Saturday, September 21, 2024

IGI : ఇంటర్‌ అర్హతతో 1,074 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. రూ.35,000 వరకూ జీతం

IGI Aviation Recruitment 2024 : న్యూఢిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,074 ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు మే 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ముఖ్య సమాచారం :
ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్‌ఏ) పోస్టులు: 1,074
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, ఇంటర్‌/12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000గా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.
పరీక్ష ఫీజు: రూ.350గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 22, 2024

నోటిఫికేషన్‌

IGIAS-Staff

KCR Visit Karimnagar: చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి?

KCR Visit Karimnagar: కేసీఆర్ అంటే ముందుగా ఫామ్‌హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేబినెట్ సమావేశం కూడా అక్కడే పెట్టారు. అదంతా రూలింగ్‌లో ఉన్నప్పుడు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.

అసలే ఎండాకాలం.. ఆపై సార్వత్రిక ఎన్నికలు.. చివరకు ఉక్కుపోతతో నేతలు కారు దిగేసి వెళ్లిపోతున్నా రు. చాలామంది నేతలు అధికార కాంగ్రెస్ వైపు వెళ్లగా, మరికొందరు బీజేపీ‌ కండువా కప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు సగానికిపైగా కారు పార్టీ ఖాళీ అయిపోయింది. చివరకు ఏం చేయ్యాలో అధినేతకు అర్థం కావడంలేదు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం జనంలో ఉండడమే ఉత్తమమైన మార్గమని భావించారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు.

చాలామంది నేతలు మాత్రం చంద్రబాబు దారిలోనే కేసీఆర్ కూడా వెళ్తున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. ఆయనతోపాటు నేతలు కూడా నిత్యం ప్రజలతో మమేకమయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ రూట్లో వెళ్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మూడోసారి ప్రజల మధ్యకు వెళ్తున్నారు కేసీఆర్.

తాజాగా గులాబీ దళపతి శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి పదిన్నరకు ముగ్దుంపూర్ చేరుకోను న్నారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ రానున్నారు. భోజనం తర్వాత సిరిసిల్లకు వెళ్తారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించ నున్నారు. రాత్రి ఏడుగంటలకు ఎర్రవెళ్లిలోకి వ్యవసాయ క్షేత్రానికి చేరుకోనున్నారు.

అంబానీ-టాటాల కొత్త ప్రాజెక్ట్! ఇక పెట్రోల్ కొనాల్సిన అవసరం ఉండదేమో!

దేశంలో ఇటీవల ఆటో రంగంలో ఎన్నో రకాల మార్పులు మొదలయ్యాయి. ఎలక్ట్రిక్ కారు కొనాలా? పెట్రోల్ కారు కొనాలా? డీజిల్ వాహనం కొనా? అన్న విషయంలో వినియోదారులు కన్ఫ్యూజ్ లో పడిపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం జీహెచ్ 2 ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ లో అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ వంటి పెద్ద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక రాబోయే పదేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ కార్లు మాయమయ్యే పరిస్థితి వస్తుందని అంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటర్స్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ రవాణా రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం GH2 అనే సరికొంత్త ప్రాజెక్ట్ తో ముందుకు వచ్చింది. అంబానీ, టాలా, ఇండియన్ ఆయిల్ వంటి పెద్ద సంస్థలు రవాణా రంగంలో గ్రీన్, గ్రే హైడ్రోజన్ (GH2)ని ఉపయోగించేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రోగ్రాంలో పాల్గొనేందకు బీడ్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలో ముడి చమురు వినియోగం, దిగుమతులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా గ్రీన్ గ్రే హ్రైడోజన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది.

దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడితే.. ఎంతో చౌకగా ఉంటుంది. దీని ద్వారా వాహనదారులు పెట్రోల్, డిజిల్ కోసం లీటర్ కి రూ.100 కు పైగా చెల్లించాల్సిన అవసరం ఉండదు.. కేవలం రూ.20 నుంచి రూ.30తో కిలో మీటర్ కన్నా ఎక్కువ మైలేజ్ వచ్చే హైడ్రోజన్ వాహనాలను నడపవొచ్చు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు ఇంధనం ఉపయోగించడంలో సమస్యలు, సాంకేతిక డెవలప్ మెంట్, అమలులో మౌలిక అంతరాయలపై అధ్యయనం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జీహెచ్ 2 పైలట్ ప్రోగ్రాం కోసం రూ.496 కోట్ల టండర్ ఫిబ్రవరిలో ప్రారంభించింది. రూ.19,744 కోట్ల నిధులతో జనవరి 2003 లో ఆరంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఇది ఒక భాగం. ఇదిలా ఉంటే.. టాటా నుంచి అంబాని వరకు దిగ్గజ కంపెనీలు అనే ఆసక్తికరమైన కూటములు ఏర్పడ్డాయి. కారణం ఇది ఒక్క కంపెనీతో చేయబడే పని కాదు. ఇప్పటికే రిలయన్స్ అశోక్ లేలలాండ్, డైమ్లర్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాటా మోటర్స్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తో భాగస్వామ్యం, అశోక్ లేలాండ్ కూడా ఎన్‌టీపీసీ జాయిన్ వెంచర్. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ విజయం భారత దేశంలో పెను మార్పులుకు సూచకం అంటున్నారు.

డర్టీ హార్మోన్స్ అంటే ఏమిటి?.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఏం చేయాలి?

మనిషి ఆరోగ్యంగా ఉండటంలో శరీరంలోని హార్మోన్లు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీటిలో సమతుల్యత లోపిస్తూ ఉంటుంది. జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం అవుతుంటాయి. ఫలితంగా శరీరంలో కొన్ని రకాల ఉప హార్మోన్లకు సంబంధించిన జీవక్రియలు ఏర్పడుతుంటాయి. వీటినే డర్టీ హార్మోన్స్‌గా(metabolites) పేర్కొంటారు. స్త్రీలలో ఇవి మంచికంటే, హానినే ఎక్కువ కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

లక్షణాలు – ప్రభావం

డర్టీ హార్మోన్లు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గనుక తరచుగా ఉబ్బరం, రొమ్ము భాగంలో సున్నితత్వం, దురద, వెరైటీ రాషెస్, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేయడంవల్ల అధిక బరువు పెరగడం, యాక్టివ్ నెస్ తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తాయి. అంతే కాకుండా ఫైబ్రాయిడ్స్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా, అలాగే ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు. ఇక టెస్టోస్టెరాన్ లేదా ప్రొజెస్టెరాన్ రిలేటెడ్ డర్టీ హార్మోన్లు ఆండ్రోజెన్స్‌గా పనిచేయం కారణంగా జుట్టు రాలడం, మొటిమలు రావడం, కండరాల బలహీనత, కీళ్లలో నొప్పి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, పీసీఓడీ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.

కాలేయంపై ఎఫెక్ట్

హార్మోన్ల ఉప ఉత్పత్తులైన డర్టీ హార్మోన్స్ అధికమైతే అవి కాలేయం పనితీరు మందగించే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే స్ట్రీలలో ఫెర్టిలిటీ డిక్లైన్, జుట్టు రాలడం, స్వరం మారిపోవడం, మొహంపై మొటిమలు లేదా వెంట్రుకల రావడం, గైనెకోమాస్టియా వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. హార్మోన్ లెవల్స్ కంటే, డర్టీ హార్మోన్ మెటబాలిజం ఎఫెక్ట్ అధికం కావడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు వైద్యుల వద్దకు వెళ్తే హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన టెస్టులు సూచిస్తారు.

నివారణ – చికిత్స

డర్టీ హార్మోన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండాలంటే ప్రాబ్లమ్ గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతోపాటు ప్రతిసారి డర్టీ హార్మోన్లవల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా నివారణ చర్యలు పాటించడం మంచిది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు ఇందుకు దోహద పడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే తక్షణ పరిష్కారం కోసం చికిత్స, మెడికేషన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖంపై వెంట్రుకలు పెరగకుండా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నియంత్రించడానికి యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ ఉంటాయి. దీంతోపాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ఆరోగ్య కరమైన సమతుల్య బరువును నిర్వహించడం, కెఫిన్, షుగరింగ్ ఫుడ్స్ తగ్గించడం, ఒత్తిడిలేని జీవన శైలిని అలవర్చుకోవడం చేయాలి.

ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తోంది. ఏప్రిల్ 9న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఈరోజు నుంచి సృష్టి మొదలైందని నమ్మకం అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు.
అనంతరం ఉతికిన శుభ్రమైన లేదా కొత్త బట్టలు ధరించి గడపకు పసుపు,కుంకుమ అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు రంగు రంగులతో పెద్దగా ముగ్గులు వేస్తారు. ఆరోజు ప్రతి పల్లె, ప్రతి వాడ పిల్లల సందడి, పంచాంగ శ్రవణంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండక్కి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలనేది కొందరికి తెలియదు.కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉగాది పండక్కి కాలమే దైవం, కనుక ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంట. శ్రీ మహా విష్ణువు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు పండితులు. అలాగే ఇష్టదేవతల స్తోత్రములు పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. షడ్రుచులైన పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారంతో చేసిన ఉగాది పచ్చడి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా విశిష్టమైన గుణం ఉంటుంది. ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జీవితం కష్టసుఖాల మయం అని చెప్పడం దీని సారాంశం.

