కియా ఇండియా సరికొత్త హంగులతో కూడిన ఈవీ6 ఆధునిక వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.65.9 లక్షలు. 27 అత్యాధునిక భద్రత, 5 కొత్త అటానమస్ ఫీచర్లతో మరింత ఆధునీకరించిన అడాస్ 2.0 ప్యాకేజ్తో ఈ కారు అందుబాటులోకి వచ్చింది. పూర్తి చార్జింగ్తో 663 కి.మీ వరకు ప్రయాణించగలిగేందుకు 84 కిలోవాట్ బ్యాటరీని కంపెనీ ఆఫర్ ఆఫర్ చేస్తోంది. కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ను మరింత ఆకర్షణీయంగా మలచడంతోపాటు ఆధునిక, స్మార్ట్ ఫీచర్లను జోడించినట్లు కంపెనీ వెల్లడించింది.
Also Read
Education
More