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి కారణం ఇదే.

హనుమాన్ జయంతి గురించి అడిగే కొన్ని ప్రశ్నలు.. వాటి సమాధానాలు
హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

సమాధానం- హనుమంతుడి జయంతి రోజున ఇంట్లో సుందరకాండ పారాయణం చేసి పేదలకు బూందీ లడ్డూ ప్రసాదం పంచండి. హనుమాన్ జయంతి నాడు, బజరంగబలికి సింధూరం, తమలపాకును సమర్పించండి.

హనుమాన్ జయంతి నాడు ఏమి చేయకూడదు?

సమాధానం- ఈ రోజున, మహిళలు పూజ సమయంలో బజరంగ్ బాన్ పఠించకూడదు. ఉపవాసం ఉన్నవారు ఉప్పు తినకూడదు.

హనుమాన్ జయంతి రోజున ఏమి దానం చేయాలి?

హనుమంతుడి జయంతి రోజున లిచీ, యాపిల్, దానిమ్మ మొదలైన ఎరుపు రంగు పండ్లను కూడా దానం చేయవచ్చు. ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ఏమి అందించాలి?

ఈ రోజున తమాల పాలకులు, బెల్లం , శనగలు, అరటిపండు, లడ్డూ, బూందీ, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు కుంకుమపువ్వుతో చేసిన అన్నం కూడా నైవేద్యంగా పెట్టవచ్చు.

హనుమంతునికి ఇష్టమైన పండు ఏది?

సమాధానం- మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి అరటిపండ్లు ప్రియమైనవి. అందుచేత హనుమంతుడి జయంతి రోజున అరటి పండ్లను సమర్పించవచ్చు.

హనుమంతుడికి ఏ ప్రసాదం అంటే ఇష్టం?

సమాధానం- హనుమంతుడి జయంతి పూజ సమయంలో ప్రసాదం లేదా లడ్డూ లేదా శనగపిండి బర్ఫీ వంటి స్వీట్లను అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

AP Politics: వారందరికీ ఏప్రిల్ నుంచే రూ. 4 వేలు పింఛన్‌ పంపిణీ..

రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.

రాజమహేంద్రవరం, భీమవరం/నరసాపురం/పాలకొల్లు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్‌ ఇస్తాను. ఏప్రిల్‌, మే, జూన్‌ల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్‌లో కలిపి అందిస్తాను’’ అని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛనుదార్లను చంపేసి మరోసారి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు.

వలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయి…

‘‘వలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనీయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్‌ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్‌ ఒకటైతే, జగన్‌ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్‌…వలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలుమీద సంతకం పెడతానని సిగ్గులేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్నవారి కెరీర్‌ పెరిగేలా, మరింత ఆదాయానికి ఏమి చేయాలో చేసే బాధ్యత మాదని పదేపదే చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే, రెండోరోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు.. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వలంటీర్లు రాజకీయాల్లో జోక్యంచేసుకోవడానికి వీల్లేదు. వలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ కెరీర్‌ కూడా బిల్డప్‌ చేస్తామని చెప్పాం’’

పెన్షన్‌ పేటెంట్‌ టీడీపీదే..

‘‘పెన్షన్ల పేటెంట్‌ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం. ఇంటి దగ్గరే ఇస్తాం. పెంచిన రూ.4వేలు ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల వరకూ ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రూ.13 లక్షలకోట్లు అప్పుతెచ్చాడు. ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్‌ను చూస్తుంటే పాత సినిమాలో విలన్‌ నాగభూషణం గుర్తుకొస్తున్నాడు. ఫ్యాన్‌ అరిగిపోయింది. దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. జగన్‌ ఎక్స్‌ఫైర్డ్‌ మెడిసిన్‌.’’

వచ్చాడు.. బచ్చా

‘‘నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు.. బచ్చా.. వదలను.. నా తడాఖా చూపిస్తా. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి. నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం. దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూహక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకున్న నాలుగు ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా.. న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు.’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పెన్షనర్ల పట్ల జగన్‌ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయనను ఈసీ ప్రశ్నించాలి. జగన్‌ చేతకాని తనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి’’

‘‘నేను మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానంటే.. జగన్‌ రాజీనామా చేసిన వలంటీర్ల నియామకంపై తొలి సంతకం చేస్తానంటున్నాడు. నాది సమాజహితం. జగన్‌ది స్వార్ధం. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి, గంజాయ్‌ కావాలంటే జగన్‌ రావాలి’’

Gold Price: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుంది? ఇప్పుడు కొనడం మంచిదేనా.. నిపుణులు ఏమంటున్నారు?