British man: 15 వేల కిలోమీటర్లు..16 దేశాలు.. 347 రోజులపాటు నాన్ స్టాప్ రన్నింగ్.

మామూలుగా మారథాన్ అంటే 42 కిలోమీటర్ల పరుగు పందెం అని మనకు తెలుసు.. అంత దూరం పరుగెత్తలేని వారి కోసం హాఫ్ మారథాన్.. అంటే 21 కిలోమీటర్ల పరుగు పందెం కూడా ఉంటుంది. కానీ వేల కిలోమీటర్ల దూరాన్ని ఎవరైనా పరుగెత్తడం గురించి విన్నారా? అది అసలు సాధ్యమేనా అని నోరెళ్లబెడుతున్నారా? అయితే అది సాధ్యమేనని బ్రిటన్ కు చెందిన అల్ర్టా మారథాన్ పరుగుల వీరుడు రసెల్ కుక్ నిరూపిస్తున్నాడు. ఆ వివరాలు..

ఆశయం కోసం పరుగు..
రసెల్ కుక్ అరుదైన మైలురాయిని అధిగమించనున్నాడు. ఆఫ్రికా ఖండంలో అంతటా పరుగు తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రాజెక్టు ఆఫ్రికా పేరుతో అతను ఈ అనితర సాధ్యమైన పరుగును 2023 ఏప్రిల్ 22న దక్షిణాఫ్రికా దక్షిణ అంచున ప్రారంభించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 7న టునీసియాలోని బిజరెట్ వద్ద ఫినిష్ లైన్ దాటనున్నాడు. మొత్తంగా 16 ఆఫ్రికా దేశాల మీదుగా 9 వేల మైళ్ల (సుమారు 15 వేల కిలోమీటర్లు) పరుగును అతను పూర్తి చేయనున్నాడు. ఇంత కఠోరమైన పరుగు వెనక ఆపన్నులను ఆదుకోవాలన్న కోరిక కుక్ మదిలో బలంగా నాటుకుపోయింది. ద రన్నింగ్ చారిటీ పేరుతో అతను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పటివరకు కుక్ సుమారు రూ. 4.47 కోట్లను విరాళాల రూపంలో సేకరించాడు. ఈ పరుగు వెనక స్నేహితుడి స్ఫూర్తి ఉందని కుక్ చెబుతున్నాడు.

240 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకున్నా..
బీబీసీ కథనం ప్రకారం కుక్ వాస్తవానికి 360 మారథాన్లను 240 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నాడు. అయితే వీసా సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భౌగోళిక అంశాలు, ఓ దారిదోపిడీ ఉదంతం కారణంగా అతని ప్రయాణం ఆలస్యమైంది. తన పరుగు మార్గంలో కుక్ ఎడారులు, వర్షారణ్యాలు, పర్వతాల మీదుగా ముందుకు సాగిపోయాడు.

స్వాగతం పలకనున్న మ్యూజిక్ బ్యాండ్
వచ్చే 5 రోజుల్లో తన పరుగును పూర్తి చేయనున్నట్లు కుక్ తాజాగా ట్వీట్ చేశాడు. “మరో 5 రోజులు మిగిలి ఉంది. గత 347 రోజులు నా జీవితంలో అత్యంత కఠినమైనవి. అయినప్పటికీ ఈ ప్రయాణం నాకెంతో గౌరవమైనది” అని కుక్ పేర్కొన్నాడు. గతంలోనూ అతను ఆసియా ఖండాన్ని చుట్టివచ్చాడు. అలాగే ఓసారి బీర్ మారథాన్లోనూ పాల్గొన్నాడు. కుక్ ఫినిష్ లైన్ వద్దకు చేరుకోగానే అతనికి స్వాగతం పలికేందుకు ఓ మ్యూజిక్ బ్యాండ్ బృందం ఎదురుచూస్తోంది.

Viral Video: రోడ్డుపై దూసుకెళ్తున్న పూరి గుడిసె.. ఇతడి టెక్నాలజీ మామూలుగా లేదుగా..

కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి…

కొందరు చిత్రవిచిత్ర వాహనాలను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటే.. మరికొందరు పాత వాహనాలను వినూత్న రీతిలో కొత్తగా మార్చి అందరి ప్రశంసలను అందుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచిస్తూ వాహనాలను మరింత విచిత్రంగా మారుస్తుంటారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పూరి గుడిసెను వాహనంలా మార్చాడు. రోడ్డుపై పూరి గుడిసె దూసుకెళ్లడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ (Gujarat) సూరత్‌కు చెందిన క్రియేటివ్ సైన్స్ బృందం సభ్యులు వినూత్న ప్రయోగం చేశారు. ముందుగా పూరి గుడిసెను ఏర్పాటు చేసి, దానికి నాలుగు వైపులా ఉన్న కిటికీలకు అద్దాలు ఏర్పాటు చేశారు. తర్వాత దానికి నాలుగు చక్రాలు, మోటారును బిగించడంతో చివరకు పూరి గుడిసె వాహనం (hut vehicle) సిద్ధమైంది. ఫైనల్‌గా పూరి గుడిసె రోడ్డుపై దూసుకెళ్లడం చూసి వాహనదారులంతా అవాక్కయ్యారు.
గుడిసెలో ఉన్న వ్యక్తి.. కిటికీ నుంచి రోడ్డును గమనిస్తూ వాహనాన్ని నడుపుతున్నాడు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం గంటకు 15 నుంచి 20 వరకూ మైలేజీ ఇస్తున్నట్లు సదరు తయారీదారులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ వాహనం చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘వేసవికాలంలో ఇది బాగా పనికొస్తుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Mosquito Bite : వేసవిలో దోమకాటు నివారణకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలివే!

Mosquito Bite : ప్రపంచవ్యాప్తంగా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దోమలు ఎక్కువగా వృధి చెందుతాయి. ముఖ్యంగా వేసవి నెలలో దోమల బెడద అధికంగా కనిపిస్తుంటుంది. వేసవి కాలంలో దోమలు ఎక్కువగా కుడుతుంటాయి. దీనికి కారణం.. సమ్మర్ సీజన్‌లో ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు పెరగడమే. దోమల సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. దోమలు గుడ్లు పెట్టడానికి నీరు చాలా అవసరం. నీటి వనరులపై దోమలు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. దోమల సంతానోత్పత్తి చక్రం మరింత చురుకుగా ఉంటుంది.
దాంతో దోమల ఉధృతికి దారితీస్తుంది. వేసవిలో వెచ్చని వాతావరణంలో ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట ఉండటం వల్ల దోమల కాటుకు గురవుతారు. దోమలు కార్బన్ డయాక్సైడ్, వేడి, లాక్టిక్ ఆమ్లం, మానవులు విడుదల చేసే ఇతర రసాయనాలకు ఆకర్షితులవుతాయి. అదృష్టవశాత్తూ, కొన్ని ఇంటినివారణల ద్వారా దోమల కాటును నివారించవచ్చు. త్వరగా చికిత్స చేయవచ్చు. వేసవిలో దోమ కాటు చికిత్సకు 9 అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ దోమల బెడదను తగ్గించడానికి గ్రేట్ హోం రెమెడీ. ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కాటన్ బాల్‌ను ముంచి దోమ కాటుపై అప్లయ్ చేయండి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దురద, వాపులను తగ్గిస్తాయి.

2. తేనె :
తేనె అద్భుతమైన హోం రెమెడీ. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. మందపాటి ఆకృతి దురదను తగ్గించడంలో సాయపడుతుంది. కొద్ది మొత్తంలో తేనె తీసుకుని దోమ కుట్టిన ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. బేకింగ్ సోడా :
బేకింగ్ సోడా అనేది దురద, వాపును తగ్గించడంలో సాయపడుతుంది. బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసి దోమ కాటు మీద అప్లయ్ చేయండి. కడిగే ముందు 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి.

4. కలబంద :
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దోమ కాటును తగ్గించడంలో సాయపడతాయి. కలబంద ఆకులో కొంత భాగాన్ని పగలగొట్టి ఆకు నుంచి తీసిన జెల్‌ను దోమ కాటు మీద రాయండి.

5. నూనెలు :
లావెండర్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటి ముఖ్యమైన నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. క్యారియర్ ఆయిల్‌తో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి దోమ కాటు మీద అప్లయ్ చేయండి.

6. మంచు :
దోమ కాటుపై మంచును పూయడం వల్ల ఆ ప్రాంతాన్ని తిమ్మిరిగా మారుతుంది. తద్వారా మంటను తగ్గిస్తుంది. దురద నుంచి తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఐస్ క్యూబ్‌ను ఒక గుడ్డలో చుట్టి దోమ కాటు మీద సున్నితంగా అప్లయ్ చేయండి.

