పది పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు.. ఇంట్లోనే ఉండి నెలకు రూ.8000 పొందే ఛాన్స్!

www.mannamweb.com


దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో యూత్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పీఎం కౌశల్ వికాస్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ద్వారా పదో తరగతి అర్హతతో సులువుగా 8000 రూపాయలు వేతనంగా పొందవచ్చు.

ఈ స్కీమ్ ద్వారా యువతకు వేర్వేరు రంగాలలో శిక్షణ అందించి వాళ్లలో నైపుణ్యాన్ని పెంచనున్నారు.

యువతకు ఉపాధి సులభతరం చేసే విషయంలో ఈ స్కీమ్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు. మన దేశానికి చెందిన పౌరులు పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 40 విభాగాలలో ట్రైనింగ్ ఇస్తుండగా ఇంట్లో ఉండి ఆన్ లైన్ లో ట్రైనింగ్ తీసుకుంటూ కూడా శిక్షణను సులభంగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

స్కిల్ ఇండియా డిజిటల్ పై ప్రాక్టికల్ కోర్సు చేసిన యువతీ యువకులు నెలకు 8000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా కోర్సు పూర్తి చేసిన వాళ్లు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. (https://www.pmkvyofficial.org/home-page) వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధృవీకరణ పత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.