త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?

ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటకు ముందే భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరిగితోతున్నారు. మధ్యాహ్నం అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు.ఇంట్లోనే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ముందు కూర్చుంటున్నారు. కొందరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే.. ఏసీల ధరలు పెరిగుతాయని నిపుణులు అంటున్నారు. అసలు ఎందుకు ఎసీల ధరలు పెరుగుతున్నాయో తెలుసుకుందాం..


భారతదేశంలో హీట్‌వేవ్స్ ఎయిర్ కండీషనర్ డిమాండ్‌ను పెంచుతున్నాయి వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి తయారీదారులు ఉత్పత్తి కొర తను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో హీట్‌వేవ్‌లు సాధారణంగా ఎయిర్ కండీషనర్‌ల డిమాండ్‌తో పాటు దాని ధరలను పెంచుతాయి.

భారతదేశం అంతటా హీట్‌వేవ్‌ల కారణంగా ఎయిర్ కండిషనర్‌ల డిమాండ్‌ క్రమక్రమంగా పెరిగిపోతున్నారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా కంపెనీలు ఏసీల రేట్లను పెంచే అవకాశం ఉంది.

వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్ వంటి ప్రధాన AC తయారీదారులు పరిశ్రమ.. గత ఆరు వారాలుగా కాలిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా అపూర్వమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉత్పత్తులు,మోడళ్ల కొరతను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.