Gold Price: బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.70 వేలు దాటింది. మరి ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా? బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Gold Price: బంగారం ధరలు రోజు రోజు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లో తులం బంగారం రూ. 1300 పైన పెరిగింది. ప్రస్తుతం గ్రాము గోల్డ్ రేటు 7 వేల పైనే ఉంది. మరి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? బంగారాన్ని నగల రూపంలో కొంటే బెటరా లేదా బాండ్స్ రూపంలో కొనడం మంచిదా? బంగారం ధరలు పెరిగేందుకు కారణాలేంటి, ఈ పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ధరలు తగ్గే వరకు వేచి చూడడం మంచిదేనా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధర పెరగుదలతో పోలిస్తే.. తగ్గడం చాలా స్వల్పంగా ఉంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకుల వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని భద్రమైన సాధనంగా భావిస్తున్నారు. గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలుఉంటాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. ధరలను నిర్ణయించేది ఈ మార్కెట్టే. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 2,256 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ అవుతోంది. 2023 నాటి గరిష్ఠ ధరతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. భారత కరెన్సీ విలువ సైతం పడిపోవడం గోల్డ్ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. ప్రతి ఏడాది భారత్ కు 800 టన్నుల బంగారం దిగుమతి అవుతుంటుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు మరో కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత 20 ఏళ్ల కాలాన్ని గమనించినట్లయితే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ పెరగడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల వాతావరణం, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు, రాజకీయ పరమైన మార్పులు సైతం బంగారం పెరిగేందుకు కారణమవుతున్నాయి.
బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు?
బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ ఏడాదంతా ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయని అర్థమవుతోంది. వచ్చే ఏడాదిలో కాస్త ఊరట లభించవచ్చు.

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పసిడిపై పెట్టుబడి పెడితే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నగలు లేదా బంగారు నాణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు కమిషన్ కింద 20 శాతం పోతుంది. అంటే మీరు రూ.100 పెట్టి బంగారం కొంటే దాని అసలు విలువ రూ.80 మాత్రమే. అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెలా వడ్డీ వస్తుంది. బాండ్స్ పోతాయనే భయం ఉండదు. డిజిటల్ గోల్డ్ ద్వారా 4 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు. వాటిపై పన్ను మినహాయింపులు సైతం లభిస్తాయి.

పోస్టాఫీస్‌లో మీరు పొదుపు చేస్తున్నారా? మీకు కేంద్రం శుభవార్త!

ప్రస్తుతం ప్రతి మనిషికి ఆర్థిక క్రమ శిక్షణ ఎంతో అవసరం. ఈ మద్య కాలంలో మనిషికి ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే సామర్ధ్యం ఉండాలి. అందుకోసం మనం సంపాదించే డబ్బులో ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉండాలి అని నిపుణులు చెబుతుంటారు. అలా చేయకుంటే కష్టకాలంలో మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. పొదుపు చేయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పొదుపు చేసుకునే సౌలభ్యం ఉంది. తాజాగా పోస్టాఫీస్ లో పొదుపు చేసేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

సాధారంగా మార్కెట్ లో కొన్ని ప్రైవేట్ సంస్థలు పొదుపునకు సంబందించిన ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే చాలా మందికి ప్రైవేట్ సంస్థలపై పెద్దగా నమ్మకం కుదరదు. అందుకే ప్రభుత్వ రంగాలకు సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే పోస్టాఫీస్ పరిధిలో పలు పెట్టుబడి పథకాలను కేంద్రం అమలు చేస్తుంది. పోస్టాపీస్ లో జీవిత బీమా పథకాలను తీసుకువస్తుంది. తాజాగా జీవిత బీమా తీసుకున్న పాలసీదారులకు కేంద్ర శుభవార్త చెప్పింది. పోస్టాఫీస్ లు ఆరు రకాల జీవిత బీమా పథకాలు ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో సురక్ష పేరుతో హూల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సువిత కన్వర్బబుల్ హూల లైఫ్ ఇన్సురెన్స్ గ్యారంటీ , సంతోష్ ఎండోమెంట్ ప్లాన్, సురక్ష అనే పేరుతో జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, సుమంగల్ పేరుతో యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ప్లాన్, పాల్ జీవన్ బీమా అనే పేరుతో చిల్డ్రన్ ప్లాన్ పథకాలను కేంద్రం ప్రకటించింది.

ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ లు కూడా ప్రకటించింది. బోనస్ ఏప్రిల్1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి మార్చి 13 న కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనలకు సంబంధించిన బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ప్రకారం.. ప్రతి 1000 లైఫ్ ఇన్సూరెన్స్ కు 60 రూపాయలు వరకు బోనస్ రూపంలో పెట్టబడిదారుడికి వస్తుంది. ఇక పిల్లల కోసం పాలసీలతో పాటు ఎండోమెంట్ పథకాలలో 1000 హామీకి 48 రూపాయలు బోనస్, యాంటీసిపేటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ పై 1000 రూపాయలకు గాను 45 రూపాయల వరకు బోనస్ లభిస్తుంది. కేంద్రం టెర్మినల్ బోనస్ ప్రవేశపెట్టింది.. దీని ప్రకారం ప్రతి 10 వేల రూపాయలకు 20 టెర్మినల్ బోనస్ లభిస్తుంది. చాలా మందికి పోస్టాఫీస్ లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. మరి ఎందుకు ఆలస్యం.. దగ్గరలోని పోస్టాఫీస్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకొని పోదుపు మొదలు పెట్టండి.

ఇంటి నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం… దీన్ని ఎలా నిర్వహిస్తారో తెలుసా…

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుంది. మొదటి దశ ఓటింగ్‌కు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం శుక్రవారం రాజస్థాన్‌లో ప్రారంభమైంది. రాజస్థాన్‌లో 58 వేల మంది ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేశారు. మొదటి దశలో 35,542 మంది ఇంటింటికి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇందుకోసం మార్చి 27వ తేదీనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఇంటి ఓటింగ్ కోసం ప్రత్యేక ఓటింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీని శిక్షణ ఏప్రిల్ 4 నాటికి పూర్తయింది. హోమ్ ఓటింగ్ అంటే ఏమిటి, ఈ విధంగా ఓటు వేసే అవకాశం ఎవరికి లభిస్తుంది, ఒకరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇంటి నుంచే ఓటింగ్ అంటే ఏమిటి, ఎవరికి అవకాశం ఉంటుంది ?

ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఓటు వేసేలా చేసే ప్రక్రియను ఇంటింటికి ఓటింగ్ అంటారు. గత ఎన్నికల్లో కూడా ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయం సాధించారు. ఈ ప్రత్యేక పోలింగ్ బృందాలు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తాయి. మొదటి విడతలో ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు.

కొంతమంది ఓటర్లకు ఇంటింటికి ఓటు హక్కు కల్పించారు. ఎన్నికల ప్రవర్తన నియమాలు, 1961 చట్టంలోని 27Aలోని గైర్హాజరీ ఓటరు విభాగం కింద వారిని గుర్తించారు. ఇంటింటికి ఓటు వేసేందుకు ఓటర్లను ఎంపిక చేసేందుకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి.

ఇందులో ఓటరు వయస్సు 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. వికలాంగ ఓటర్లకు ఈ అవకాశం లభిస్తుంది. కోవిడ్ వంటి అంటు వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. అలాగే కొన్ని అవసరమైన సేవలతో అనుబంధించి ఉన్న వ్యక్తులకు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత గల దరఖాస్తుదారులు తమ లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి ఫారం 12-డిని సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన 5 రోజుల్లోగా ఓటరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఇద్దరు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ బృందంతో కలిసి ఓటరు ఇంటికి వస్తారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడానికి వారికి సహాయం చేయాలి.

ఈ ఓటింగ్ సమయంలో పారదర్శకతను కొనసాగించడానికి, ఈ ఓటర్ల జాబితాను తయారు చేస్తారు. ఆ ప్రాంత పార్టీ అభ్యర్థులతో జాబితాను పంచుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బ్యాలెట్ పేపర్ రిటర్నింగ్ అధికారి వద్ద భద్రంగా ఉంచుతారు. ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రక్రియ సాధారణ ఓట్ల లెక్కింపు సమయంలో జరుగుతుంది.

