పాఠశాలలకు 233 రోజులు పనిదినాలు..అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం

www.mannamweb.com


Andhra News: 233 working days for schools..Government made academic calendar

Andhra News: పాఠశాలలకు 233 రోజులు పనిదినాలు

అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించింది. టోఫెల్‌ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం వెల్లడించనుంది. దీన్ని కొనసాగించడమా? లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకడమిక్‌ క్యాలెండర్‌కు తుదిరూపు ఇచ్చింది.

పాఠశాల విద్య పరీక్షల షెడ్యూలు ఇదీ..

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ మంగళవారం ప్రకటించింది.

ఫార్మెటివ్‌-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా.. ఫార్మెటివ్‌-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి.
సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్‌-3 వచ్చే జనవరి 2-6 వరకు నిర్వహిస్తారు.
పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 10-20 వరకు ఉంటాయి. ఫార్మెటివ్‌-4 పరీక్షలు మార్చి 3-6, సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 7-18 వరకు నిర్వహిస్తారు.
సెలవులు: దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.

క్రిస్మస్‌ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఇవ్వనున్నారు.