TET And DSC Notification 2024 : గుడ్‌న్యూస్‌.. కేబినెట్ కీలక నిర్ణయం.టెట్ & డీఎస్సీ కి ఆమోదం..!

www.mannamweb.com


TET And DSC Notification 2024 : DSC డీఎస్సీలో 6000 పోస్టుల భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికిి ప్రతిపాదన పంపడం జరిగింది.ఈ క్రమంలోనే ఇటీవల అనగా జనవరి 31 న మంత్రివర్గ సమావేశాలను నిర్వహించారు.
దీనిలో భాగంగానే ఉపాధ్యాయ నియామకం టట్ డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత షెడ్యూల్ ని ప్రకటిస్తారని తెలియజేసారు. అయితే ముందుగా టెట్ నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఇవ్వనన్నట్లుు సమాచారం.టెట్ మరియు డీఎస్సీ కోసం కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ SGT పోస్టులకు పేపర్ 1 , పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకంగా ఏపీ టెట్ నిర్వహించనున్నారు.అయితే ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదు కాబట్టి నాలుగేళ్ల బ్యాచ్లర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివి ఉన్నవారు మాత్రమే అర్హులుగాా పేర్కొనబడతారు. ఇక టెట్ ఓసి లకు వ్రాయడానికి విరామంలో 50% ఎస్సీ, ఎస్టీ బీసీలకు PWD లకు 45 % మార్కులు పర్సంటేజీ గా ఉండాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ల కోసం ఎస్సీ, ఎస్టీ , బిసి,PWD అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ లో 40% మార్కులను ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది

అయితే ఇలా ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. అయితే గత ప్రభుత్వం 2018 లో చివరి సారిగా డీఎస్సీ నిర్వహణ జరిపింది. ఇక దీనిలో మొత్తం 7902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఆ సమయంలో దాదాపు 6.08 లక్షల మంది నుండి దరఖాస్తుల స్వీకరించబడ్డాయి.అలాగే గతంలో సార్జెంట్ హోదాలో ఉండేవారు బీఈడీ పూర్తి చేసిన వారు, అర్హులైన వారు డీఎస్సీ టెట్ తో పాటుు 100 పాయింట్లు కోసం కూడా నిర్వహించారు. TGT కోసం ఇంగ్లీష్ మీడియం కి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం టేట్ మరియు బిఎస్సి ను వేర్వేరుగా నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం.