Jagan: సజ్జల విజయసాయికి జగన్ బిగ్ షాక్

Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ సాయిరెడ్డిలకు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం తన సతీమణి భారతి రెడ్డితో కలిసి బెంగళూరులోని యళహంకలో ఉన్న తన నివాసంలో ఉన్న జగన్..


నిన్న పార్టీ పెద్దలు అయిన వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్‌గా NDA కూటమి ఎవర్ని ఎంపిక చేస్తే వారికే పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వాలని సూచించారు.

అయితే జగన్ ఏ సమావేశం నిర్వహించినా వెన్నంటే ఉండే సజ్జల, విజయ సాయిరెడ్డిలు నిన్న జరిగిన సమావేశానికి మాత్రం హాజరు కాలేదు. ఇందుకు కారణం జగన్ వారిని అసలు ఆహ్వానించకపోవడమే అని తెలుస్తోంది.