పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. తెలంగాణ ప్రభుత్వం వారి స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత ఉద్యోగ శిక్షణతోపాటు హాస్టల్, భోజన, వసతి సౌకర్యం కల్పిస్తుంది.
శిక్షణ అనంతరం ఉద్యోగం కూడా కల్పిస్తారు. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను అందిస్తుంది. ఆసక్తి కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు మే 29, 2025వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఏయే కోర్సులు అందిస్తారంటే..
- అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ) కోర్సు
- కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సు
- ఆటో మొబైల్ 2 వీలర్ సర్వీసింగ్ కోర్సు
- డి.టి.పి కోర్సు
డి.టి.పి, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కోర్సులకు ఇంటర్మీడియట్, అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ) కోర్సుకు బీకామ్ డిగ్రీ, ఆటో మొబైల్ 2 వీలర్ సర్వీసింగ్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అభ్యర్ధుల యోపరిమితి 18 నుంచి 30 ఏళ్లు మధ్య ఉండాలి. కోర్సు వ్యవధి మూడున్నర నెలలు ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు ఈ కింది అడ్రస్కు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్లు మే 29, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. సంబంధిత చిరునామాకు చేరుకోవడానికి సమీప రైల్వే స్టేషన్లు.. బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్. హైదరాబాద్ – దిల్సుఖ్ నగర్ నుంచి 524 నంబరు బస్సు సౌకర్యం కూడా కలదు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు సూచించారు.
చిరునామా..
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ-508 284.
వివరాలకు సంప్రదించండి: 9133908000, 9133908111, 9133908222, 9948466111
































