ఉత్తర ప్రదేశ్లో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్న ఘటన సంచలనం రేపింది. గోరఖ్ పూర్ జిల్లాకు చెందిన కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు వారి ఇళ్ళనుంచి వెళ్ళిపోయి కొద్ది నెలలుగా కలిసి జీవిస్తున్నారు.
తాము ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని తెలుసుకొని స్థానికంగా ఉన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా వీరిద్దరికీ 4 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా.. వీరి భర్తలు పెట్టె చిత్ర హింసలు తట్టుకోలేకనే ఇళ్ల నుంచి వెళ్ళిపోయి కలిసి ఉంటున్నట్టు తెలిపారు. కాగా గుంజా తనపేరును బబ్లూగా మార్చుకొని తనకి భర్తగా ఉంటాడని కవిత వెల్లడించింది. అయితే వీరు పెళ్లి చేసుకోడానికి గల కారణం తెలుసుకొని అవాక్కవడం నెటిజన్స్ వంతైంది.
































