NATS: నాట్స్‌ అధ్యక్షుడిగా మదన్‌ పాములపాటి

నాట్స్‌ (నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ) అధ్యక్షుడిగా మదన్‌ పాములపాటి ఎంపికయ్యారు. 2024-26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్‌ బోర్డు పేర్కొంది.
నాట్స్‌ షికాగో విభాగంలో చురుగ్గా వ్యవహరించే మదన్‌ పాములపాటి.. గతంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. రెండుసార్లు నాట్స్‌ కోశాధికారి, సంబరాల కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడి(సేవలు)గా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో నాట్స్‌ అధ్యక్ష పదవికి బోర్డు ఆయనవైపు మొగ్గు చూపింది.
నాట్స్‌ ఈవీపీగా శ్రీహరి మందాడి, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు భీమినేని(ఆపరేషన్స్‌), హేమంత్‌ కొల్లా(ఆర్థికం), భానుప్రకాశ్‌ ధూళిపాళ్ల(మార్కెటింగ్‌), శ్రీనివాస్‌ చిలుకూరి(ప్రోగ్రామ్స్‌), కార్యదర్శిగా రాజేశ్‌ కాండ్రు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మురళి మేడిచర్ల(మీడియా), రవి తుమ్మల(వెబ్‌), ట్రెజరర్‌గా సుధీర్‌ మిక్కిలినేని, సంయుక్త ట్రెజరర్‌గా రవి తాండ్ర నియమితులయ్యారు.
కార్యవర్గంలో శ్రీనివాస్‌ మెంటా, వెంకటరావు దగ్గుబాటి, సుమంత్‌ రామినేని, సత్య శ్రీరామనేని, శ్రీహరీష్‌ జమ్ముల, మనోహర్‌రావు మద్దినేని, భాను లంకా, ఎమ్మాన్యుయెల్, కిశోర్‌ నారె, సంకీర్థ్‌ కటకం, కిరణ్‌ మందాడి, ఆర్‌కే బాలినేని, రాజలక్ష్మి చిలుకూరి, కిశోర్‌ గరికపాటి, వెంకట్‌ మంత్రి, ఫాలాక్ష్‌ అవస్థి వివిధ బాధ్యతలు చేపట్టనున్నారు.