7. తులసి :
తులసి ఆకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దురద, వాపును తగ్గించడంలో సాయపడతాయి. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని చూర్ణం చేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఉపశమనం కోసం దోమ కాటుపై పేస్ట్‌ను అప్లయ్ చేయండి.

8. వెల్లుల్లి :
వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఒలిచిన వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి ఆ రసాన్ని దోమ కాటు వద్ద పూయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

9. టీ బ్యాగులు :
టీ బ్యాగ్‌లలో టానిన్లు ఉంటాయి. వాపు, దురదను తగ్గించడంలో సాయపడతాయి. వాడిన టీ బ్యాగ్ తీసుకొని దోమ కాటు మీద కొన్ని నిమిషాలు ఉంచండి.

YS Viveka murder case: మూసుకుపోయిన దారులు, అవినాష్‌కి మరో పది రోజులేనా?

YS Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యూ ట్విస్ట్. ఈ కేసులో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డికి కష్టాలు తప్పవా? దాదాపుగా ఆయన ఇరుకున్నట్టేనా? ఇన్నాళ్లు అరెస్టు నుంచి తప్పించు కున్న ఆయన.. ఇక జైలుకి వెళ్లడం ఖాయమేనా? అవుననే సంకేతాలు బలంగా వినివిపిస్తున్నాయి.

అంతే కాదు ఆయన బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరడం జరిగిపోయింది. వచ్చేవారంలో ఈ కేసు ఫైనల్ స్టేజ్‌కి రావచ్చని చెబుతున్నారు. అసలు తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది? ఎందుకు అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది?

A1గా చంద్రబాబు.. Acb Courtలో సీఐడీ చార్జిషీట్ దాఖలు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా చంద్రబాబు, ఏ2గా అచ్చెన్నాయుడు, ఏ3గా గంటా సుబ్బారావు, ఏ4గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు. ఈ చార్జిషీట్‌ను సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో సమర్పించారు. ఇప్పటికే చంద్రబాబును నిందితుడిగా చేర్చుతూ ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసులోనూ సీఐడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. అంతకుముందు ఇదే కేసులో దాదాపు 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

చిన్నాన్న చివరి కోరిక కోసం బయలుదేరుతున్నా.. వైఎస్ షర్మిల భావోద్వేగ వ్యాఖ్యలు

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రచారం ప్రారంభించి ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను అభ్యర్థులను కూడా ప్రకటించాయి. తాజాగా ఎన్నికల ప్రచార బరిలోకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దిగుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Vitamin-D Deficiency in Women : పట్టణ ప్రాంత మహిళల్లో ఆర్థోపెడిక్ సమస్యలకు విటమిన్ ‘డి’ లోపమే కారణం!

Vitamin-D Deficiency in Women : పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.

Vitamin-D Deficiency in Women : మహిళలూ జాగ్రత్త. విటమిన్-డి తక్కువగా ఉందంటే లైట్ తీసుకోవద్దు. ట్యాబ్లెట్స్ వాడితే డి విటమిన్ వస్తుందనే ధీమా అస్సలే వద్దు. కచ్చితంగా రోజుకు 20నిమిషాలు ఎండలో ఉండాల్సిందే. లేకపోతే కావాలని రోగాలు తెచ్చుకున్నట్లే. హౌస్ వైప్స్‌కు అయితే మరీ మరీ అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు.

ఇంతలా ఆరోగ్య నిపుణులు అలర్ట్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. పట్టణాలు, సిటీల్లో ఉండే 80శాతం మహిళలు, చిన్నారుల్లో విటమిన్-డి లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్‌ను అలర్ట్ చేస్తున్నారు డాక్టర్లు. కోరి మరీ రోగాలు తెచ్చుకునే బదులు..ఆరోగ్యం విషయంలో జాగ్రతలు అవసరమని సూచిస్తున్నారు.
80శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం :
లేటెస్ట్‌గా వచ్చిన రెండు, మూడు నిపుణుల అధ్యయనాల్లో 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపం ఉన్నట్టు తేలింది. ఇంటికే పరిమితం అయ్యే మహిళలకు 30 మిల్లీ గ్రాముల కంటే తక్కువ పరిమాణంలో విటమిన్-డి అందుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాలు, సిటీలలో జీవించే 80 శాతం మంది మహిళల్లో విటమిన్-డి లోపాన్ని గుర్తించారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో..దాదాపు 50కోట్ల మందికి విటమిన్-డి లోపం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో 30శాతం మంది అంటే 15 కోట్లమంది చిన్నారులు, యువతనే ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి.

విటమిన్ డి లోపంతో కనిపించే లక్షణాలివే :
ఎండ ద్వారా వచ్చే సూర్యరశ్మి మనపై 40 శాతం పడినా శరీరానికి కావాల్సినంత విటమిన్-డి జనరేట్ అవుతుంది అని అంటున్నారు నిపుణులు. 18ఏళ్లు నిండినవారికి రోజుకు 2000 ఐయూ విటమిన్-డి అవసరమని చెబుతున్నారు. కానీ చాలామంది నిర్లక్ష్యం చేసి విటమిన్-డి డెఫీషియన్సీతో బాధపడుతున్నారని అంటున్నారు. విటమిన్-డి లోపంతో అలసట, ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు మహిళలు. ఇమ్యూనిటీ పడిపోవడం, టెన్షన్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

మహిళలు, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ప్రతి రోజూ మస్ట్ గా ఉదయం సమయంలో కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఏజ్ పెరిగినా కొద్దీ ఎముకలు బలహీనపడటం, ఒళ్ళు నొప్పులు రావడం ఎక్కువ అవుతాయని అంటున్నారు. విటమిన్-డి లోపం ఉన్నవారు మెడిసిన్ వాడుతుంటారు. అయితే డాక్టర్ల సలహా లేకుండా విటమిన్-డి ట్యాబ్లెట్లు వాడొద్దంటున్నారు నిపుణులు. ఎంత ట్యాబ్లెట్లు వాడినా..అల్టర్నేట్‌గా ఏం చర్యలు తీసుకున్న.. సూర్యరశ్మి నుంచి డైరెక్ట్ గా వచ్చేదాని కంటే మెడిసిన్ ద్వారా వచ్చే విటమిన్ వల్ల ఉపయోగం పెద్దగా ఉండదని అంటున్నారు.

ఎండలో ఉండటం కుదరకపోతే..న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల..లాంగ్‌ టర్మ్‌తో విటమిన్-డి లోపాన్ని సరిచేసుకోవచ్చని అంటున్నారు. ఫ్యాటీ ఫిష్, ఫిష్ లివర్ ఆయిల్, గుడ్డు సొన, తరచుగా పుట్టగొడుగుల ఆహారాన్ని తీసుకుంటూ.. వీలైనప్పుడు శరీరంపై ఎండ పడేలా జాగ్రత్తలు తీసుకుంటే విటమిన్-డి లోపాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్లు.

Gold Price Record: బంగారం ధర రూ.80 వేలు దాటుతుందా? రికార్డ్‌ సృష్టిస్తున్న పుత్తడి!

భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇప్పుడు అది అద్భుతమైన రాబడిని కూడా ఇస్తోంది. బుధవారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, వెండి కూడా కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బంగారం ధర రూ.72వేలు దాటుతుందేమోనని అంచనా. అయితే రజతం దాని మునుపటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుంది. ఏప్రిల్‌ 4న సాయంత్రం

భారతదేశంలో బంగారం ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇప్పుడు అది అద్భుతమైన రాబడిని కూడా ఇస్తోంది. బుధవారం, బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, వెండి కూడా కొత్త రికార్డు స్థాయిని తాకింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బంగారం ధర రూ.72వేలు దాటుతుందేమోనని అంచనా. అయితే రజతం దాని మునుపటి రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుంది. ఏప్రిల్‌ 4న సాయంత్రం 3 గంటల సమయానికి తులం బంగారంపై రూ.600 ఎగబాకింది. ఈ సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.64,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.70,470 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. కిలో సిల్వర్‌పై ఏకంగా రూ.1000 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.82,000 వద్ద కొనసాగుతోంది.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ట్రేడింగ్‌లో సాయంత్రానికి బంగారం ధర 10 గ్రాములకు రూ.600 పెరిగింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కేవలం 3 నెలల్లోనే బంగారం ధర రూ.5,954 పెరిగింది. జనవరి 1న బంగారం ధర రూ.63,302గా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, బంగారం ధరలు ఒకే వారంలో రికార్డు స్థాయికి చేరుకోవడం ఇది రెండోసారి. గత రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర 10 గ్రాములు రూ.68,370 వద్ద ముగిసింది.

వెండి కూడా బంగారం అడుగుజాడలో..

ఇదిలా ఉండగా, వెండి ధరల్లో బంగారం మాదిరిగానే పెరుగుతున్న ట్రెండ్ కనిపించింది. బుధవారం ధర రూ. 1,700 జంప్‌తో కిలోకు రూ. 80,700 వద్ద ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, బుధవారం నాటికి విదేశీ మార్కెట్లలో బలపడుతున్న ధోరణి కారణంగా, దేశంలో కూడా బంగారం ధరలు బలాన్ని చూపించాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం స్పాట్ ధర అంటే COMEX ఔన్సుకు $ 2,275 ఉంది. ఇది మునుపటి ముగింపు ధర కంటే $ 20 ఎక్కువ. ఇది కాకుండా, వెండి కూడా ఔన్సుకు $ 26.25 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఔన్సు $25.55 వద్ద ముగిసింది. ఇక జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కి చెందిన ప్రణవ్ మెర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత భయం మధ్య, సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.

బంగారం 80 వేలు దాటుతుందా?

చైనాలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు గణనీయంగా మెరుగుపడ్డాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ కమోడిటీ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా చెప్పారు. దీంతో పారిశ్రామికంగా వెండికి డిమాండ్‌ పెరిగింది. వెండి ధర పెరగడానికి ఇదే కారణం. దీపావళి నాటికి వెండి ధర రూ.81,000 నుంచి 82,000 స్థాయికి చేరుకోవచ్చని ఆయన చెప్పారు. ఇక గురువారం కూడా బంగారం ధర నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఏప్రిల్ 4న తొలిసారిగా ఔన్స్‌కు 2,300 డాలర్లు దాటింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేయడమే ఇందుకు కారణం. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించనుందని నమ్ముతారు . మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల నుండి బంగారానికి బలమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రభావం బంగారం ధరలపై కనిపిస్తోంది. ఏప్రిల్ 4న తొలిసారిగా ఔన్స్ బంగారం ధర 2,304.96 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం, బంగారం కొత్త రోజువారీ అత్యధిక రికార్డులను సృష్టించింది.

బంగారం పెరగడానికి కారణాలు

భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల కూడా బంగారానికి మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు మధ్య నెలకొన్న పరిస్థితుల కారణం కూడా చెప్పవచ్చు. ఇక్కడ, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) డేటా ప్రకారం, ఫిబ్రవరిలో సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్లలో ఇది వరుసగా తొమ్మిదో నెల. చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ విషయంలో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత్‌, కజకిస్థాన్‌ వచ్చాయి.

ఈ ఏడాది బంగారం ధర 10 శాతం పెరిగింది

గత ఏడు రోజులుగా స్పాట్ గోల్డ్ ధర పెరుగుతూ వస్తోంది. మరోవైపు వెండి ఔన్స్‌కు 27.35 డాలర్లకు చేరిన తర్వాత స్థిరంగా ఉంది. జూన్ 2021 తర్వాత వెండి ధర ఇదే అత్యధికం. ఏప్రిల్ 5న అమెరికాలో వ్యవసాయేతర పేరోల్ డేటా రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచుతారు. ఈ ఏడాది బంగారం ధర 10 శాతానికి పైగా పెరుగగా, ఏప్రిల్‌లో ఇది 3 శాతానికి పైగా పెరిగింది.

Udyogini scheme: వడ్డీ లేకుండా రూ.3 లక్షల వరకూ రుణం.. పైగా 30 శాతం ప్రభుత్వ సబ్సిడీ..

ఒక మహిళ అభ్యున్నతి సాధిస్తే ఆమె కుటుంబమంతా బాగుపడుతుంది. తద్వారా సమాజం కూడా ముందుకు సాగుతుంది. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లినప్పుడే దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే మహిళల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా ఆర్థిక సాయం అందజేసి, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నాయి. మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా వారిని వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నాయి

ఉద్యోగిని పథకం..
మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ఉద్యోగిని అనే పథకం అమలులో ఉంది. పేరుకు ఉద్యోగిని పథకం అయినా ఇది వ్యాపారం చేసుకోవాలనుకునే పేద మహిళల కోసం ప్రవేశపెట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తోంది. దీని ద్వారా గ్యారంటీ లేకుండా రూ. మూడు లక్షలు రుణం ఇస్తారు. పైగా ఈ రుణం మొత్తం తీర్చనవసరం లేదు. దానిపై ప్రభుత్వం సబ్సిడీ కూడా మంజూరు చేస్తుంది. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.

వ్యాపారం ప్రారంభించేవారికి..
సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం కింద రుణాలు మంజూరు చేస్తారు. వీరిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, వ్యాపారంలో సహాయం చేయడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.
రూ.3 లక్షల వరకూ రుణం..
వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఉద్యోగిని పథకం ద్వారా ఆర్థికసాయం అందజేస్తారు. గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దీనికి అర్హులు. ముఖ్యమైన విషయం ఏమిటంటే రుణం తీసుకునేటప్పుడు ఎటువంటి హామీలు ఇవ్వనవసరం లేదు. తీసుకున్నరుణానికి వడ్డీ కూడా ఉండదు. కొన్ని షరతులతో వడ్డీ లేని రుణాలు ఇచ్చినప్పటికీ, అన్ని బ్యాంకులు అలా చేయవు.

అర్హులు వీరే..
ఉద్యోగిని పథకం ప్రయోజనాలను పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. రుణం తీసుకునే మహిళ కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అయితే వితంతువులు, వికలాంగ మహిళలకు ఆదాయ పరిమితి లేదు. వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రుణం తీసుకునే సమయంలో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

ప్రభుత్వం సబ్సిడీ..
సాధారణంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునప్పుడు వడ్డీతో కలిసి వాయిదాలు చెల్లించాలి. వాటిని కట్టడంలో ఆలస్యం అయితే పెనాల్టీ కూాడా విధిస్తారు. అయితే ఉద్యోగిని పథకంలో మంజూరైన రుణానికి వడ్డీ ఉండదు. రుణం తీసుకునేటప్పుడు ఎలాంటి హామీ పత్రాలు ఇవ్వనవసరం లేదు. ఆశ్యర్య పరిచే విషయం ఏమిటంటే రుణాన్ని కూడా పూర్తిగా చెల్లించనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుంది. ఇది దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది.

i Phone: దిమ్మతిరిగే ఫీచర్స్‎తో దుమ్ము రేపనున్న కొత్త ఆపిల్ అప్డేట్..

గత రెండేళ్లుగా ఐఫోన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. ఆపిల్ ఫోన్లలో డిజైన్ మార్పులు జరుగుతున్నా సాఫ్ట్వేర్‎లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే ఈ మధ్యనే సామ్సంగ్ s24 తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మొబైల్‎లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
గత రెండేళ్లుగా ఐఫోన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. ఆపిల్ ఫోన్లలో డిజైన్ మార్పులు జరుగుతున్నా సాఫ్ట్వేర్‎లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే ఈ మధ్యనే సామ్సంగ్ s24 తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మొబైల్‎లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లైవ్ ట్రాన్స్క్రిప్షన్, ఏఐ అసిస్టెంట్ ఇలా కొన్ని ఫీచర్స్‎ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇటు ఆపిల్ కూడా వచ్చే ఐ.ఓ.ఎస్18లో ఈ ఫీచర్స్‎ని తీసుకురానుంది.

అంతేకాదు మొదటిసారిగా పూర్తిస్థాయి ఆపిల్ ఇంటర్ఫేస్‎ని కూడా మార్చనుంది కంపెనీ. గతంలో ఐఫోన్ యూజర్స్‎కి ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ ఈ కొత్త అప్డేట్‎తో రానుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మెయిల్, నోట్స్ నుంచి ఆప్స్ ఐకాన్స్ వరకు అన్నీ మారనున్నాయట. ఆపిల్ మాప్స్ గూగుల్ మ్యాప్స్‎తో పోలిస్తే పెద్దగా ఆదరణ లేదు. దీన్ని అధిగమించడానికి ఆపిల్ కూడా మ్యాప్స్‎లో చాలా మార్పులు తీసుకొస్తుందట. పర్సనల్ రూట్స్, ఫ్లెక్సిబుల్ నావిగేషన్ లాంటి కొత్త ఆప్షన్స్‎తో ఆపిల్ మ్యాప్స్ రానుంది. స్ట్రీట్ వ్యూ ఫ్యూచర్ ని కూడా ఇంకా బ్రైట్‎గా డెవలప్ చేయబోతుంది ఆపిల్.

