70 ఏండ్లు పైబడిన పెన్షనర్లకు అదనపు పింఛన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో 70ఏండ్లకు పైబడిన పెన్షన్‌దారులకు, కుటుంబ పెన్షన్‌దారులకు అదనపు పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


పే రీవిజన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 70 నుంచి 75 ఏండ్లలోపు వారికి బేసిక్‌ పెన్షన్‌పై 15శాతం, 75 నుంచి 80 ఏండ్లలోపు వారికి 20శాతం, 80 నుంచి 85 ఏండ్లలోపు వారికి 30శాతం, 90 నుంచి 95 ఏండ్లలోపు వారికి 50శాతం, 95 నుంచి 100 ఏండ్లలోపు వారికి 60శాతం, 100ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షన్‌దారులకు 100శాతం అదనంగా పెన్షన్‌ ఇవ్వనుంది.