Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..

Hyderabad: అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..


ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్తున్న యువతీ, యువకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. పలువురు విద్యార్థులు ప్రమాదాల్లో మరణించడం, మరికొందరిపై దాడులు జరగడం.. ఇంకొందరు అదృశ్యమవడం.. ఆందోళన కలిగిస్తోంది.

వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబాలు.. మనోవేదనకు గురవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగు విద్యార్థుల మరణాలు, అదృశ్య ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా.. తెలంగాణ హైదరాబాద్ కు చెందిన యువతి.. అదృశ్యమైంది.. హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల అమెరికాలో అదృశ్యమైంది.. నితీషా కందుల కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది.. ఆమె మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

నితీషా కందుల కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి కనిపించకుండా పోయిందని.. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ట్వీట్టర్ వేదికగా షేర్ చేశారు.