మొదటిసారిగా ఆపిల్ కొత్త హోమ్ స్క్రీన్‎ను ప్రవేశపెడుతుంది. ఇంతకుముందు అప్లికేషన్ ఐకాన్స్‎ని మార్చుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఐకాన్ మార్చుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ హోం స్క్రీన్‎ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆపిల్ ఐవోఎస్18 తో ఫోన్ రుపు రేఖలే మారన్నాయట.
ఇక రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనే కొత్త సదుపాయాన్ని కూడా ఐఏఎస్ 18తో తీసుకొస్తున్నట్లుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ RCS తో మెసేజ్లకు ఆటోమేటిక్‎గా రిప్లై ఇవ్వచ్చు. మెయిల్స్‎కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయంతో రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాండర్డ్ మెసేజ్లను అది చదివి వినిపిస్తుంది. మనం చదివే రిప్లై‎ని టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కంపోజ్ చేస్తుంది. అయితే ఈ సదుపాయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఐఓఎస్18 అన్ని మొబైల్స్‎లోనూ అప్డేట్ అవ్వదు. కేవలం 20 మోడల్స్‎లో మాత్రమే అప్డేట్ చేయనుంది ఆపిల్. ఇక మిగతా మోడల్స్‎లో ఐఓఎస్ 17 ఇక లాస్ట్ అప్డేట్. ఆ తర్వాత ఆ ఫోన్ లోకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండదు.

ఐఫోన్‎లో ఐఓఎస్18 అప్డేట్ మోడల్స్..
iPhone 11
iPhone 11 Pro
iPhone 11 Pro Max
iPhone 12 mini
iPhone 12
iPhone 12 Pro
iPhone 12 Pro Max
iPhone 13 mini
iPhone 13
iPhone 13 Pro
iPhone 13 Pro Max
iPhone SE (3rd Gen)
iPhone 14
iPhone 14 Plus
iPhone 14 Pro
iPhone 14 Pro Max
iPhone 15
iPhone 15 Plus
iPhone 15 Pro
iPhone 15 Pro Max

మీ ఇంట్లో ఏసీ ఉందా..? ఆన్ చేసే ముందు ఈ 3 పనులు చేయండి.. లేకపోతే..

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మండే వేడిని నివారించడానికి చాలా మంది.. ఏసీ, ఏయిర్ కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ACని ఉపయోగించబోతున్నట్లయితే, మీరు ముందుగా 3 ముఖ్యమైన పనులను చేయాలి.. అలా చేస్తే మీరు ఎక్కువ ఖర్చును నియంత్రించి.. డబ్బును ఆదా చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి
మీ ఇంట్లో ఏసీ ఉంటే.. పైన పేర్కొన్న ఈ 3 పనులను చేయకపోతే, మీ AC ప్రభావవంతమైన కూలింగ్ తగ్గుతుంది. శీతలీకరణ తగ్గితే, మీరు AC మెకానిక్‌ని పిలవాలి.. చివరకు AC రిపేర్ చేయడానికి భారీ ఖర్చులు చేయాల్సి రావచ్చు.
ఏయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే AC చల్లని గాలి తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు గత సీజన్ నుంచి AC సర్వీస్ చేయకపోతే, ఇప్పుడు AC రన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, ముందుగా ఫిల్టర్ను శుభ్రం చేయండి. బాగాలేకపోతే.. ఏయిర్ ఫిల్టర్ ను మార్చండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిల్టర్ ను క్లీన్ చేయండి. డర్టీ ఎయిర్ ఫిల్టర్ అలర్జీలు, శ్వాస సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ముందుగా దానిని శుభ్రం చేయండి.
గత వేసవి కాలం తర్వాత మీరు ఏసీని సర్వీస్ చేయకుంటే, ఈసారి ఏసీని రన్ చేసే ముందు ఏసీ సర్వీస్‌ను పొందండి. సర్వీసింగ్ సమయంలో, మీ ACలో పేరుకుపోయిన మురికి శుభ్రం చేస్తారు. తద్వారా AC చల్లని గాలి మరింత పెరగడంతోపాటు.. మంచి అనుభూతిని అందిస్తూనే ఉంటుంది.
సర్వీసింగ్ కోసం, ACని సరిగ్గా తనిఖీ చేయగల అనుభవజ్ఞుడైన AC మెకానిక్‌ని పిలవండి. AC మెకానిక్ గ్యాస్ లీక్‌ను కనుగొనలేకపోతే కూలింగ్ తగ్గుతుంది. మీరు ఇంతకు ముందు శీతలీకరణకు సంబంధించిన ఏ సమస్యను ఎదుర్కొని ఉండకపోతే, సర్వీసింగ్ సమయంలో గ్యాస్ లీకేజీపై AC మెకానిక్ శ్రద్ధ చూపరు. అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా AC మెకానిక్ ద్వారా గ్యాస్ లీకేజీని తనిఖీ చేయించండి..

Reverse Walking : టెన్షన్‌ పడకుండా రివర్స్‌లో నడవటం అలవాటు చేసుకోండి..! లాభాలు తెలిస్తే పరిగెడతారు..

అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.
నడక ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలిసిందే. మెరుగైన ఆరోగ్యం, మంచి శరీర ఆకృతి, బరువు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా 10,000 అడుగులు నడవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా దీనికి విరుద్ధంగా ప్రయత్నించారా..? అంటే నార్మల్‌ వాకింగ్‌కు బదులుగా రివర్స్‌లో నడవటం..! ఇలా వెనుకకు నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వెనుకకు నడవడం వల్ల ఒకటి, రెండూ కాదు.. అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రివర్స్ వాకింగ్ క్రమం తప్పకుండా చేయటం వలన మోకాళ్లు, కాళ్ల వెనుక కండరాల వశ్యత పెరుగుతుంది. అలాగే, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెన్నునొప్పితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రివర్స్ వాకింగ్‌ వల్ల దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుంది.

వెనుకకు నడవటం వల్ల శరీరంపై ఎక్కువ అవగాహన కల్పిస్తుంది. స్ట్రెయిట్ వాకింగ్‌తో పాటు, రివర్స్ వాకింగ్ మీ శరీరానికి, మనస్సుకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది మీ మనస్సు, శరీరానికి మధ్య మంచి సమతుల్యతను సృష్టిస్తుంది. కానీ వెనుకకు నడిచేటప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే, రద్దీగా ఉండే ప్రదేశం, జంతువులు, ఇతర వస్తువులు, వాహనాలు మీ వెనుక ఉండకుండా జాగ్రత్త వహించండి.
అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..శరీర అసమతుల్యత సమస్యలు, పడిపోతామనే విపరీతమైన భయం, తల తిరగడం లేదా వెర్టిగో వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సహాయం లేకుండా వెనుకకు నడవడానికి ప్రయత్నించకూడదు. ఇది మెరుగైన ఆరోగ్యానికి బదులుగా హాని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సలహా తప్పనిసరి అంటున్నారు.

Watch Video: చిరుతతో ఫైట్ చేసిన ఫారెస్ట్‌ సిబ్బంది..! హ్యాట్సాఫ్‌ చెబుతున్న నెటిజన్లు.. వైరలవుతున్న వీడియో..

అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరుతతో పోరాడిన ఫారెస్ట్ సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
జనావాసాల్లో అడవి జంతువులు, క్రూరమృగాల సంచారం ఎక్కువైంది. ఇటీవల తరచూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. గతంలో గుజరాత్‌కు చెందిన ఒక వీడియోలో అర్థరాత్రి సింహాల గుంపు గ్రామంలో సంచరిస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసింది. కాగా, ఇక్కడ అలాంటిదే ఒక వీడియో నెటిజన్లను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇక్కడ కనిపించిన వీడియోలో ఒక చిరుత పులి పట్టపగలేఊళ్లోకి వచ్చేసింది. పులిని గమనించిన ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్ దాన్ని ధైర్యంగా ఎదురించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం ఓ చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతపులి ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులపై దాడి చేసింది. చిరుత దాడిలో గాయపడిన వారందరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. ఊర్లోకి వచ్చిన చిరుత ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడి చేస్తుండగా..అధికారులు దాన్ని ఎలాగోలా అడ్డుకుని పట్టుకున్నారు.
అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు

https://twitter.com/asifiqbalbhat53/status/1775476915916374127?t=fGP2nR2EK5QQDVG2Y4jV7g&s=19

 

Theft Of Gold Toilet: 300 ఏళ్ల భవనం నుంచి రూ.50 కోట్ల బంగారు టాయిలెట్‌ చోరీ..!

ఎటువంటి ఖరీదైన వస్తువులైన సరే.. మనం ధనవంతుల ఇంట్లో చూస్తుంటాము. ధనవంతులు ఎక్కువగా బంగారం, వెండి, వజ్రాలతో కూడిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇక రాజుల కుటుంబాలు అయితే మాత్రం.. ప్యాలెస్ అంటూ పెద్ద పెద్ద భవంతులలో అత్యంత విలువైన, అలాగే ఖరీదైన వస్తువులను ఉంచుకోవడం వారి పరిపాటి. పురాతన కాలం సంబంధించిన వస్తువులను అప్పుడప్పుడు ప్రపంచ మార్కెట్లో కొన్ని వేలానికి తీసుకువస్తుంటారు. ఇకపోతే ఓ ప్యాలెస్ లో ఉన్న బంగారు టాయిలెట్ కు కూడా ఇలా అమ్మకానికి తీసుకోవచ్చారు. కాకపోతే అది గత నాలుగు సంవత్సరాలు క్రితం చివరికి గురైంది. అయితే ఇందుకు సంబంధించి ఆ టాయిలెట్ ను తానే తీసుకువెళ్లను అంటూ ఓ దొంగ నిజాన్ని ఒప్పుకున్నాడు. విచారణలో భాగంగా సదరు దొంగ చెప్పే నిజాలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. తాను ఇదివరకు కూడా చాలా విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసులు వద్ద సంచలన విషయాలు వెలుగులోకి తీసుకోవచ్చాడు.

