ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్

www.mannamweb.com


ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ వస్తే.. వెంటనే ఓ షాకింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. తాజాగా ఇదే జరిగింది. నిన్నగాక మొన్న మొదలైన హను రాఘవపూడి అప్‌డేట్స్ కూడా వస్తున్నాయి కానీ రాజా సాబ్ మాత్రం రావట్లేదు.

పైగా ఈ పై తాజాగా మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. మరి అదేంటి..? దాని వల్ల ఫ్యాన్స్‌కు వచ్చిన నష్టమేంటి..? ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం..

బాహుబలి తర్వాత ప్రభాస్‌తో రెగ్యులర్ లు చేయడమే మరిచిపోయారు దర్శకులు. ఆయన డేట్స్ ఇస్తే చాలు.. భారీ యాక్షన్ లు లేదంటే లార్జర్ దెన్ లైఫ్ కారెక్టర్లు చేయిస్తూ ఒకప్పటి డార్లింగ్‌ను మర్చిపోయేలా చేసారు దర్శకులు. మధ్యలో రాధే శ్యామ్‌లో లవర్ బాయ్‌లా కనిపించినా.. అందులోనూ భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జొప్పించారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి.. ఇలా ఏ తీసుకున్నా బడ్జెట్ వందల కోట్లు పక్కా. ఇలాంటి సమయంలో కాస్త రిలీఫ్ కోసం చిన్న చేయాలని అనుకున్నారు ప్రభాస్. అలా చేస్తున్నదే మారుతితో రాజా సాబ్. మిగిలిన వాటితో పోల్చినపుడు ఇది చిన్న అనిపిస్తుందేమో గానీ.. దీనికోసం కూడా 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ప్రతిరోజు పండగే తర్వాత మారుతి తెరకెక్కించిన మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో రాజా సాబ్ ఇచ్చారు ప్రభాస్. తనకు ఇచ్చిన ఆఫర్ వాడుకుంటూ.. ప్రభాస్‌ని నెవర్ బిఫోర్ అవతార్‌లో చూపించబోతున్నారు మారుతి. ఈ మధ్యే గ్లింప్స్ విడుదలైంది. ఇందులో వింటేజ్ డార్లింగ్ కనిపించారు.

తాజాగా రాజా సాబ్‌పై బాంబు పేల్చారు మేకర్స్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వస్తుందనే పూర్తిగా రూమర్స్ అని కొట్టి పారేసారు. సమ్మర్ 2025కు రానుంది రాజా సాబ్. ప్రమోషన్స్ కూడా దానికి తగ్గట్లే ఉంటాయని చెప్పుకొచ్చారు వాళ్లు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే.. అక్టోబర్ 22న మిస్టర్ పర్ఫెక్ట్ ను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.