రాజస్థాన్‌లో రెండో దశ ఇంటి ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 2న పూర్తయింది. ఈ విధంగా రెండో విడత ఇంటింటికి 22,500 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 17,324 మంది సీనియర్ సిటిజన్లు, 5,222 మంది వికలాంగ ఓటర్లు ఉన్నారు. వీటికి పోలింగ్ ఏప్రిల్ 14 నుంచి 21 వరకు జరగనుంది. రాజస్థాన్‌లో ఇంటింటికి పోలింగ్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికి ఓటింగ్ నిర్వహించి విజయవంతం చేశారు.

భారీగా బంగారం కొంటున్న RBI. దీని వెనుక పెద్ద కథే ఉంది!

భారీగా పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో ఉంచుకున్న.. భారత్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇప్పుడు అది గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోతున్న క్రమంలో.. దానిని నిల్వ ఉంచేందుకు.. భారత్ బంగారాన్ని భారీగానే కొనుగోలు చేస్తూ..దానిని నిల్వ చేస్తూ వస్తోంది. గత రెండేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇండియా .. బంగారాన్ని కొనుగోలు చేసింది. కానీ, ఇప్పటివరకు ఎంత బంగారం సేకరించారన్న విషయాన్నీ బయటకు చెప్పలేదు కానీ.. భారత్ లో బంగారం నిల్వల విలువ మాత్రం గరిష్ట స్థాయికి చేరుకుందని. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అయితే, అసలు ఎంత స్థాయిలో ఇప్పటివరకు బంగారం నిల్వలు జరుగుతున్నాయన్న విషయం తెలియదు కానీ, అధికారిక లెక్కల ప్రకారం.. 2022 మార్చి నాటికి ఫారిన్ ఎక్స్చేంజి నిల్వలలో 51.487 బిలియన్ డాలర్స్ విలువైన బంగారం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2023 మార్చి నాటికి అప్పటికి ఉన్న విలువలతో పోల్చితే.. 6.287 బిలియన్ డాలర్స్ రెట్టింపు అయిందట. ఇక ఇప్పుడు చూసినట్లయితే.. ఒక్క జనవరి నెలలోనే.. 8.7 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. గత రెండు సంవత్సరాల నుంచి చూసినట్లయితే కనుక.. ఇంత బంగారాన్ని సేకరించడం ఇదే మొదటిసారి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ఈ 2024 జనవరి నాటికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు 812.3 టన్నులకు చేరుకున్నట్లు సమాచారం.

ఈ విషయాలన్నీ కూడా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. లేవరేజ్ పాలసీ రివ్యూ నిర్ణయాలను శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 29 నాటికీ ఫారెన్ నిల్వలు 645.6 బిలియన్ డాలర్స్ వరకు చేరుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో ఒక డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చినపుడు.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ నిల్వలను కొనసాగిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా దీనిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భావి తరాలకు ఉపయోగపడతాయని. అంతా భావిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సేకరణ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే దానికి సంభందించిన భద్రతా చర్యలను కూడా పటిష్టంగానే చేపడుతున్నారు.

manjummel boys telugu review: రివ్యూ: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. మలయాళ సూపర్‌హిట్‌ తెలుగులో ఎలా ఉంది?

మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

Manjummel Boys telugu review: చిత్రం: మంజుమ్మ‌ల్ బాయ్స్‌; న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు; సంగీతం: సుశిన్ శ్యామ్‌; ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్; ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం; నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌; విడుద‌ల తేదీ: 06-04-2024

ఈ మధ్య కాలంలో మ‌ల‌యాళంలో బాగా వినిపించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌లో మంజుమ్మ‌ల్ బాయ్స్ ఒక‌టి. రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. దీంతో ఇప్పుడా సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. మ‌రి ఈ చిత్ర కథేంటి? ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి అందించింది? ఇక్క‌డా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టే అవ‌కాశ‌ముందా?

