IBPS PO JBS : డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్‌, అప్లై చేసుకోండిలా

న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌(పీవో /ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఐబీపీఎస్‌లో 5,208 పీవో/ఎంటీ పోస్టులు.. మొత్తం పోస్టుల సంఖ్య: 5,208.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 21.07.2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. (02.07.1995 నుంచి 01.07.2005 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920(బేసిక్‌ పే)+ఇతర అలవెన్సులుతో పాటు చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:21.07.2025
» ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్‌ 2025.
» మెయిన్స్‌ పరీక్ష: అక్టోబర్‌ 2025.
» ఇంటర్వ్యూ:డిసెంబర్‌ 2025 జనవరి 2026
» వెబ్‌సైట్‌: https://www.ibps.in

ఎస్‌ఎస్‌సీలో 1,340 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-బి(నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్,మెకానికల్, ఎల క్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 1,340.
» అర్హత: సంబంధిత విభాగంలో(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌) డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయసు:01.01.2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. సీపీడబ్ల్యూడీకి చెందిన కొన్ని పోస్టులకు 32 ఏళ్ల లోపు ఉండాలి.
» పే స్కేల్‌: రూ.35,400 నుంచి రూ.1,12,400
» ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:21.07.2025
» దరఖాస్తు ఫీజుకు చివరితేది: 22.07.2025.
» దరఖాస్తు సవరణ తేదీలు:
01.08.2025 నుంచి 02.08.2025 వరకు
» పేపర్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 27.10.2025 నుంచి 31.10.2025 వరకు
» పేపర్‌-2 పరీక్ష: జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో
» వెబ్‌సైట్‌: https://ssc.gov.in

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.