ఈ సంఘటన ఇంగ్లాండ్ దేశంలో బయటికి వచ్చింది. అప్పట్లో ఇంగ్లాండ్ లో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఉండే బంగారు టాయిలెట్ ను ఓ దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన కలకలం లేపింది. దాదాపు 300 సంవత్సరాల క్రితం నాటి బ్లెన్‌ హీమ్ అని ప్యాలెస్ నుండి ఈ బంగారు టాయిలెట్ ని జేమ్స్ అనే దొంగ చోరీ చేశాడు. ఇక టాయిలెట్ విలువ భారతదేశ కరెన్సీలో సుమారు రూ. 50.36 కోట్లు.
ఇందుకు సంబంధించి 2019లో సెప్టెంబర్ నెలలో బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ నిర్వహించగా.. దానికి తాను వచ్చానని.. అయితే అక్కడ ఆ బంగారు టాయిలెట్ కనిపించడంతో దానిని దొంగలించినట్లు జేమ్స్ తెలిపారు. ఇక ఇప్పటి వరుకు గతంలో చేసిన దొంగతనాలకు ప్రస్తుతం 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు జేమ్స్. ఇతను ఎన్నో ఖరీదైన దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి ఏకంగా రూ. 4.3 కోట్ల విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను ఎత్తుకెళ్లినట్లు అధికారులు విషయాన్ని తెలిపారు.

Breaking: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

ఇటీవల రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసింది. అయితే వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వి. వినోద్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చెందోలు, అనంతపురం ఎస్సీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. అంతేకాదు వారంతా గురువారం రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
కాగా రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో నగదు, మద్యం, గంజాయి సరఫరా, ఎన్నికల ప్రచార సామాగ్రి తరలింపుపై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహించి సీజ్ చేస్తున్నారు. అటు శాంతి భద్రత విషయంలోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురు పత్రిపక్ష నాయకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసు అధికారులు అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పలు అధారాలను సమర్పించారు. ఈ మేరకు క్షుణ్ణంగా విచారించిన ఎన్నికల సంఘం.. పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది.

పది పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి

నేటి కాలంలో మంచి జీతంతో ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసినా సరైన ఉద్యోగాలు లభించక లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పోస్టుల సంఖ్య వందల్లో ఉంటే.. అభ్యర్థులు లక్షల్లో పోటీ పడుతుంటారు. పదో తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాలకు కూడా పీజీలు చేసిన వారు అప్లై చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగులు ఎగిరి గంతేసి వార్త ఒకటి తెచ్చాం. పదో తరగతి పాసైన వారికి సైతం ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఇంకెందుకు ఆలస్యం.. తర్వపడండి

ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, ఇతర పోస్టులతో సహా మొత్తం 247 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ నియామకాలన్నీ పూణే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినవి.

ఇక ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది. ఈ క్రమంలో సదరు సంస్థ ఆన్‌లైన్ దరఖాస్తు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ విడుదల చేసింది. దీని కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aiasl.in ని సందర్శించాలి. ఏ పోస్ట్ కు ఎంత వయసు ఉండాలి.. జీతం ఎంత.. క్వాలిఫికేషన్ వంటి వివరాలు..

పోస్ట్ ల వివరాలు..
డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (ప్యాసింజర్) : 15-18 సంవత్సరాల అనుభవంతో పాటు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ చేసి ఉండాలి. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. జీతం రూ. 60 వేలు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

డిప్యూటీ ఆఫీసర్ (ప్యాసింజర్): గ్రాడ్యుయేషన్‌తో పాటు 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. జీతం రూ. 32,200. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

జూనియర్ ఆఫీసర్( ప్యాసింజర్): గ్రాడ్యుయేషన్‌తో పాటు 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 సంవత్సరాల వయస్సు మించకూడదు. జీతం రూ. 29,760. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

జూనియర్ ఆఫీసర్ (టెక్నికల్): హెవీ మోటార్ వెహికల్ యొక్క చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పాటు మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితిని 28 సంవత్సరాలు. జీతం 29,760 రూపాయలు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు : గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.27,450. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టు : ఈ పోస్టుకి అప్లయ్ చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. జీతం రూ.27450. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 17-18,2024.

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: మీరు 10వ తరగతి పాసైన వారు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. జీతం రూ. 24,960. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 17-18,2024.

హ్యాండిమ్యాన్, హ్యాండీ ఉమెన్ : ఈ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు. జీతం రూ.22,530గా నిర్ణయించారు. ఇంటర్వూ తేదీ ఏప్రిల్ 19-20,2024.

Telangana: ఉచిత బస్సు ప్రయాణం తొలగించనున్న ప్రభుత్వం?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో మొదటి హామీని నెరవేర్చేసింది. అదే మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం.
దాంతో తెలంగాణ మహిళలంతా ఎంతో హర్షం వ్యక్తం చేసారు. హాయిగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ ట్రిప్స్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు బాలేవు. ఈ ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆల్రెడీ ఆర్టీసీ ఆదాయం దారుణంగా పడిపోయింది. దీనికి తోడు పాపం విద్యార్థులు, మగవారికి ఆర్టీసీలో ప్రయాణం చాలా కష్టంగా మారిపోయింది.

ఒకప్పుడు ఏదన్నా పని ఉంటే మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారు. అప్పుడు ఆటోలు కూడా ఎక్కువగా ఎక్కేవారు. కానీ ఎప్పుడైతే ఉచితం అన్నారో.. అసలు బస్సు ముఖం చూడని వారు కూడా ప్రయాణించేస్తున్నారు. బస్సుల్లో సీట్లు దొరక్క దిగిపోవడం.. సీట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయి.

సరదా సరదాగా..

ఓసారి ఆర్టీసీ బస్ కండక్టర్‌కి వింత అనుభవం ఎదురైంది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు ఎక్కిన ఓ మహిళ మహబూబ్‌నగర్‌లో దిగిందట. ఆ బస్సు చివరి స్టాప్ కూడా మహబూబ్‌నగరే. అయితే మళ్లీ బస్సు తిరిగి జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్తోందని తెలిసి ఆ మహిళ కూడా ఎక్కింది. దాంతో కండక్టర్ ఆమె వద్దకు వెళ్లి దారి మర్చిపోయావా అమ్మా అని అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని షాకయ్యాడు. తాను దారి మర్చిపోలేదని.. ఉచిత బస్సులు కావడంతో అటూ ఇటూ సరదాగా తిరుగుతున్నానని చెప్పింది.

చీపురు కొనడానికి..

మరో ఘటనలో ఓ మహిళ తన గ్రామంలోని బస్సు ఎక్కి పట్టణానికి వెళ్లి చీపుర్లు కొనుగోలు చేసుకుని వచ్చింది. ఇలా అసలు అవసరం లేకపోయినా కూడా బస్సులు ఎక్కేసి ఉచిత ప్రయాణాన్ని వాడేసుకుంటున్నారు. రోజూ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లే వారికి మాత్రం ఈ ఉచిత ప్రయాణం చాలా కష్టంగా మారుతోంది. వారికి సమయానికి బస్సులు దొరక్క ఆటోలు, క్యాబ్‌లు పట్టుకుని పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఉచిత ప్రయాణం వల్ల చాలా మందికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని.. ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోలెడు ఫిర్యాదులు అందాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు పథకంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. పూర్తిగా ఉచితంగా కాకుండా సగం ధరకు టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ విధానాన్నే అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.

ఎలక్షన్ కోసం డిజిటల్ Voter ID డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? వివరాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. పౌరులుగా మనం ఓటు వేయడానికి మీ ఓటరు ID కార్డును ఇప్పుడే సిద్ధంగా ఉంచుకోండి.
ఇటీవల, ఓటర్ల సౌకర్యం కోసం, భారత ఎన్నికల సంఘం e-EPIC లేదా ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనే డిజిటల్ ఓటర్ ID కార్డ్‌ను ప్రవేశపెట్టింది.

డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డు అంటే ఏమిటి?

ఇది PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న ఓటర్ ID కార్డ్ డాక్యుమెంట్, దీనిని మొబైల్ ఫోన్‌లలో సులభంగా సేవ్ చేయవచ్చు. ఓటరు ID కార్డ్ యొక్క ఈ డిజిటల్ ఫార్మాట్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఓటర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. డిజిలాకర్ యాప్‌కి కూడా అప్‌లోడ్ చేయవచ్చు. అన్నింటికన్నా ఉత్తమమైనది, ఇది డిమాండ్‌పై ముద్రించబడుతుంది మరియు లామినేట్ చేయబడుతుంది మరియు చేతిలో కూడా ఉంచబడుతుంది.

డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఎవరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?

చెల్లుబాటు అయ్యే EPIC నంబర్‌లను కలిగి ఉన్న అర్హులైన ఓటర్లందరూ డిజిటల్ ఓటర్ ID కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా లభించే ఓటరు గుర్తింపు కార్డు యొక్క PDF వెర్షన్ మొబైల్ ఫోన్‌లలో నిల్వ చేయబడుతుంది మరియు ప్రత్యేకమైన QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు.

డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. అందుకోసం మీకు మొదటగా నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (NVSP)లో రిజిస్టర్ చేసుకోవాలి.

NVSP వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న తర్వాత, అవసరమైన వివరాలను అందించి, కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారమ్‌గా పనిచేసే ఫారం 6ని పూరించిన తర్వాత.. అభ్యర్థులు NVSP వెబ్‌సైట్‌లో వారి దరఖాస్తు స్థితిని ట్రాక్ చేయాలి.

మీ డిజిటల్ ఓటరు ID కార్డ్ సిద్ధమైన తర్వాత మీరు దానిని NVSP వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ను పొందుతారు. దీన్ని డౌన్‌లోడ్ చేసే ముందు, మీరు లాగిన్ చేయడం, సంబంధిత వివరాలను నమోదు చేయడం మరియు OTP ద్వారా ధృవీకరించడం వంటి ప్రక్రియ ఉంటుంది.

మీ డిజిటల్ ఓటర్ ఐడిని డౌన్‌లోడ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ గైడ్:

* అధికారిక వెబ్‌సైట్ eci.gov.in/e-epic ని సందర్శించండి

* e-EPIC డౌన్‌లోడ్ ఆప్షన్ ను ఎంచుకోండి

* పేజీ ఎగువన ఉన్న డౌన్‌లోడ్ బటన్‌ను గుర్తించండి

* మీ లాగిన్ వివరాలను మరియు 10-అంకెల EPICని నమోదు చేయడం ద్వారా ఖాతాను సృష్టించండి.

* అందించిన సమాచారాన్ని ధృవీకరించండి

* ధృవీకరణ కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో OTPని స్వీకరించండి

* మీ డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డుతో పాటు OTPని ధృవీకరించండి

* మీ డిజిటల్ ID కార్డ్ యొక్క PDF వెర్షన్‌ను సేవ్ చేయండి

ఓటరు గుర్తింపు కార్డు చిరిగినా, పోగొట్టుకున్నా?

మీ ఓటరు ID కార్డ్ సరైన స్థితిలో లేకుంటే, చిరిగిపోయిన లేదా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడినట్లయితే, దాని డూప్లికేట్ ఓటర్ ID కార్డ్‌ని ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా డూప్లికేట్ ఓటర్ ID కార్డ్‌ని ఎలా పొందాలి?

* రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించండి మరియు నకిలీ ఓటర్ ID కార్డ్ కోసం అవసరమైన ఫారమ్‌ను పూర్తి చేయండి.

* ఆపై మీ పేరు, చిరునామా మరియు పాత ఓటరు ID కార్డ్ నంబర్‌తో సహా వివరాలను అందించే నిర్దిష్ట ఫారమ్‌ను పూర్తిచేయండి.

* నింపిన ఫారమ్‌తో పాటు అభ్యర్థించిన పత్రాల కాపీలను సమర్పించండి.

* మీరు అందించిన పత్రాలు ధృవీకరించబడిన తర్వాత, రిటర్నింగ్ అధికారి మీకు డూప్లికేట్ ఓటర్ ID కార్డును జారీ చేస్తారు. ఈ ఆఫ్‌లైన్ ప్రక్రియ ద్వారా మీరు మీ డూప్లికేట్ ఓటరు ID కార్డును కొద్ది రోజుల్లోనే పొందవచ్చు.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్ కొత్త పీఎఫ్ రూల్.. ఏప్రిల్ 1 నుండి అమలు!

సాధారణంగా ప్రతి ఒకరు తాను చేసే ఉద్యోగానికి వచ్చే జీతంలో కొంత బాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం దాచి పెట్టుకుంటారు . అలాంటి వారి ప్రతి ఒకరికి పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
దీంట్లో మీ వేతనం నుంచి ప్రతి నెలాఎంతో కొంత మొత్తం దీంట్లో జమవుతుంది.అంతేకాకుండా సంస్థ కూడా యాడ్ చేస్తుంటుంది.అయితే పీఎఫ్ చందాదారులకు ఇప్పుడు ప్రభుత్వం ఒక శుభవార్త అందింది. ఉద్యోగం మారిన సమయంలో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా కొత్త నిబంధన తీసుకొస్తోంది ఈ రోజుల్లో చాలా మంది తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. అలాంటి వారు ముఖ్యంగా వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్‌కు సంబంధించి ఇబ్బందులు పడుతుంటారు. దీనిని కొత్త సంస్థకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు .

అందులో ఉన్న డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి , వడ్డీ సంగతేంటి ఇలా ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారి కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటెడ్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

కొత్త రూల్ అందుబాటులోకి వస్తే కనుక ఇక ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు మాన్యువల్‌గా అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత సంస్థలో జమ అయి ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ ఆటో కొత్త సంస్థ పీఎఫ్ అకౌంట్లోకి బదిలీ అవుతుందన్నమాట. దీంతో పీఎఫ్ చందాదారులకు తమ అకౌంట్‌కు సంబంధించి ఉన్న సందేహాలను ఇది తొలగిస్తుందని చెప్పొచ్చు. ఈ రూల్ అమల్లోకి వస్తే చాలా వరకు పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల ఇబ్బందులు తగ్గుతాయి.

ఇది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నా దీనిపై పూర్తి మార్గదర్శకాలు బయటికి రాలేదు. అధికారికంగా ఈపీఎఫ్ఓ దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుందా.. అకౌంట్ విలీనం అవుతుందా అనే విషయాలు ఇంకా తెలియంసింది ఉంది .
ఇంకా వడ్డీ ఎలా యాడ్ అవుతుంది.. ఇలాంటి అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త కొత్త అవకాశాలు, మంచి జీతాలు ఆశిస్తూ చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. ఉద్యోగం మారిన చోట కచ్చితంగా కొత్త పీఎఫ్ అకౌంట్ తెరుస్తుంటారు.

వాటిని విలీనం మాత్రం చేయరు. ఎలానో తెలియక కొందరు.. ఏమైనా ఇబ్బందులుంటాయోనని ఇంకొందరు.. దీని గురించి పెద్దగా పట్టించుకోరు.

అయితే ఇందులో ప్రతిసారీ ఒకటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉంటుంది. దీనిపైనే కొత్త కొత్త పీఎఫ్ అకౌంట్లు తెరుస్తుంటారు. ఇలా సర్వీసు కాలం ఎక్కువగా ఉన్నట్లు కనిపించదు. సాధారణంగా పీఎఫ్ అకౌంట్ ఐదేళ్లు దాటితే అందులో విత్‌డ్రాలపై టాక్స్ ఉండదు.

అదే విలీనం చేయకుండా రెండు, మూడేళ్లకు సంస్థ మారితే.. ఈ ప్రయోజనం కోల్పోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్‌ను అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రిటైర్మెంట్ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాత కూడా ఇతర మెడికల్ ఎమర్జెన్సీ, వివాహం, ఇల్లు రెనోవేషన్ ఇలా పలు అవసరాలకు డబ్బులు తీసుకోవచ్చు. పీఎఫ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.ఇలాంటి విషయాలు తేలియక చాల మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు . ఒకవేళ ఈ కొత్త పి ఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ విషయము అమలులోకి వస్తే చిటికి మాటికీ జాబ్స్ మారె వారికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు

IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మందికి దక్కని జాబ్ ఆఫర్లు

IIT Bombay | అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదని వెల్లడైంది.
2000 మంది నమోదిత విద్యార్ధుల్లో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాలేదు.

అంతర్జాతీయ ఆర్ధిక మందగమనంతో గత ఏడాది తరహాలో క్యాంపస్‌కు కంపెనీలను ఆహ్వానించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ విభాగాధికారి తెలిపారని ఓ వార్తాకథనం తెలిపింది. విద్యాసంస్ధ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజ్‌లను అంగీకరించేందుకు చాలా కంపెనీలు తటపటాయిస్తున్నాయని సమాచారం. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు.

ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ పురోగతిలో ఉండగా ఈ ఏడాది మే వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఏడాది 35.8 శాతం విద్యార్ధులకు ఇప్పటివరకూ జాబ్ ఆఫర్స్ లభించలేదు. ఇది గత సెషన్ కంటే 2.8 శాతం అధికం కావడం గమనార్హం. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, గ్లోబల్ కంపెనీల సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు.