క‌థేంటంటే: కేర‌ళ‌లోని కొచ్చికి చెందిన కుట్ట‌న్ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులంద‌రూ సొంత ఊళ్లోనే చిన్నాచిత‌కా ఉద్యోగాలు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మ‌ల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేష‌న్ ఉంటుంది. వీరంతా క‌లిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. ఈ విహార‌యాత్ర‌కు సుభాష్ తొలుత రాన‌ని చెప్పినా.. కుట్ట‌న్ బ‌ల‌వంతం మీద ఆఖ‌రి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమ్మ‌ల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల‌న్నీ చూశాక ఆఖ‌రిలో గుణ కేవ్స్ చూడ‌టానికి వెళ్తారు. ఆ గుహ‌లు బ‌య‌ట నుంచి చూడ‌టానికి ఎంత ర‌మ‌ణీయంగా ఉంటాయో.. అంతే ప్ర‌మాద‌క‌రం కూడా. ఎందుకంటే అక్క‌డ వంద‌ల అడుగుల లోతున్న ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒక‌టి. దాదాపు 150 అడుగుల‌కు పైగా లోతున్న ఆ లోయ‌లో 13మందికి పైగా ప‌డ‌గా.. ఏ ఒక్క‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర లోయ‌లున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్ల‌డాన్ని అట‌వీశాఖ వారు.. పోలీసులు నిషేధిస్తారు. కానీ, మంజుమ్మ‌ల్ బాయ్స్ అక్క‌డున్న అట‌వీ సిబ్బంది కళ్లుగ‌ప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన ప్ర‌దేశానికి వెళ్తారు. అక్క‌డ వారంతా స‌ర‌దాగా గ‌డుపుతుండ‌గా అనుకోకుండా సుభాష్ అక్క‌డే ఉన్న అతి ప్ర‌మాద‌క‌ర‌మైన డెవిల్స్ కిచెన్ లోయ‌లోకి జారిప‌డ‌తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాల‌తో కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? పోలీసులు వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మేంటి? ఆ ప్ర‌మాద‌క‌ర‌మైన లోయ‌లోకి వెళ్ల‌డానికి పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందే భ‌య‌ప‌డుతున్న‌ప్పుడు సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ మాత్ర‌మే లోయ‌లోకి దిగేందుకు ఎందుకు సిద్ధ‌ప‌డ్డాడు?వాళ్లిద్ద‌రూ ఆఖ‌రికి ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డ్డారా? లేదా?అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇది య‌థార్థ క‌థ‌. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న త‌న మిత్రుడ్ని ర‌క్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మ‌ల్ బాయ్స్ చేసిన సాహ‌సానికి తెర రూప‌మే ఈ చిత్రం. దీన్ని ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఎంతో నిజాయితీగా స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా తెర‌పై చూపించ‌గ‌లిగాడు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయ‌లో.. ఆ క‌టిక చీక‌ట్ల మ‌ధ్య తామే చిక్కుకున్నామేమో అని ప్రేక్ష‌కుల‌కు అనిపించేలా క‌థ‌ని ఉత్కంఠ‌భ‌రితంగా న‌డిపించాడు. నిజానికి కొన్ని మ‌ల‌యాళ క‌థ‌ల్లో స్లోనేరేష‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంద‌నే విమ‌ర్శ త‌ర‌చూ వినిపిస్తుంటుంది. ఇది ఈ చిత్ర విష‌యంలోనూ త‌ప్ప‌కుండా మ‌ళ్లీ వినిపిస్తుంది. మంజుమ్మ‌ల్ బాయ్స్ నేప‌థ్యాన్ని.. వారి ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తూ నెమ్మ‌దిగా మొద‌లైన క‌థ ఆ తర్వాత బ‌లంగా ప‌ట్టేస్తుంది. నిజానికి విరామం వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. పెద్ద‌గా డ్రామా, మలుపులు లేకున్నా మంజుమ్మ‌ల్ గ్యాంగ్ అల్ల‌రి బాగానే కాల‌క్షేపం చేయిస్తుంది. వీళ్లు ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడాల‌ని నిర్ణ‌యించుకుంటారో అక్క‌డే క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో ప‌డిన త‌ర్వాత నుంచి క‌థ ఒక్క‌సారిగా ఉత్కంఠ‌భ‌రితంగా మారిపోతుంది. అక్క‌డి నుంచి చివ‌రి వ‌ర‌కు సుభాష్‌ను ఎలా బ‌య‌ట‌కు తీసుకొస్తారా? అన్న ఆస‌క్తి ప్రేక్ష‌కుల్ని తొలిచేస్తుంటుంది. ద్వితీయార్ధ‌మంతా ఈ స‌ర్వైవ‌ల్ డ్రామాతోనే ముందుకు సాగుతుంది.

