Jayasudha: హనీమూన్ లో అలా జరిగింది.. అందుకే మతం మార్చుకున్నా.!

Jayasudha: సహజనటి జయసుధ తన అందం,నటనతో ఇండస్ట్రీలో న్యాచురల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఈ హీరోయిన్ ఏ పాత్రలోనైనా సరే చాలా సహజంగా ఒదిగిపోతుంది.


అందుకే అందరూ ఈమెను సహజ నటి అని అంటారు.అంతేకాదు సహజనటి అనే బిరుదు కూడా జయసుధకు వచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొదట హిందదువు అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం అదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. జయసుధ మొదట్లో బిజినెస్ మాన్ అయినా రాజేంద్రప్రసాద్ ని పెళ్లి చేసుకొని మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు అయిన నితిన్ కపూర్ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే నితిన్ కపూర్ తో పెళ్లయ్యాక థాయిలాండ్ కి ఈ జంట హనుమాన్ కి వెళ్లారట ఇక ఆ సమయంలో అక్కడ నీళ్లలో బోటింగ్ చేద్దామని నితిన్ జయసుధ తో చెప్పారట. (Jayasudha)

కానీ నీళ్లంటే భయం ఉన్న జయసుధ నేను చేయను అని చెప్పిందట.అయితే రెండు రోజులు అయ్యాక మూడో రోజు తన భర్త కోరికను కాదనలేక సముద్రం లో జెట్ స్కీం కి వెళ్ళిందట.ఇక అలా వెళ్ళినా కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయి ఆమె నీళ్లలో మునిగి పోయిందట. అయితే ఈతరాని జయసుధ నా జీవితం ఇంతటితో అయిపోయింది చనిపోతున్నాను అని భావించి హిందువు అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవున్ని తలుచుకుందట.

అయితే అలా తలచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట. ఆ తర్వాత శ్వాస బిగబట్టుకొని నీళ్ల నుండి జయసుధ బయటపడిందట.అలా ఆ సంఘటన జయసుధ ను హిందువు నుండి క్రిస్టియన్ మతంలోకి మారేలా చేసిందట.(Jayasudha)