Saree Cancer: భయపెడుతున్న చీర క్యాన్సర్.. జాగ్రత్త

Saree Cancer: ప్రస్తుతం ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో? ఎలాంటి వ్యాధులు శరీరాన్ని ఎటాక్ చేస్తాయో తెలుసుకోవడం కష్టమే. క్యాన్సర్స్, టీబీ, హెచ్ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి.
ఇలాంటి భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ లలో ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. లంగ్స్, స్కిన్, త్రోట్, బ్రెస్ట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వ్యాధి వస్తే కోలుకోవడం కష్టమే. అయితే రీసెంట్ గా చీర క్యాన్సర్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఇంతకీ ఈ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..

భారతదేశంలోని స్త్రీలు ఎక్కువగా ధరించే వాటిలో ముఖ్యమైనది చీర. ఈ చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. బీహార్, జార్ఖండ్ లలో చీర క్యాన్సర్ మొదలైందని తెలుస్తోంది. దీన్ని వైద్య భాషలో స్క్వామల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. ముంబైలోని ఆర్ఎణ్ కూపర్ ఆస్పత్రిలో ఈ చీర క్యాన్సర్ పై పరిశోధనలు చేశారు. 68 సంవత్సరాల మహిళకు ఈ క్యాన్సర్ ఉన్నట్టు బాంబే హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
ఆ మహిళ 13 సంవత్సరాల నుంచి చీర కట్టుకుంటుందట. చాలా మంది స్త్రీలు చీరలు కట్టుకుంటారు. చీర కట్టుకోవడానికి పెట్టీకోట్ ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటారు. మహిళలు ఎక్కువ సేపు ఒకే వస్త్రాన్ని ధరించినప్పుడు నడుముపై రుద్దినట్టు అవుతుంటుంది. అక్కడ చర్మం దెబ్బతిని క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. సంప్రదాయంగా కట్టుకునే చీరల వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అని తెలిసి మహిళలు భయపడుతున్నారు. కానీ కాస్త జాగ్రత్త పడితే ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు.

AP Telangana Weather: భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్న తెలుగు ప్రజలు, నేడు 130 మండలాల్లో వడగాల్పులు: IMD అలర్ట్

Heat Waves In AP And Telangana: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో 43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వడగాలులకు వయసు మీద పడిన వారు తట్టుకోలేకపోతున్నారు. ఏపీలో గురువారం (ఏప్రిల్ 4న) 130 మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

బుధవారం నాడు (ఏప్రిల్ 3న) వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారుు వెల్లడించారు. కడప జిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయని.. ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
తెలంగాణలోనూ సుర్రుముంటున్న సూరీడు..
తెలంగాణలోనూ భానుడి ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో 40కి పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలో పలు చోట్ల 42, 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతేనే ఎండ అధికంగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. క్యాప్ ధరించి ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని, నీళ్లు అధికంగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చందానగర్, ఖైరతాబాద్, మూసాపేట ప్రాంతాల్లో 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు వడగాల్పుల ప్రభావంతో నగరవాసులు ఎండలకు అల్లాడిపోతున్నారు.

గురువారం 130 మండలాల్లో వడగాల్పులు
ఏప్రిల్ 4న పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఏప్రిల్ 5వ తేదీన 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

ఏప్రిల్ 4న వడగాల్పులు వీచే మండలాలు 130 మండలాలు ఇవే
శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాలు, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురంమన్యం జిల్లాలో 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 13, కాకినాడ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 3 మండలాలు, కృష్ణా జిల్లాలో ఒక్క మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 14 మండలాలు, గుంటూరు జిల్లాలో 5, పల్నాడు జిల్లాలో 6, నంద్యాల జిల్లాలో 19 మండలాలు, వైఎస్సార్ జిల్లాలో 20 మండలాల్లో, అనంతపురం జిల్లాలో ఒక్క మండంలో గురువారం నాడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఈ ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవిలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి తాగాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

నిర్లక్ష్యపు డాక్టర్లకు ఐదేళ్ల జైలు శిక్ష.. కొత్త చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమైతే సదరు డాక్టర్‌కు ఇక నుంచి ఐదేళ్లు జైలు శిక్షను విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలాన్ని పెంచుతూ కొత్త చట్టాలను రూపొందించారు.
ఈ మేరకు వైద్యులకు అవగాహన కల్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్​హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గోయల్ అన్ని రాష్ట్రాల సీఎస్, హెల్త్ సెక్రటరీలకు లేఖ రాశారు. ప్రస్తుతం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్య సిబ్బందికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉన్నది.

కానీ దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం కచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతేగాక గరిష్ఠంగా ఐదేండ్ల శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది. డాక్టర్‌ అయితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని, ఆర్‌ఎంపీ అయితే (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌) రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలో ‘ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 1860’ అమల్లో ఉండగా, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సక్ష్య అభియాన్‌ పేరుతో మూడు కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.

Ugadi festival: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉంటుంది?

Ugadi festival: 2024 సంవత్సరంలో ఏప్రిల్‌ 9వ తేదీన చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి మంగళవారం ఉగాది పండుగ జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం కలియుగం ప్రారంభమై 5,125వ సంవత్సరం.

శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపము, ఆవేశముతో వ్యవహరించెదరని చిలకమర్తి తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయములు, క్రోధములు కలగడం, దేశాల మధ్య కోపావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచనలు అధికముగా ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.

ఉగాది అంటే ఏంటి?

“ఉగ” అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్ధాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. ఇంకొక విధంగా చెప్పాలంటే ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడ అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది ఉగాది అయిందని చిలకమర్తి తెలిపారు. అదే సంవత్సరాది ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల రుతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృ స్వరూపం.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అంటే ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయని చిలకమర్తి తెలియచేశారు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని చిలకమర్తి తెలిపారు.

శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రణి స్మృత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వృత్తాంతం.

శిశిరరుతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూ కుహూ అని పాడతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఇది తెలుగు వారి మొదటి పండుగ. ఉగాది రోజున పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతఃకాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు అలంకరిస్తారు. తలంటు స్నానంచేసి, కొత్తబట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. “ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది.

ఉగాది పచ్చడి విశిష్టత

షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు. ఈ రోజున వేపపువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్రదర్శనము, ఆర్య పూజనము, గోపూజ, ఏరువాక అనే ఆచారాలు పాటిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

BRS ఢమాల్.. ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో సంచలన విషయాలు..

తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కానున్నట్లు ఇండియా టీవీ ప్రీ-పోల్ సర్వేలో వెల్లడైంది.
గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఒక్క చోట కూడా గెలవదంటూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిదికి చేరుకుంటుందని తేలింది. బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి మరో స్థానంలో గెల్చుకుని ఐదుకు పరిమితమవుతుందని, మజ్లిస్ యథావిధిగా ఒక్క స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించిన ప్రీ-పోల్ ఫలితాల్లో పేర్కొన్నది. గత నెల 1-30 తేదీల మధ్యలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు తేలినట్లు పేర్కొన్నది.

అసెంబ్లీ ఫలితాలే రిపీట్

కనీసంగా పన్నెండు స్థానాల్లో గెలుస్తామని, కానీ 14 చోట్ల గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా 14 సీట్లలో గెలుపు ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం గతం కంటే సీట్లు రెట్టింపు దాటి డబుల్ డిజిట్ సాధిస్తామని, మోడీ ఇమేజ్ ఈసారి తెలంగాణలో ఊహకు అందని తీరులో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నది. బీఆర్ఎస్ నిర్దిష్టంగా గెలిచే సీట్ల సంఖ్యను చెప్పకపోయినా గతంలో గెలిచినవాటికి కొంచెం అటూ ఇటుగా ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో భాగంగా తెలంగాణలోని ఫలితాలను కూడా వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్… లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫ్రంట్ రన్నర్‌గానే నిలవనున్నది.

స్వల్పంగా మెరుగుపడనున్న బీజేపీ

కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోయినా ఆ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కుతాయని ప్రజల అభిప్రాయం ప్రీ-పోల్ సర్వే రూపంలో వెల్లడైంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, ఆ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేసిన తర్వాత, ప్రచారం హోరెత్తిన అనంతరం పార్టీల బలాబలాల్లో, ప్రజల అభిప్రాయంలో ఎలాంటి తేడాలు చోటుచేసుకుంటాయనేది రానున్న రోజుల్లో వెల్లడికానున్నది. ఐదేండ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్వల్పంగా మెరుగుపడినట్లు ఈ స్టడీలో తేలింది. కానీ కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా అతి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ఆవిర్భవించనున్నది. బీఆర్ఎస్ మాత్రం పదేండ్లు అధికారంలో ఉన్నా ఈసారి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అనేది తేలింది.

భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు

తెలంగాణ హక్కులను పార్లమెంటులో ప్రస్తావించేది, కేంద్రం మెడలు వంచి సాధించేది తమ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ గొంతు చించుకుంటున్నా గతంకంటే ఒక్కటి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశమున్నట్లు స్పష్టమైంది.

Health

సినిమా