సుభాష్ లోయ‌లో ప‌డ్డాక లోప‌ల త‌న ప‌రిస్థితి ఏంటో తెలియ‌క తోటి మిత్రులంతా ప‌డే ఆవేద‌న మ‌దిని బ‌రువెక్కిస్తుంది. ఇలాంటి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో చిక్కుకున్న‌ప్పుడు పోలీసులు స్పందించే తీరును సినిమాలో చాలా స‌హ‌జంగా చూపించారు. పోలీసుల‌తో పాటు స్థానిక ప్ర‌జ‌లు మంజుమ్మ‌ల్ బాయ్స్‌కు సాయం చేసేందుకు ముందుకు రాకున్నా.. మిత్రుడ్ని కాపాడుకునేందుకు వాళ్లు ప‌డే ఆరాటం, త‌ప‌న ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. లోయలోకి వర్షపు నీరు ఉప్పెన‌లా ముంచెత్తుతుంటే ఆ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తోటి స్నేహితులంతా అడ్డుగా ప‌డుకోవ‌డం ఉద్వేగ‌భ‌రితంగా అనిపిస్తుంది. నిజానికి సుభాష్ లోయ‌లో ప‌డ్డాక త‌న‌కెదుర‌య్యే ప్రాణ‌పాయ ప‌రిస్థితుల‌తో కొంత డ్రామా క్రియేట్ చేసుకునే అవ‌కాశ‌ముంది. కానీ, దాన్ని ద‌ర్శ‌కుడు వాడుకోలేదు. కాక‌పోతే త‌న ప్ర‌స్తుత ప‌రిస్థితిని ఓవైపు చూపిస్తూనే.. మ‌రోవైపు చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేస్తూ క‌థ‌కు బ‌ల‌మైన ఎమోష‌న్స్ అందించే ప్ర‌య‌త్నం చేశాడు. అవి ముగింపును భావోద్వేగ‌భ‌రితంగా మార్చ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. సుభాష్‌ను ర‌క్షించేందుకు కుట్ట‌న్ లోయ‌లోకి దిగే ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. లోయ‌లో నెత్తురోడుతూ నిస్స‌హాయంగా ప‌డి ఉన్న సుభాష్‌ను చూస్తున్న‌ప్పుడు అప్ర‌య‌త్నంగానే క‌ళ్లు చెమ్మ‌గిల్లుతాయి. ఇక ఆ ఇరుకైన లోయ‌లో ఎన్నో స‌వాళ్లు దాటుకొని సుభాష్‌ను కుట్ట‌న్ చేరుకున్న‌ప్పుడు వ‌చ్చే ఓ చిన్న ట్విస్ట్ ప్రేక్ష‌కుల్ని ఉలిక్కిప‌డేలా చేస్తుంది. ముగింపు అంద‌రి మ‌న‌సుల్ని బ‌రువెక్కిస్తుంది.

ఎవరెలా చేశారంటే: కుట్ట‌న్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృంద‌మంతా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. వాళ్లు చేసే అల్ల‌రి ప‌నులు, గొడ‌వ‌లు, వారి స్నేహ బంధం ప్ర‌తి ఒక్క‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చాలా స‌హ‌జంగా ఉంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌ను నిజాయితీగా తెరపై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కాక‌పోతే సినిమాలో పెద్ద‌గా వేగం క‌నిపించ‌దు. అలాగే ద్వితీయార్ధంలో మ‌రీ ట్విస్ట్‌లు, మ‌లుపులు కూడా క‌నిపించ‌వు. కానీ, సినిమాలో ఎక్క‌డా ఉత్కంఠ‌త‌కు లోటుండ‌దు. గుణ కేవ్ సెట‌ప్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. దాన్ని ఛాయాగ్రాహ‌కుడు త‌న కెమెరాతో ఎంతో చ‌క్క‌గా ఒడిసి ప‌ట్టాడు. క‌మ‌ల్ క‌ల్ట్ సినిమా గుణ నేప‌థ్యాన్ని.. ఆ చిత్రంలోని క‌మ్మ‌ని నీ ప్రేమ లేఖ‌లే పాట‌ను ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో చ‌క్క‌గా వాడుకున్నాడు. అలాగే నేప‌థ్య సంగీతం కూడా సినిమాని మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. టెక్నిక‌ల్‌గా ఈ చిత్రం చాలా ఉన్న‌తంగా క‌నిపిస్తుంది.

బ‌లాలు
+ క‌థా నేప‌థ్యం
+ ఉత్కంఠ‌త‌కు గురి చేసే ద్వితీయార్ధం
+ విజువ‌ల్స్‌, నేప‌థ్య సంగీతం
బ‌ల‌హీన‌త‌లు
– నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం
చివ‌రిగా: మంజుమ్మ‌ల్ బాయ్స్‌.. క‌ట్టిప‌డేసే స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Health

సినిమా